NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / North Korean cyber criminal: ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగిగా చేరి.. సంస్థ డేటాను హ్యాక్‌ చేసిన ఉత్తర కొరియా సైబర్‌ నేరస్థుడు
    తదుపరి వార్తా కథనం
    North Korean cyber criminal: ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగిగా చేరి.. సంస్థ డేటాను హ్యాక్‌ చేసిన ఉత్తర కొరియా సైబర్‌ నేరస్థుడు
    ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగిగా చేరి.. సంస్థ డేటాను హ్యాక్‌ చేసిన ఉత్తర కొరియా సైబర్‌ నేరస్థుడు

    North Korean cyber criminal: ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగిగా చేరి.. సంస్థ డేటాను హ్యాక్‌ చేసిన ఉత్తర కొరియా సైబర్‌ నేరస్థుడు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 18, 2024
    11:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర కొరియా నుండి వచ్చిన సైబర్ నేరస్థుడు ఒక ప్రైవేట్ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరి, ఆ సంస్థను హ్యాక్ చేయడానికి ప్రయత్నించాడు.

    అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, కొన్ని రోజుల క్రితం ఉత్తర కొరియాకు చెందిన సైబర్ నేరస్థుడు తన పేరు, వివరాలను మార్చుకొని ఒక కంపెనీలో రిమోట్ ఐటీ వర్కర్‌గా చేరాడు.

    ఆ కంపెనీ లండన్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో బ్రాంచీలను కలిగి ఉంది.

    నేరస్థుడు ఉద్యోగంలో చేరిన తర్వాత, తనకు ఇచ్చిన కంపెనీ యాక్సెస్‌ను ఉపయోగించి సంస్థకు చెందిన సున్నితమైన డేటాను దొంగిలిస్తూ, ఆ రహస్య సమాచారాన్ని ఇతరులకు బదిలీ చేశాడు.

    మొత్తం నెట్‌వర్క్‌ను కూడా హ్యాక్ చేయడానికి ప్రయత్నించాడు.

    వివరాలు 

    ఉత్తర కొరియాకు చెందిన సైబర్ నేరస్థులు ఎక్కువ.. 

    కానీ, అతడు తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించకపోవడంతో పాటు, పలు ఇతర కారణాల వల్ల, అతడిని కంపెనీ ఉద్యోగం నుండి తొలగించింది.

    యాజమాన్యం అతడి మెయిల్‌ను పరిశీలించడంతో ఈ విషయాలు బయటకు వచ్చాయి.

    అతడిని సైబర్ నేరస్థుడిగా గుర్తించారు. నేరస్థుడు, కంపెనీకి డేటాను ఇవ్వడానికి తిరస్కరించిన తర్వాత, డబ్బులు చెల్లించాలని బెదిరింపులకు పాల్పడ్డాడని యాజమాన్యం సైబర్ సెక్యూరిటీ సంస్థ సెక్యూర్‌వర్క్స్‌కు తెలియజేసింది.

    2022 సంవత్సరం నుండి ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి సైబర్ నేరస్థులు వివిధ కంపెనీల డేటాలను దొంగిలిస్తున్నారని సైబర్ సెక్యూరిటీ అధికారులు హెచ్చరిస్తున్నారు.

    ఈ విషయాలలో కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీరిలో ఉత్తర కొరియాకు చెందిన సైబర్ నేరస్థులు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర కొరియా
    సైబర్ నేరం

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    ఉత్తర కొరియా

    Northkorea: చెత్తతో నిండిన బెలూన్లను ఎగరేసిన  ఉత్తర కొరియా .. దక్షిణ కొరియా విమానాశ్రయ కార్యకలాపాలకు అంతరాయం  దక్షిణ కొరియా
    South Korea: తారాస్థాయికి చెత్త యుద్ధం.. దక్షిణ కొరియా అధ్యక్షుడి కార్యాలయంలోకి చెత్త బెలూన్స్ దక్షిణ కొరియా
    Nasa: నాసాపై ఉత్తర కొరియా వ్యక్తి సైబర్ దాడికి పాల్పడ్డాడని ఆరోపించిన అమెరికా  టెక్నాలజీ
    North Korea: చెత్త బుడగలు పంపిన ఉత్తరకొరియా.. దక్షిణ కొరియా వైమానిక రంగానికి సంకటం దక్షిణ కొరియా

    సైబర్ నేరం

    2022 లో క్రిప్టో, మాల్వేర్ దాడులు వంటి సైబర్ నేరాల పెరుగుదల క్రిప్టో కరెన్సీ
    డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ హైదరాబాద్
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాయిస్ స్కామ్‌లు; తస్మాత్ జాగ్రత్త  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    సైబర్ దాడులను నిరోధించేందుకు 'మాయ'ను తీసుకొస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ  రక్షణ శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025