NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / voter turnout: భారత్‌కు 21 కోట్ల డాలర్ల ఎన్నికల నిధుల నిలుపుదలపై అమెరికా ప్రకటన 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    voter turnout: భారత్‌కు 21 కోట్ల డాలర్ల ఎన్నికల నిధుల నిలుపుదలపై అమెరికా ప్రకటన 
    భారత్‌కు 21 కోట్ల డాలర్ల ఎన్నికల నిధుల నిలుపుదలపై అమెరికా ప్రకటన

    voter turnout: భారత్‌కు 21 కోట్ల డాలర్ల ఎన్నికల నిధుల నిలుపుదలపై అమెరికా ప్రకటన 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 17, 2025
    02:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విదేశీ నిధులను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా, భారత్‌కు అందిస్తున్న 2.1 కోట్ల డాలర్ల ఎన్నికల నిధులను నిలిపేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.

    ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. భారత్, బంగ్లాదేశ్‌తో పాటు పలు దేశాలకు ఎన్నికల నిధుల రూపంలో కోట్లాది డాలర్లు అందించే ప్రణాళికను రద్దు చేస్తున్నట్టు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్‌) ఆదివారం వెల్లడించింది.

    అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును అర్థరహిత కార్యక్రమాలకు వినియోగించడం మంచిది కాదనే ఉద్దేశ్యంతో, అనవసర నిధులన్నింటిని నిలిపివేస్తున్నామని ఎక్స్‌ (మాజీ ట్విట్టర్‌) వేదికగా డోజ్ ప్రకటించింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    డోజ్‌ చేసిన ట్వీట్ 

    US taxpayer dollars were going to be spent on the following items, all which have been cancelled:
    - $10M for "Mozambique voluntary medical male circumcision"
    - $9.7M for UC Berkeley to develop "a cohort of Cambodian youth with enterprise driven skills"
    - $2.3M for "strengthening…

    — Department of Government Efficiency (@DOGE) February 15, 2025

    వివరాలు 

    భారత్‌కు నిధుల నిలుపుదలపై పెరుగుతున్న వివాదం 

    అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రభుత్వ ఖర్చులను నియంత్రించేందుకు ప్రత్యేకంగా డోజ్‌ను ఏర్పాటు చేసినట్లు ఇదివరకే వెల్లడైంది.

    "భారత్‌లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు 21 కోట్ల డాలర్ల నిధులను కేటాయించాం. ఇకపై ఆ సహాయాన్ని నిలిపివేస్తున్నాం" అని డోజ్ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

    అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ట్రంప్ భేటీ అయిన మూడు రోజులకే ఈ ప్రకటన వెలువడడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    అయితే, ఈ నిధులు ఎప్పుడు, ఎంత తరచుగా, ఎవరికీ అందించబడ్డాయి అనే అంశంపై స్పష్టత లేదు.

    దీనిపై భారతీయ రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. భారత ఎన్నికల వ్యవస్థలో . విదేశీ జ్యోకమేంటంటూ బీజేపీ విమర్శించింది.

    వివరాలు 

    భారత ఎన్నికల వ్యవస్థలో విదేశీ ప్రభావం? 

    ''ఓటింగ్‌ శాతం పెంచడానికి 21 కోట్ల డాలర్లా? దీని వల్ల ఎవరికి లాభం? ఇది అధికార పార్టీకైతే కాదు!'' !'' అంటూ బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాలవ్య ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

    ఈ నిధులు గతంలో యూపీఏ ప్రభుత్వం అందుకుందని ఆరోపించారు.

    2012లో, ఆ సమయంలో ప్రధాన ఎన్నికల అధికారి అయిన ఎస్‌.వై. ఖురేషి నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం జార్జ్ సోరోస్‌కు చెందిన ఓపెన్ సోసైటీ ఫౌండేషన్ అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన ఆరోపించారు.

