Hamas-US: అమెరికా బందీల విడుదల కోసం హమాస్తో వైట్హౌస్ రహస్య చర్చలు
ఈ వార్తాకథనం ఏంటి
గాజాలో హమాస్ చెరలో ఉన్న అమెరికా పౌరుల విషయంలో వైట్ హౌస్ రహస్యంగా చర్యలు చేపట్టినట్లు సమాచారం.
హమాస్ చెరలో ఉన్న అమెరికన్ బందీలను విడుదల చేయాలని అమెరికా అధికారులు హమాస్ను కోరినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ చర్చలు ఇజ్రాయెల్కు సమాచారం ఇవ్వకుండా జరిగినట్లు తెలుస్తోంది. 1997లో అమెరికా హమాస్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.
ఆ తర్వాత నుంచి హమాస్తో ఎలాంటి అధికారిక సంబంధాలు పెట్టుకోలేదు.
అయితే 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసి దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లింది.
అప్పటి నుంచి వారు హమాస్ చెరలోనే ఉన్నారు. ఇటీవల ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వంతో హమాస్ కొంతమందిని విడుదల చేసింది.
వివరాలు
హమాస్ చెరలో 59 మంది బందీలు
అలాగే, ఇజ్రాయెల్ కూడా కొంతమంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అయితే ఇంకా ఇజ్రాయెల్, ఇతర దేశాలకు చెందిన బందీలు హమాస్ చెరలోనే ఉన్నారు.
వారి విడుదల కోసం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రతినిధి ఆడమ్ బోహ్లర్ హమాస్తో నేరుగా చర్చలు జరిపినట్లు సమాచారం.
గత వారం దోహాలో జరిగిన ఈ చర్చల్లో బందీలను విడుదల చేయాలని హమాస్ను కోరినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం హమాస్ చెరలో 59 మంది బందీలు ఉన్నట్లు సమాచారం,అందులో 5 మంది అమెరికా పౌరులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
వారి విడుదల కోసం వైట్ హౌస్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఖతార్ ప్రధాన మంత్రి కలిసే ప్రయత్నం చేశారు.
వివరాలు
యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు ఇజ్రాయెల్ సంకేతం
కాల్పుల విరమణ గురించి కూడా చర్చించాలని భావించారు, కానీ హమాస్ ఇందుకు ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. దాంతో స్టీవ్ విట్కాఫ్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఇటీవల హమాస్-ఇజ్రాయెల్ మధ్య తొలివిడత కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందం గత శనివారంతో ముగిసింది.
మరోసారి ఒప్పందం జరగాల్సి ఉన్నప్పటికీ,ప్రస్తుతం అది అనిశ్చితంగా మారింది.
ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్ను తీవ్రంగా హెచ్చరించారు.
బందీలను విడుదల చేయకపోతే తగిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
అంతేకాకుండా గాజాను స్వాధీనం చేసుకుంటామని,పాలస్తీనియన్లు గాజా నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు.
మరోవైపు ఇజ్రాయెల్ కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ఏ రూపం తీసుకుంటాయో వేచి చూడాల్సిందే.