NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Trump: ఆ దేశానికి నిధులు ఇవ్వాల్సిన పనిలేదు.. డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు.. 
    తదుపరి వార్తా కథనం
    Trump: ఆ దేశానికి నిధులు ఇవ్వాల్సిన పనిలేదు.. డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు.. 
    డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు..

    Trump: ఆ దేశానికి నిధులు ఇవ్వాల్సిన పనిలేదు.. డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 19, 2025
    09:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో వ్యయాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన డోజ్‌ (DOGE) విభాగం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారాయి.

    భారత్‌లో (India) జరిగే ఎన్నికల్లో ఓటర్ల టర్నౌట్‌ను పెంచే లక్ష్యంతో కేటాయించిన 21 మిలియన్ డాలర్ల నిధి (Fund to boost Voter Turnout)ను ఈ విభాగం ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే.

    ఈ నిర్ణయాన్ని తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మద్దతు తెలపడం చర్చనీయాంశమైంది.

    అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును ఈ నిధుల కోసం ఎందుకు ఉపయోగించాలనే ప్రశ్నను ట్రంప్ లేవనెత్తారు.

    వివరాలు 

    భారత్‌ దగ్గర చాలా డబ్బు ఉంది

    ఫ్లోరిడాలోని తన నివాసంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు.

    ఈ సందర్భంగా నిధుల రద్దు గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ— "భారత్‌కు మేమెందుకు 21 మిలియన్ డాలర్లు ఇవ్వాలి? వాళ్ల వద్ద ఇప్పటికే చాలా డబ్బు ఉంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాల్లో భారత్ ఒకటి. వారు విధించే సుంకాలు కూడా అధికంగా ఉంటాయి. ఈ విషయంలో అమెరికా, భారత్‌ను చేరుకోవడం అసాధ్యం. నాకు భారత ప్రజలు, అక్కడి ప్రధాని పట్ల ఎంతో గౌరవం ఉంది. కానీ, ఓటర్ల సంఖ్యను పెంచేందుకు మా దేశ డబ్బును ఎందుకు ఖర్చు చేయాలి? అమెరికాలో ఓటర్ల పరిస్థితి ఎలా ఉంది?" అని ట్రంప్ ప్రశ్నించారు.

    వివరాలు 

    భారత ఎన్నికల నిధులు రద్దు

    డోజ్‌ విభాగం, ప్రపంచంలోని వివిధ దేశాలకు ఇచ్చే నిధులను తగ్గించేందుకు ఫిబ్రవరి 16న ఒక జాబితా విడుదల చేసింది.

    ఈ జాబితాలో భాగంగా భారత ఎన్నికల నిధులను కూడా రద్దు చేసినట్లు వెల్లడించింది.

    అలాగే, బంగ్లాదేశ్, నేపాల్‌ వంటి ఇతర దేశాలకు కేటాయించిన నిధులను కూడా ఉపసంహరించుకుంది. అయితే, ఈ నిర్ణయం భారతదేశంలో రాజకీయ వాదనలకు దారితీసింది.

    వివరాలు 

    భారత ఎన్నికల వ్యవస్థలో జోక్యం చేసుకోవడమే..

    "ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్ డాలర్లా? ఇది భారత ఎన్నికల వ్యవస్థలో జోక్యం చేసుకోవడమే అవుతుంది. ఈ నిధులతో అసలు ఎవరు లాభపడుతున్నారు? అధికార పార్టీ మాత్రం కాదు," అని బీజేపీ (BJP) జాతీయ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ తన సోషల్ మీడియా ఖాతాలో వ్యాఖ్యానించారు.

    భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో విదేశీ సంస్థలు వ్యాపించడానికి ప్రయత్నిస్తున్నాయి అంటూ ఆయన మండిపడ్డారు.

    అంతేకాదు, కాంగ్రెస్‌ పార్టీ విదేశీ బంధాలు బయటపడుతున్నాయని ఆరోపించారు. అయితే, ఈ విమర్శలను కాంగ్రెస్‌ నేతలు ఖండించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డొనాల్డ్ ట్రంప్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    డొనాల్డ్ ట్రంప్

    Iron Dome: ఐరన్‌ డోమ్‌ తయారీకి అమెరికా సిద్ధం.. ట్రంప్‌ ప్రకటన అమెరికా
    Elon Musk: సునీతా విలియమ్స్,బారీ విల్మోర్‌లను తిరిగి తీసుకురమ్మని ట్రంప్‌ సాయం అడిగారు: మస్క్‌ ఎలాన్ మస్క్
    Donald Trump: ట్రంప్‌కు రూ.216 కోట్లు చెల్లించనున్న మెటా.. ఎందుకంటే..?  మెటా
    Donald Trump: బానిసల పిల్లల కోసమే జన్మతః పౌరసత్వం.. ప్రపంచమంతా వచ్చి అమెరికాలో ఎగబడితే ఎలా?: ట్రంప్‌ అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025