NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / PM Modi: ఏఐ అంటే అమెరికన్ ఇండియన్స్ .. ప్రవాస భారతీయుల సదస్సులో మోదీ
    తదుపరి వార్తా కథనం
    PM Modi: ఏఐ అంటే అమెరికన్ ఇండియన్స్ .. ప్రవాస భారతీయుల సదస్సులో మోదీ
    ప్రవాస భారతీయుల సదస్సులో మోదీ

    PM Modi: ఏఐ అంటే అమెరికన్ ఇండియన్స్ .. ప్రవాస భారతీయుల సదస్సులో మోదీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 23, 2024
    08:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు మూడో విడతలో మరింత ఉన్నత లక్ష్యాలను చేరేందుకు కృషి చేస్తున్నామని,ఈ దిశగా మూడు రెట్లు శక్తితో ముందుకు వెళ్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.

    భారత్‌ ప్రస్తుతం అవకాశాల దేశంగా మారిందని తెలిపారు.న్యూయార్క్‌లో నస్సావ్‌ వెటరన్స్‌ కొలస్సియంలో జరిగిన ప్రవాస భారతీయుల సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    ఈ కార్యక్రమానికి దాదాపు 13,000 మంది హాజరయ్యారు.''మేము అత్యంత క్లిష్టమైన,సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశాం.ఈ ఎన్నికల్లో అసాధారణ పరిణామం చోటు చేసుకుంది.'అబ్‌ కీ బార్‌ మోదీ సర్కార్‌'(మరోసారి మోదీ ప్రభుత్వం)వచ్చింది.

    "నెహ్రూ పాలన అనంతరం 60 ఏళ్లలో ప్రజలు ఇచ్చిన తీర్పుకు విశేష ప్రాధాన్యం ఉంది'' అని మోదీ అన్నారు.

    వివరాలు 

    సుపరిపాలనకు అంకితం

    సుపరిపాలన,సమృద్ధి చెందిన భారత్‌ను సాధించడానికి తన జీవితాన్ని అంకితం చేశానని మోదీ తెలిపారు.

    తనను విధి రాజకీయాల వైపు తీసుకెళ్లిందని, సీఎం లేదా ప్రధాని అవుతానని ఎన్నడూ ఊహించలేదని అన్నారు.

    గత పదేళ్లలో తన సుపరిపాలనను గుర్తించి ప్రజలు మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చారని వివరించారు.

    సంస్కృత శ్లోకాన్ని ఉటంకిస్తూ, త్యాగం చేసే వారు మాత్రమే ఫలాలను పొందుతారని చెప్పారు.

    ప్రవాస భారతీయులు ఎక్కడ ఉన్నా వారి కృషి ద్వారా సామాజిక, దేశాభివృద్ధికి సహకరిస్తారని పేర్కొన్నారు.

    భారతీయ అమెరికన్ల కృషి దేశాన్ని గర్వపడేలా చేస్తోందని ఆయన కొనియాడారు.

    వివరాలు 

    140 కోట్ల మంది గౌరవం 

    ''డెలావేర్‌లోని తన ఇంటికి శనివారం అధ్యక్షుడు జో బైడెన్‌ నన్ను తీసుకెళ్లారు. ఆయన ప్రేమ, వాత్సల్యం నా మనసును స్పృశించింది. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం.

    ప్రవాస భారతీయుల విజయాల వల్లనే ఈ గౌరవం సాధ్యమైంది'' అని మోదీ తెలిపారు.

    అమెరికాలో నివసిస్తున్న వేల మంది ప్రవాస భారతీయులు భారత్‌కు బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఉన్నారని అన్నారు.

    భారత్‌, అమెరికా కలిసి ప్రజాస్వామ్య వేడుకలో భాగస్వాములయ్యాయని తెలిపారు.

    ''ఏఐ అంటే ప్రపంచానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అని అర్థం. కానీ నా దృష్టిలో ఏఐ అంటే అమెరికా, ఇండియా స్ఫూర్తి. మీరు (ప్రవాస భారతీయులు) భారత్‌, అమెరికాలను అనుసంధానం చేస్తున్నారు. మీ ప్రతిభ, నైపుణ్యం, నిబద్ధత ప్రపంచంలో అసమానమైనవి.

    వివరాలు 

    2036లో భారత్‌లో ఒలింపిక్స్‌ లక్ష్యం 

    భిన్నత్వాన్ని మనం అర్థం చేసుకుంటాం, ఎందుకంటే అది మన రక్తంలో, సంస్కృతిలో ఉంది.

    2036లో భారత్‌లో ఒలింపిక్స్‌ నిర్వహించడానికి గట్టి లక్ష్యంతో కృషి చేస్తున్నాం. కోట్లు మంది భారతీయుల ఆకాంక్షలే అభివృద్ధి దిశగా దేశాన్ని నడిపిస్తున్నాయి'' అని మోదీ పేర్కొన్నారు.

    ప్రవాస భారతీయుల సదస్సులో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

    ఈ వేడుకల్లో 382 మంది జాతీయ, అంతర్జాతీయ కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. వీరిలో 117 మంది కళాకారులు తమ కళా ప్రదర్శనల ద్వారా ప్రతినిధులను స్వాగతించారు.

    వివరాలు 

    మోదీ సమక్షంలో  దేవిశ్రీ ప్రసాద్ "నమస్తే ఇండియా" పాట 

    ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ 'పుష్ప-1' సినిమా నుండి 'శ్రీవల్లి' పాటతో కార్యక్రమంలో హాజరైన వారిని ఉత్సాహపరిచారు.

    ఆయన గానం చేస్తున్న 'హర్‌ ఘర్‌ తిరంగా' పాటతో ప్రధాని నరేంద్ర మోదీ వేదికపైకి వచ్చారు.

    ఆ సమయంలో హాల్ మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ "నమస్తే ఇండియా" అంటూ ప్రవాస భారతీయులను సాదరంగా పలకరించడమేకాకుండా, మోదీ సమక్షంలో తన పాటను కొనసాగించారు.

    అనంతరం, మోదీ దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు గుజరాతీ గాయకుడు ఆదిత్య గాఢ్వీ మరియు ఇతర కళాకారులను అభినందించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    అమెరికా

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    నరేంద్ర మోదీ

    National Sports Day 2024: క్రీడాకారులకు జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ  జాతీయ క్రీడా దినోత్సవం
    PM Modi: నేడు మహారాష్ట్రలో మోదీ పర్యటన.. రూ.76 000 కోట్లు ప్రాజెక్ట్ కు శంకుస్థాపన భారతదేశం
    PM Modi:'తల వంచి క్షమాపణ కోరుతున్నాను'.. శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ  భారతదేశం
    Mamata Banerjee: కోల్‌కతా కేసులో మమతా బెనర్జీ లేఖపై కేంద్రం కౌంటర్  మమతా బెనర్జీ

    అమెరికా

    Kamala Harris: 'వైట్ డ్యూడ్స్ ఫర్ హారిస్' X ఖాతా తొలగింపు  కమలా హారిస్‌
    Intel Lays OFF: 18వేల మంది ఉద్యోగులపై వేటు వేసిన ఇంటెల్ వ్యాపారం
    US President Elections: డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ కమలా హారిస్‌
    ప్రపంచ చరిత్రలో మొదటిసారి.. టైటానియం గుండెతో రోగి 8 రోజులు జీవించాడు గుండె
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025