NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Gurpatwant Singh Pannun: CRPF పాఠశాలలను మూసివేయండి.. భారత్‌కు పన్నూన్ హెచ్చరిక 
    తదుపరి వార్తా కథనం
    Gurpatwant Singh Pannun: CRPF పాఠశాలలను మూసివేయండి.. భారత్‌కు పన్నూన్ హెచ్చరిక 
    CRPF పాఠశాలలను మూసివేయండి.. భారత్‌కు పన్నూన్ హెచ్చరిక

    Gurpatwant Singh Pannun: CRPF పాఠశాలలను మూసివేయండి.. భారత్‌కు పన్నూన్ హెచ్చరిక 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 25, 2024
    10:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌లోని సీఆర్పీఎఫ్‌ పాఠశాలలను మూసివేయాలని అమెరికాలో నివసిస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ హెచ్చరికలు జారీ చేశారు.

    ఆయన కేంద్ర హోంశాఖ మంత్రికి సమాచారాన్ని అందించిన వారికి బహుమతి ప్రకటించారు.

    ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. మాజీ సీఆర్పీఎఫ్‌ అధికారి, పంజాబ్‌ మాజీ డీజీపీ కేపీఎస్‌ గిల్‌, మాజీ రా అధికారి వికాస్‌ యాదవ్‌లపై పన్నూ ఆరోపణలు చేశాడు, వారు తమ హక్కులను హననం చేశారని పేర్కొన్నారు.

    పంజాబ్‌లోని సిక్కులపై దాడులు జరిగినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు సీఆర్పీఎఫ్‌ పాఠశాలలను బహిష్కరించాలని పన్నూన్ కోరారు.

    స్వర్ణ దేవాలయంపై దాడి, 1984లో సిక్కుల ఊచకోతకు సంబంధించి సీఆర్పీఎఫ్‌ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు.

    వివరాలు 

    దిల్లీ  సీఆర్పీఎఫ్‌ పాఠశాల పేలుడుకు 'జస్టిస్‌ లీగ్‌ ఇండియా' బాధ్యత 

    ''భారత సీఆర్పీఎఫ్‌కు హోం మంత్రి అమిత్‌ షా నాయకత్వం వహిస్తున్నారు. హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు ఆయనే కిరాయి హంతకులను నియమించారు. న్యూయార్క్‌లో నా హత్యకు కుట్ర పన్నారు'' అని పన్నూన్ ఆరోపించారు.

    అమిత్‌షా విదేశీ పర్యటనల సమాచారాన్ని ముందుగా అందించిన వారికి మిలియన్‌ డాలర్లు బహుమతి ఇస్తానని ప్రకటించారు.

    దిల్లీలోని రోహిణి ప్రశాంత్‌ విహార్‌ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ పాఠశాల వద్ద చోటుచేసుకున్న పేలుడుకు 'జస్టిస్‌ లీగ్‌ ఇండియా' అనే ఖలిస్థానీ అనుకూల గ్రూపు బాధ్యత తీసుకొంది.

    ఖలిస్థానీ వేర్పాటువాదులను సమర్థించడానికి ప్రతీకారంగా ఈ చర్యను చేపట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

    వివరాలు 

    తెల్ల టీషర్టు ధరించిన అనుమానితుడి గుర్తింపు 

    పేలుడు సందర్భంగా విడుదల చేసిన వీడియోలో, ''కొందరు గూండాలతో భారత నిఘా ఏజెన్సీ మా సభ్యుల నోరు మూయాలని చూస్తే.. వారు మూర్ఖులుగా ఉండేందుకు కారణం అవుతారు. మేము వారికి ఎంత దగ్గరగా ఉన్నామో వారు ఊహించలేరు. ఏక్షణంలోనైనా దాడి చేయగల సామర్థ్యం మాకు ఉంది. ఖలిస్థాన్‌ జిందాబాద్'' అనే సందేశం కూడా ఉంది.

    ఇప్పటికే తెల్ల టీషర్టు ధరించిన అనుమానితుడిని గుర్తించారు. పేలుడు జరగడానికి ముందురోజు రాత్రి ఆ ప్రదేశంలో అతడు ఏదో చేస్తుండడం అనుమానాస్పదంగా కనిపించింది.

    దానికి తరువాత దేశంలోని పలు సీఆర్పీఎఫ్‌ పాఠశాలలకు బెదిరింపులు రావడం ప్రారంభమైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌

    తాజా

    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం
    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ

    గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌

    SFJ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై కేసు నమోదు  భారతదేశం
    SFJ: ఎయిర్ ఇండియాకు పెను ముప్పు.. నవంబర్ 19న విమానంలో ప్రయాణించవద్దన్న పన్నూన్ కెనడా
    కేసుల దర్యాప్తులో అమెరికాకు సహకరిస్తాం.. కెనడాకు మాత్రం నో: భారత్  కెనడా
    Pannun : పన్నూన్‌ హత్యకు భారత ప్రభుత్వం ఉద్యోగిపై ఆరోపణలు..అమెరికాలో కేసు నమోదు ఖలిస్థానీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025