
Donald Trump: భారత్ పై 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్ .. ఆగష్టు 1 నుంచి అమలు
ఈ వార్తాకథనం ఏంటి
రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. ఇతర దేశాలపై కీలక ఆర్థిక నిర్ణయాలను తీసుకుంటూ, భారీ సుంకాలను విధిస్తూ, ప్రపంచ వాణిజ్యంలో తనదైన ముద్ర వేశాడు. ఇప్పటికే పలు దేశాలపై అధిక సుంకాలు విధించిన ట్రంప్, తాజాగా భారత్ను కూడా అదే జాబితాలో చేర్చాడు. భారత్పై 25 శాతం దిగుమతి సుంకాలు అమలు చేయనున్నట్టు ప్రకటించాడు. ఈ కొత్త సుంకాల విధానం ఆగస్ట్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భారత్ పై 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్ ..
US President Donald Trump announces 25% tariffs on India starting August 1st.
— ANI (@ANI) July 30, 2025
Posts, "Remember, while India is our friend, we have, over the years, done relatively little business with them because their Tariffs are far too high, among the highest in the World, and they have the… pic.twitter.com/eqVj981lGD
వివరాలు
భారతదేశం విధించే సుంకాలు ప్రపంచంలోనే అత్యధికం
ట్రంప్ ట్రూత్ అనే ఖాతాలో "భారతదేశం మా మిత్రదేశం అయినప్పటికీ,ఎన్నో సంవత్సరాలుగా వారితో మనం స్వల్ప స్థాయిలోనే వాణిజ్యం కొనసాగిస్తున్నాం. ఇందుకు ప్రధాన కారణం, భారతదేశం విధించే సుంకాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉండటం. అంతేకాకుండా, వారు ద్రవ్యేతరంగా విదేశీ వాణిజ్యాన్ని నియంత్రించేందుకు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన అడ్డంకులను అమలు చేస్తున్నారు. భారత్ తమ రక్షణ పరికరాల కోసం ఎక్కువగా రష్యా నుంచే కొనుగోళ్లు చేస్తోంది. ప్రస్తుతానికి ఉక్రెయిన్పై కొనసాగుతున్న దాడులను ఆపాలని ప్రపంచం ఆశిస్తున్న తరుణంలోనూ, భారత్ చైనా సరసన నిలిచి రష్యా ఉత్పత్తులకు అతిపెద్ద కొనుగోలుదారులలో ఒకటిగా మారింది. ఈ కారణాల వల్ల, భారతదేశం అమెరికాకు ఆగస్ట్ 1 నుంచి 25 శాతం సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది" అని ట్రంప్ పేర్కొన్నాడు.