NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీలో అమిత్ షాను కలిసిన చంద్రబాబు- వచ్చేవారం ఏపీకి బీజేపీ అగ్రనేతలు; పొత్తు  కొసమేనా? 
    తదుపరి వార్తా కథనం
    దిల్లీలో అమిత్ షాను కలిసిన చంద్రబాబు- వచ్చేవారం ఏపీకి బీజేపీ అగ్రనేతలు; పొత్తు  కొసమేనా? 
    దిల్లీలో అమిత్ షాను కలిసిన చంద్రబాబు- వచ్చేవారం ఏపీకి బీజేపీ అగ్రనేతలు; పొత్తుపై కొసమేనా?

    దిల్లీలో అమిత్ షాను కలిసిన చంద్రబాబు- వచ్చేవారం ఏపీకి బీజేపీ అగ్రనేతలు; పొత్తు  కొసమేనా? 

    వ్రాసిన వారు Stalin
    Jun 04, 2023
    09:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తిక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

    ఏపీలో 2024లో జరిగే ఎన్నికల కోసం బీజేపీ-టీడీపీ- జనసేన పొత్తుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు టీడీపీ- బీజేపీ పొత్తు ఉంటుందనే సంకేతాలను ఇస్తున్నాయి.

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం దేశ రాజధానికి చేరుకున్నారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే జీ20 సంప్రదింపుల సమావేశానికి ఆయన హాజరుకానున్నారు.

    అయితే శనివారం దిల్లీకి చేరుకున్న వెంటనే చంద్రబాబు తన పార్టీ నాయకులు, ఎంపీలతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు.

    అనంతరం బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో కూడా సమావేశమయ్యారు. అయితే ఇద్దరు నేతలతో ఏపీ రాజకీయాలపై చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది.

    ఏపీ

    జూన్ 8న విశాఖకు అమిత్ షా, 10వ తేదీన తిరుపతికి నడ్డా

    అలాగే భారతీయ జనతా పార్టీకి చెందిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా వచ్చేవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. వీరి పర్యటన వచ్చే అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొనే సాగుతుందని తెలుస్తోంది.

    అమిత్ షా జూన్ 8న విశాఖకు రానుండగా, జేపీ నడ్డా 10న తిరుపతిలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించడంతోపాటు పలు కార్యక్రమాల్లో షా పాల్గొననున్నారు. మరోవైపు తిరుపతిలో పార్టీ కార్యక్రమాల్లో నడ్డా పాల్గొననున్నారు.

    మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా తొమ్మిదేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రచారం చేయడమే వారి పర్యటనల ఉద్దేశ్యం అయినప్పటికీ, భవిష్యత్ ఎన్నికల పొత్తులపై స్థానిక బీజేపీ నాయకత్వానికి వారు దిశానిర్దేశం చేస్తారని ప్రచారం జరుగుతోంది.

    ఏపీ

    టీడీపీతో పొత్తుకు పట్టుబడుతున్న జనసేన

    ప్రస్తుతం ఏపీలో జనసేన- బీజేపీ కూటమిగా ఉన్నాయి. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీని కూడా కూటమిలో కలుపుకోవాలని బీజేపీపై ఒత్తిడి పెడుతున్నట్లు తెలుస్తోంది.

    టీడీపీతో కలవడం బీజేపీ దిల్లీ నాయకత్వానికి ఇష్టం లేదని ఇన్నాళ్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దిల్లీలో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డాను కలవడం, ఈ ఇద్దరు కీలక నాయకులు మళ్లీ వచ్చేవారం ఏపీకి రానుండటంపై రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నది.

    అలాగే అమిత్ షా, నడ్డా పర్యనటలోనే బీజేపీ- టీడీపీ పొత్తుపై క్లారిటీ వస్తుందని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    బీజేపీ
    జనసేన

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ఆంధ్రప్రదేశ్

    చేతిపంపు కొట్టుకొని నీళ్లు తాగిన ఏనుగు; వీడియో వైరల్  పార్వతీపురం మన్యం జిల్లా
    వైఎస్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జూన్ 5కి వాయిదా తెలంగాణ
    APSRTC: పాడేరు, అరకులోయ, బొర్రా గుహలకు 'ఏపీఎస్ఆర్టీసీ' ప్రత్యేక టూర్ ప్యాకేజీ  ఏపీఎస్ఆర్టీసీ
    తుని రైలు దహనం కేసును కొట్టేసిన విజయవాడ రైల్వే కోర్టు తూర్పుగోదావరి జిల్లా

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    నిజామాబాద్‌పై చంద్రబాబు ఫోకస్: మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చంద్రబాబు నాయుడు
    తెలుగునాట రాజకీయ నవోదయం: సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసి నేటికి 40ఏళ్లు భారతదేశం
    రేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు చంద్రబాబు నాయుడు
    కుప్పంలో లోకేశ్ 'యువగళం' పాద‌యాత్ర ప్రారంభం చంద్రబాబు నాయుడు

    బీజేపీ

    బీజేపీ-ఏఐఏడీఎంకే పొత్తు కొనసాగుతుంది: ఈపీఎస్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకే
    West Bengal: శ్రీరామనవమి వేడుకల్లో చెలరేగిన హింసపై ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ పశ్చిమ బెంగాల్
    ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్ బండి సంజయ్
    ప్రతిపక్షాలకు ఎదురదెబ్బ; ఈడీ, సీబీఐపై దాఖలు చేసిన పిటిషన్‌ స్వీకరణకు సుప్రీంకోర్టు నిరాకరణ సుప్రీంకోర్టు

    జనసేన

    ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకేనా? భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా; టీడీపీలోకా? జనసేనలోకా? బీజేపీ
    జనసేన ఆవిర్భావం: వారాహి వాహనంపై మచిలీపట్నానికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్
    దిల్లీ పర్యటనలో జనసేన అధినేత; హస్తిన పర్యటనలో పవన్ ఏం చేయబోతున్నారు? పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025