NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bypolls 2025: ఆ నాలుగు రాష్ట్రాల్లో బైఎలక్షన్స్.. ఈసీ షెడ్యూల్ విడుదల
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Bypolls 2025: ఆ నాలుగు రాష్ట్రాల్లో బైఎలక్షన్స్.. ఈసీ షెడ్యూల్ విడుదల
    ఆ నాలుగు రాష్ట్రాల్లో బైఎలక్షన్స్.. ఈసీ షెడ్యూల్ విడుదల

    Bypolls 2025: ఆ నాలుగు రాష్ట్రాల్లో బైఎలక్షన్స్.. ఈసీ షెడ్యూల్ విడుదల

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 25, 2025
    03:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో మరోసారి ఎన్నికల జోష్‌ నెలకొననుంది.

    భారత ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి.

    ఈ బైపోల్స్‌ కోసం జూన్ 19న పోలింగ్‌ నిర్వహించనుండగా, జూన్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ స్పష్టంచేసింది.

    గుజరాత్‌లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి.

    కాడి నియోజక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కర్సన్‌ భాయ్ పంజాభాయ్ సోలంకి మృతి చెందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

    Details

     పశ్చిమ బెంగాల్‌లో కలిగంజ్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక

    మరోవైపు విశావదర్ నియోజక వర్గానికి చెందిన ఎమ్మెల్యే భయానీ భూపేంద్ర భాయ్ గండుభాయ్ రాజీనామా చేయడంతో ఈ స్థానానికి కూడా ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది.

    కేరళలోని నీలంబూర్ అసెంబ్లీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే పీవి అన్వర్ రాజీనామాతో ఉప ఎన్నిక జరగనుంది.

    పంజాబ్‌లో లూథియానా అసెంబ్లీ నియోజక వర్గం ఎమ్మెల్యే గురుప్రీత్ బస్సీ గోగి మృతి చెందగా, అక్కడ కూడా బైఎలక్షన్ నిర్వహించనున్నారు.

    పశ్చిమ బెంగాల్‌లో కలిగంజ్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది.

    Details

    మే 26న నామినేషన్ ప్రక్రియ ప్రారంభం

    ఇదిలా ఉండగా, గుజరాత్ పీసీసీ చీఫ్ శక్తిసిన్హ్ గోహిల్ గతంలో చేసిన ప్రకటన ప్రకారం, ఇండియా కూటమి భాగస్వామిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు లేకుండా కాంగ్రెస్ పార్టీ కాడి, విశావదర్ నియోజక వర్గాల్లో స్వతంత్రంగా పోటీ చేయనుంది.

    ఈ ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, నామినేషన్ల ప్రక్రియ మే 26న ప్రారంభం కానుంది.

    నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ జూన్ 2గా నిర్ణయించగా, జూన్ 3న నామినేషన్ల పరిశీలన జరగనుంది.

    నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా జూన్ 5ని ఎన్నికల సంఘం ప్రకటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుజరాత్
    కేరళ

    తాజా

    Bypolls 2025: ఆ నాలుగు రాష్ట్రాల్లో బైఎలక్షన్స్.. ఈసీ షెడ్యూల్ విడుదల గుజరాత్
    Sunil Gavaskar: ఆడకుండానే డ్రాప్‌.. సర్ఫరాజ్ విషయంలో గావస్కర్ అసంతృప్తి! సునీల్ గవాస్కర్
    Sardar 2 : కార్తీ బర్త్‌డే బ్లాస్ట్.. 'సర్దార్ 2' నుండి మాస్ పోస్టర్ విడుదల! టాలీవుడ్
    Lenin: చిత్తూరు యాసలో అఖిల్.. ఎంట్రీ కోసం స్పెషల్ సెట్! అక్కినేని అఖిల్

    గుజరాత్

    Gujarat: గుజరాత్‌లోని సూరత్‌లో రైలు ప్రమాదం.. అహ్మదాబాద్-ముంబై డబుల్ డెక్కర్ రైలు నుండి వేరైన 2 కోచ్‌లు  భారతదేశం
    IMD Alert: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ రాష్ట్రాలకు హెచ్చరీకలు జారీ భారత వాతావరణ శాఖ
    Gujarat Rains: గుజరాత్‌లో భారీ వర్షాలు.. 'రెడ్ అలర్ట్' ప్రకటించిన వాతావరణ శాఖ భారీ వర్షాలు
    Gujarat: గుజరాత్‌లో భారీ వర్షాల కారణంగా 15 మంది మృతి.. పలు రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్  భారతదేశం

    కేరళ

    Kerala : కేరళ ఆలయంలో బాణాసంచా పేలుడు.. 150 మందికి పైగా గాయాలు ఇండియా
    Sabarimala pilgrims: శబరిమల యాత్రికులకు టీడీబీ రూ. 5 లక్షల ఉచిత బీమా  భారతదేశం
    whatsApp: కేరళలో ప్రత్యేక వర్గం పేరుతో ఐఏఎస్‌ అధికారుల వాట్సప్‌ గ్రూపు ఏర్పాటుపై వివాదం..  భారతదేశం
    Wayanad bypolls: వాయనాడ్‌లో రేపు లోక్‌సభ ఉప ఎన్నికలు .. సత్తా చాటేదెవరో? ఉపఎన్నికలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025