English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Donald Trump : జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి.. ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. అండగా ఉంటామని హామీ
    తదుపరి వార్తా కథనం
    Donald Trump : జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి.. ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. అండగా ఉంటామని హామీ
    Donald Trump : జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి.. ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. అండగా ఉంటామని హామీ

    Donald Trump : జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి.. ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. అండగా ఉంటామని హామీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 23, 2025
    08:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

    ఈ సంక్షోభ సమయంలో భారత్‌కు మద్దతుగా ప్రపంచ దేశాలు నిలుస్తున్నాయి.

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి ఈ సంఘటనపై చర్చించారు.

    ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ అధికారికంగా వెల్లడించింది.

    విదేశాంగ శాఖ ప్రకారం.. "ట్రంప్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.దాడికి బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు భారత్‌కు పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని తెలిపారు. మోదీకి ఫోన్ చేసి మద్దతు ప్రకటించారు" అని పేర్కొంది.

    ప్రధాని మోదీ, ట్రంప్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో భారత్‌కు అండగా నిలుస్తున్న అంతర్జాతీయ నాయకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

    వివరాలు 

    గాలింపు చర్యలు ముమ్మరం చేసిన భద్రతా బలగాలు

    ఈదాడిపై ట్రంప్ ముందుగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.భారత్‌తో కలిసి నిలుస్తామని,ఈ విషయంలో తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.

    ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దాడిపై తీవ్రంగా స్పందించారు.ఇలాంటి ఉగ్రదాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.

    దాడికి పాల్పడిన వారిని తప్పకుండా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రీనగర్‌కు చేరుకున్నారు. ఈ రోజు పహల్గాం ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించనున్నారు.

    పహల్గాం పరిసర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.హోం మంత్రి ఉన్నతస్థాయి అధికారులతో చర్చలు జరుపుతున్నారు.

    ఉగ్రవాదులు వెళ్లిన అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

    ఎలాంటి పరిస్థితులలోనూ ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదని భద్రతాదళాలు స్పష్టం చేస్తున్నాయి.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డొనాల్డ్ ట్రంప్
    నరేంద్ర మోదీ

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్

    డొనాల్డ్ ట్రంప్

    Trump-Putin: పుతిన్‌పై ఆగ్రహంగా ట్రంప్.. తనకు కోపం తెప్పించే పనులు చేయొద్దని హితవు వ్లాదిమిర్ పుతిన్
    TikTok: అమెరికాలో టిక్‌టాక్  కొనుగోలుకు  అనేక మంది ఆసక్తి : డోనాల్డ్ ట్రంప్  టిక్ టాక్
    Israel-US: అమెరికాపై విధించిన సుంకాలను రద్దు చేసిన ఇజ్రాయెల్! అమెరికా
    Trump: పరస్పర సుంకాన్ని ప్రకటించిన  డొనాల్డ్ ట్రంప్.. తక్షణమే అమల్లోకి.. అంతర్జాతీయం

    నరేంద్ర మోదీ

    PM Modi: నేటి నుంచి రెండ్రోజులు మారిషస్‌‌లో మోదీ..  భారతదేశం
    PM Modi: మారిషస్‌ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ప్రత్యేక కానుక.. కుంభమేళా పవిత్ర జలం గిఫ్ట్  భారతదేశం
    PM Modi: ప్రధాని మోదీకి మారిషస్‌ అత్యున్నత పురస్కారం.. ప్రకటించిన మారిషస్‌ ప్రధాని నవీన్‌ రామ్‌గులాం  భారతదేశం
    Amaravati: ఏప్రిల్ 15న ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటన.. రాజధాని పునః ప్రారంభ పనులకు శ్రీకారం  అమరావతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025