
Tollywood: రేపు సీఎం చంద్రబాబుతో భేటీ కానున్న సినీ ప్రముఖులు.. ఎవరెవరు కలవనున్నారంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కలవనున్నారు.
ఈ సమావేశం ఆదివారం సాయంత్రం 4 గంటలకు అమరావతిలో జరగనుంది.
ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించనున్నారు.
ఈ భేటీలో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన సుమారు 35 మంది ప్రముఖులు హాజరవుతారు.
వారిలో నిర్మాతలు, దర్శకులు, ప్రముఖ నటీనటులు పాల్గొననున్నారు.
సినిమా రంగంలో ఎదురవుతున్న సమస్యలపై, ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలో షూటింగ్లకు అనుమతుల ప్రక్రియ, లొకేషన్ల లభ్యత, పన్నుల విధానం, సినీ రంగ అభివృద్ధికి అవసరమైన చర్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
వివరాలు
సినీ పెద్దలు సీఎం చంద్రబాబుతో సమావేశం కావడం ఇదే మొదటిసారి
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబుతో సినీ పెద్దలు సమావేశం కావడం ఇదే మొదటిసారి.
గతంలో సినిమారంగానికి చెందిన ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలవకపోవడంపై పవన్ కళ్యాణ్ తీవ్రమైన విమర్శలు చేసిన విషయం విదితమే.
ఇక ఏపీలో థియేటర్ల స్థితిగతులు, అక్కడి వసతులు ఎలా ఉన్నాయన్న అంశాలపై ఇటీవల సినిమాటోగ్రఫీ శాఖ ప్రత్యేక ఆదేశాలను జారీ చేసింది.
ఈ మేరకు సంబంధిత అధికారులు రంగంలోకి దిగి రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో తనిఖీలు ప్రారంభించారు.
ఈ భేటీలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, ప్రముఖ హీరోలు పాల్గొననున్నారు. వారిలో కొందరు:
వివరాలు
నిర్మాతలు:
దిల్ రాజు (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్), ఆచంట గోపి(14 రీల్స్), అశ్వినీ దత్ (వైజయంతీ మూవీస్), డివివి దానయ్య (డివివి ఎంటర్టైన్మెంట్), కేవీ రామారావు, సుప్రియ
దర్శకులు: వీర శంకర్(దర్శకుల సంఘం అధ్యక్షుడు), బోయపాటి శ్రీను, నాగ్ అశ్విన్ (మహానటి, కల్కి 2898 AD ఫేమ్), త్రివిక్రమ్ శ్రీనివాస్
నటులు: నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, మంచు మనోజ్, నాని, సుమన్, ఆర్ నారాయణమూర్తి, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్, మంచు విష్ణు
నటీమణులు: జయప్రద, జయసుధ, జీవిత