    భారత ఎన్నికల వ్యవస్థపై విదేశీ ప్రభావాన్ని అంగీకరించడమే ఇది అని ఆయన వ్యాఖ్యానించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     అమిత్ మాలవ్య  చేసిన ట్వీట్ 

    Once again, it is George Soros, a known associate of the Congress party and the Gandhis, whose shadow looms over our electoral process.

    In 2012, under the leadership of S.Y. Quraishi, the Election Commission signed an MoU with The International Foundation for Electoral… https://t.co/PO13Iyroee pic.twitter.com/gdgAQoDbPh

    — Amit Malviya (@amitmalviya) February 16, 2025

    వివరాలు 

    CEPPS అంటే ఏమిటి? 

    ఇక, బంగ్లాదేశ్‌ రాజకీయ స్థిరత్వాన్ని పెంపొందించేందుకు కేటాయించిన 2.9 కోట్ల డాలర్ల నిధులను కూడా నిలిపివేస్తున్నట్లు డోజ్‌ స్పష్టం చేసింది.

    అదనంగా 15కి పైగా దేశాలకు ఇస్తున్న నిధులను కూడా రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.

    CEPPS అంటే యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) ద్వారా నిధులు పొందే లాభాపేక్షలేని, పక్షపాతరహిత, ప్రభుత్వేతర సంస్థలను కలిగి ఉంది, వీటిని ట్రంప్ మూసివేయాలనుకుంటున్నారు.

    వివరాలు 

    ఎక్స్‌ లో స్పదించిన మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషి

    అమెరికా ఇచ్చే 21 మిలియన్‌ డాలర్ల సాయాన్ని నిలిపివేసిందన్న వార్తలపై ఖురేషి ఎక్స్‌లో స్పందించారు.

    'భారతదేశంలో ఓటర్ టర్నౌట్ విషయంలో సహాయం కోసం నేను సీఈసీగా ఉన్న సమయంలో ఎన్నికల కమిషన్ అమెరికాతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదనే విషయం పూర్తిగా నిజం.నేను 2012లో సీఈసీగా ఉన్నప్పుడు,మేము కేవలం ఐఎఫ్‌ఈఎస్‌తో (IFES) సిబ్బంది శిక్షణ కోసం మాత్రమే ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ ఒప్పందంలో ఎలాంటి ఆర్థిక సహాయానికి సంబంధించిన ప్రస్తావన లేదు. అలాగే, ఆర్థిక లేదా న్యాయపరమైన బాధ్యతలు ఉండవని స్పష్టంగా పేర్కొన్నాం' అని ఖురేషి తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    భారతదేశం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    అమెరికా

    US Airstrike On Syria: సిరియాపై యుఎస్ వైమానిక దాడి.. అల్ ఖైదా నాయకుడు హతం  సిరియా
    Lay's potato chips recall: అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక.. భారీగా లేస్ పాకెట్స్ ను రీకాల్ బిజినెస్
    Deepseek: అమెరికాను షేక్ చేస్తున్న చైనా ఏఐ ''డీప్‌సీక్‌''.. ఉద్యోగులు ఇన్‌స్టాల్ చేయొద్దని యూఎస్ కాంగ్రెస్ ఆదేశం.. డీప్‌సీక్‌
    Philadelphia: ఫిలడెల్ఫియాలోని షాపింగ్ మాల్ సమీపంలో కూలిన విమానం.. ఆరుగురు మృతి   అంతర్జాతీయం

    భారతదేశం

    India's Manufacturing Sector Surges: తయారీ రంగంలో దూసుకుపోతున్న భారత్.. హెచ్‌ఎస్‌డీసీ నివేదిక  చైనా
    IPS Salary: ఐపీఎస్ అధికారుల నెల జీతం ఎంతో తెలుసా..? లైఫ్-స్టైల్
    Richest Indian states:భారతదేశంలో అత్యంత ధనిక రాష్ట్రం ఏదో తెలుసా? ఆ లిస్ట్ లో తెలుగు రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయంటే? భారతదేశం
    India-China: గస్తీ ఒప్పందం కుదుర్చుకున్న వేళ.. భారత్-చైనా రక్షణ మంత్రులు భేటీ రాజ్‌నాథ్ సింగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025