NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market: ఉద్రిక్తతల ప్రభావం.. సెన్సెక్స్‌ 880 పాయింట్లు పతనం!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock market: ఉద్రిక్తతల ప్రభావం.. సెన్సెక్స్‌ 880 పాయింట్లు పతనం!
    ఉద్రిక్తతల ప్రభావం.. సెన్సెక్స్‌ 880 పాయింట్లు పతనం!

    Stock market: ఉద్రిక్తతల ప్రభావం.. సెన్సెక్స్‌ 880 పాయింట్లు పతనం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 09, 2025
    04:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్-పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్ లను భారీగా ప్రభావితం చేశాయి.

    సరిహద్దు ప్రాంతాల్లో పాక్ దాడుల యత్నాలను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టినప్పటికీ, వీటి ప్రభావంతో మార్కెట్లలో పతన ధోరణి కొనసాగింది.

    ఈ ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవొచ్చన్న ఆందోళనలతో షేర్ల అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి.

    వరుసగా రెండవ రోజూ స్టాక్ సూచీలు క్షీణించాయి. సెన్సెక్స్‌ 800 పాయింట్లకుపైగా నష్టపోయి 80వేల దిగువకు చేరింది. నిఫ్టీ 24 వేల మార్కు సమీపంలో ముగిసింది.

    విమానయానం, పర్యాటకం, రియల్‌ ఎస్టేట్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడితో తీవ్రంగా నష్టపోయాయి. అయితే, ఈ నేపథ్యంలో రక్షణ రంగ షేర్లకు డిమాండ్ పెరిగింది.

    Details

    ఇంట్రాడేలో ఇది 8 శాతం పెంపు

    డ్రోన్ల తయారీ సంస్థ ఐడియా ఫోర్జ్ షేరు ధర ఏకంగా 18 శాతం పెరిగింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీ స్థిరంగా ముగియగా, స్మాల్‌క్యాప్‌ సూచీ 0.61 శాతం నష్టంతో ముగిసింది.

    మార్కెట్‌లో అస్థిరతను సూచించే ఇండియా విక్స్‌ 2.98 శాతం పెరిగి 21.63కి చేరుకుంది. ఇంట్రాడేలో ఇది 8 శాతం దాకా పెరిగింది.

    సెన్సెక్స్‌ ఉదయం 78,968.34 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమై, అదే స్థాయిలో ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 880.34 పాయింట్ల నష్టంతో 79,454.47 వద్ద ముగిసింది.

    నిఫ్టీ 265 పాయింట్లు కోల్పోయి 24,008.00 వద్ద స్థిరపడింది.

    Details

    బంగారం 3,329 డాలర్ల వద్ద ట్రేడవుతోంది

    రూపాయి మారకం విలువ డాలరుతో పోల్చితే 17 పైసలు బలపడి 85.41 వద్ద ఉంది.

    సెన్సెక్స్‌ 30 షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నష్టాల్లో ముగియగా, టైటాన్‌, టాటా మోటార్స్‌, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి.

    అంతర్జాతీయంగా బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 63 డాలర్ల వద్ద కొనసాగగా, బంగారం 3,329 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్
    వ్యాపారం

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    స్టాక్ మార్కెట్

    Stock Market: భారీ లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 1500+ పాయింట్లు పెరిగిన సెన్సెక్స్  బిజినెస్
    Stock Market: స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభం వ్యాపారం
    Stock market: వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు వ్యాపారం
    Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం - రెండోరోజూ వెనకడుగు  బిజినెస్

    వ్యాపారం

    UPI Lite: యూపీఐ లైట్‌లో నూతన మార్పులు.. నగదు ఉపసంహరణకు ఎన్‌పీసీఐ గ్రీన్ సిగ్నల్ యూపీఐ
    SIF Investment Funds : హై రిస్క్ ఇన్వెస్టర్లకు కొత్త అవకాశం.. రూ.10 లక్షలతో 'సిఫ్' ప్రారంభం! సెబీ
    Meta: మెటాలో డేటా లీక్‌ కలకలం.. ఉద్యోగులను తొలగించిన సంస్థ మెటా
    Stock market crash: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. మదుపర్లకు రూ.10 లక్షల కోట్ల నష్టం! స్టాక్ మార్కెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025