NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కాంగ్రెస్: సిద్ధరామయ్య vs డీకే శివకుమార్‌; కర్ణాటక సీఎం ఎవరు? 
    కాంగ్రెస్: సిద్ధరామయ్య vs డీకే శివకుమార్‌; కర్ణాటక సీఎం ఎవరు? 
    1/3
    భారతదేశం 1 నిమి చదవండి

    కాంగ్రెస్: సిద్ధరామయ్య vs డీకే శివకుమార్‌; కర్ణాటక సీఎం ఎవరు? 

    వ్రాసిన వారు Naveen Stalin
    May 13, 2023
    01:40 pm
    కాంగ్రెస్: సిద్ధరామయ్య vs డీకే శివకుమార్‌; కర్ణాటక సీఎం ఎవరు? 
    కాంగ్రెస్: సిద్ధరామయ్య vs డీకే శివకుమార్‌; కర్ణాటక సీఎం ఎవరు?

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఈ క్రమంలో ఇప్పడు కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రధానంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లో అధిష్ఠానం ఎవరిని నియమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కర్ణాటకలో కాంగ్రెస్ అగ్రనేతలుగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలను ముందుండి నడిపించారు. సిద్ధరామయ్య మాజీ ముఖ్యమంత్రి కాగా, డీకే శివకుమార్ పీసీసీ చీఫ్‌గా ప్రస్తుతం ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 75 ఏళ్ల సిద్ధరామయ్య ఇదే తన చివరి ఎన్నికలని ప్రకటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్యను సీఎంగా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

    2/3

    జేడీయూ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన సిద్ధరామయ్య 

    సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర కూడా తన తండ్రి ముఖ్యమంత్రి అవుతారని ఖరాఖండిగా చెప్పారు. కర్ణాటక ప్రయోజనాల కోసం తన తండ్రి ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో సిద్ధరామయ్య అత్యంత ప్రజాధారణ పొందిన కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేలింది. సిద్ధరామయ్య 1983లో భారతీయ లోక్‌దళ్ పార్టీ నుంచి తొలిసారిగా కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1994లో సిద్ధరామయ్య జనతాదళ్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పని చేశారు. పదేళ్ల తరువాత 2004లో జనతాదళ్ (సెక్యులర్)లో చేరారు. ఆ తర్వాత హెచ్‌డి దేవెగౌడతో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చారు. 2008లో సిద్ధరామయ్య కాంగ్రెస్‌లో చేరి 2013 కర్ణాటక ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు.

    3/3

    డీకే శివకుమార్ మొదటి నుంచి కాంగ్రెస్ వాదే

    ఇక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్నారు. 61ఏళ్ల డీకే శివకుమార్ కుమార్‌కు కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరుంది. కర్ణాటకలోని అత్యంత సంపన్న రాజకీయ నాయకులలో ఆయన ఒకరు. 2019లో కాంగ్రెస్-జనతాదళ్ సెక్యులర్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడేందుకు డీకే తీవ్రంగా శ్రమించారు. ఇది ఆయన పొలిటికల్ కెరీర్‌కు మైలురాయిగా మారింది. అయితే సిద్ధరామయ్య లాగా కాకుండా డీకే శివకుమార్ కుమార్‌మొదటి నుంచి కాంగ్రెస్ వాది. 1989 నుంచి కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. శివకుమార్ ప్రస్తుతం పలు అవినీతి కేసులను ఎదుర్కొంటున్నారు. దిల్లీలోని తీహార్ జైలులో కూడా గడిపారు. అయితే ఈ ఇద్దరు బలమైన నేతల్లో ఒకరిని సీఎంగా ఎంపిక చేయడం కాంగ్రెస్‌కు సవాల్ అనే చెప్పాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    కాంగ్రెస్
    కర్ణాటక
    అసెంబ్లీ ఎన్నికలు
    ముఖ్యమంత్రి
    తాజా వార్తలు

    కాంగ్రెస్

    కర్ణాటక ఎన్నికల్లో ఆధిక్యంపై ​​కాంగ్రెస్ 'అన్‌స్టాపబుల్' ట్వీట్  కర్ణాటక
    కర్ణాటక ఎన్నికల ఫలితాలు: ఎమ్మెల్యేందరూ బెంగళూరు చేరుకోవాలని కాంగెస్ పిలుపు కర్ణాటక
    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక‌లో రేపే పోలింగ్; ముఖ్యాంశాలు ఇవే కర్ణాటక
    సచిన్ పైలెట్ 'జన్ సంఘర్ష్ యాత్ర'; అశోక్ గెహ్లాట్‌పై మరోసారి ఫైర్ రాజస్థాన్

    కర్ణాటక

    నేడే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు; 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు  అసెంబ్లీ ఎన్నికలు
    కర్ణాటకలో మళ్లీ హంగ్; సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్; ఎగ్జిట్ పోల్స్ అంచనా అసెంబ్లీ ఎన్నికలు
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: కొనసాగుతున్న పోలింగ్; ఓటేసిన ప్రముఖులు అసెంబ్లీ ఎన్నికలు
    4శాతం ముస్లిం రిజర్వేషన్లలపై రాజకీయ ప్రకటనలపై సుప్రీంకోర్టు అభ్యంతరం  సుప్రీంకోర్టు

    అసెంబ్లీ ఎన్నికలు

    'టీడీపీ నాయకులను సీఎం చేయడానికి నేను లేను'; పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్  పవన్ కళ్యాణ్
    అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం; ఎలక్షన్ గుర్తు కోసం పార్టీలకు ఈసీ ఆహ్వానం  ఎన్నికల సంