Pakistan Blast: పోలీసులే లక్ష్యంగా పాకిస్థాన్ లో పేలుడు.. ఐదుగురు మృతి
వాయువ్య పాకిస్థాన్లో పోలీసులను లక్ష్యంగా చేసుకొని పెట్టిన బాంబు పేలి శుక్రవారం ఐదుగురు మృతి చెందారని ,రెస్క్యూ,పోలీసు అధికారులు తెలిపారు. అయితే దీనికి బాధ్యులు ఎవరు అనే విషయాన్ని ప్రకటించలేదు.పేలుడు జరిగిన డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న చట్టవిరుద్ధమైన గిరిజన జిల్లాల అంచున ఉంది. ఇది చాలా కాలంగా స్వదేశీ,విదేశీ ఇస్లామిస్ట్ మిలిటెంట్లకు నిలయంగా ఉంది. నగరంలోని పోలీసు పెట్రోలింగ్ మార్గానికి సమీపంలో బాంబు పేలిందని పోలీసు అధికారి మహ్మద్ అద్నాన్ తెలిపారు. ఈ సంఘటన ఆత్మాహుతి దాడి లేదా సమీపంలో అమర్చిన బాంబు వల్ల జరిగిందా అనేది వెంటనే స్పష్టంగా తెలియదని అన్నారు. పేలుడులో ఐదుగురు మరణించారని, 21మంది గాయపడ్డారని రెస్క్యూ అధికారి ఐజాజ్ మెహమూద్ చెప్పారు.