Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన బైడెన్
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య కాల్పుల విషయంలో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది.
ఇజ్రాయెల్ ప్రభుత్వం హెజ్బొల్లాతో కాల్పుల విరమణపై అంగీకారం కుదుర్చుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు.
ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్లో ప్రకటించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన బైడెన్
Today, President Biden and President Macron announced a cessation of hostilities between Israel and Lebanon.
— The White House (@WhiteHouse) November 27, 2024
This will cease the fighting in Lebanon, secure Israel from the threat of Hezbollah, and create the conditions to restore lasting calm so residents in both countries can… pic.twitter.com/leLYnRPA7V
వివరాలు
మేము ఒప్పందానికి కట్టుబడి ఉంటాం: బైడెన్
''ఇదొక శుభవార్త. నేను ఇజ్రాయెల్, లెబనాన్ నాయకులతో మాట్లాడాను. టెల్అవీవ్-హెజ్బొల్లాల మధ్య ఉత్కంఠభరిత పరిస్థితులకు ముగింపు చేకూర్చేందుకు అమెరికా చేసిన ప్రయత్నాలను వారు సమర్థించారు. ఇది ఒక మంచి అడుగు'' అని బైడెన్ తెలిపారు.
ఇక ఈ పరిణామంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా స్పందిస్తూ, ఈ ఒప్పందం ఎంతకాలం అమలులో ఉంటుందనేది లెబనాన్ వైఖరిపై ఆధారపడి ఉంటుందని అన్నారు.
''మేము ఒప్పందానికి కట్టుబడి ఉంటాం. కానీ ఉల్లంఘనల జరిగితే తగిన ప్రతిస్పందన ఇస్తాం. విజయం సాధించే వరకు మేము ఏకంగా పోరాటం కొనసాగిస్తాం'' అని నెతన్యాహు స్పష్టం చేశారు.