NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Earthquake: దిల్లీలో భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన జనం..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Earthquake: దిల్లీలో భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన జనం..
    దిల్లీలో భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన జనం..

    Earthquake: దిల్లీలో భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన జనం..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 17, 2025
    08:02 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.0 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది.

    ఇది కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపిందని పేర్కొంది.

    ఈ రోజు (ఫిబ్రవరి 17) ఉదయం 5:36 గంటలకు ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) పరిధిలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని స్థానికులు తెలిపారు.

    భూకంపం కారణంగా భయాందోళనకు గురైన ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

    వివరాలు 

     5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం

    ఇక దిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో కూడా భూమి కంపించిందని స్థానిక వాసులు వెల్లడించారు.

    ఈ భూకంపానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

    భూకంప కేంద్రం కేవలం 5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది.

    గత నెల (జనవరి 23) చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో 80 కిలోమీటర్ల లోతులో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన తరువాత ఢిల్లీలో కూడా బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రికార్టర్ స్కేల్ పై 4.3గా నమోదు.. 

    #earthquake reported by the users of the app Earthquake Network at 7km from New Delhi, India. 17 reports in a radius of 38km. Download the app from https://t.co/hNdHhYeXVG to receive real time alerts pic.twitter.com/wMqlNNwHEr

    — Earthquake Network (@SismoDetector) February 17, 2025

    వివరాలు 

    అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచన 

    సోమవారం తెల్లవారుజామున ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో సంభవించిన స్వల్ప భూప్రకంపనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

    ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా శాంతంగా ఉండాలని, అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

    భూకంపం మళ్లీ సంభవించే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    భూకంపం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    దిల్లీ

    AAP: అద్దె ఇళ్లలో నివసించే పౌరులకు ఉచిత విద్యుత్‌, నీరు.. కేజ్రీవాల్ కీలక హామీ అరవింద్ కేజ్రీవాల్
    #NewsBytesExplainer: ఉచితాలు vs అభివృద్ధి.. దిల్లీలో పరిస్థితి ఎలా ఉంది? కేంద్ర ప్రభుత్వం
    Arvind Kejriwal: కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి.. ఆప్ బీజేపీపై ఆరోపణలు అరవింద్ కేజ్రీవాల్
    Daredevils: కర్తవ్యపథ్‌లో భారత ఆర్మీ 'డేర్‌డెవిల్స్‌' సరికొత్త వరల్డ్ రికార్డు భారతదేశం

    భూకంపం

    అయోధ్య రామాలయ ప్రత్యేకతలు.. స్టీల్ వాడకుండా.. భూకంపాలు వచ్చినా తట్టుకునేలా నిర్మాణం  అయోధ్య రామాలయ ప్రారంభోత్సం
    Earthquake: చైనాలో 7.2 తీవ్రతతో భూకంపం..ఢిల్లీలో ప్రకంపనలు  చైనా
    Earthquake: కార్గిల్‌, మేఘాలయలో వరుస భూకంపాలు  మేఘాలయ
    Earthquake : లడఖ్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో భూకంపం.. భయాందోళనలో ప్రజలు  జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025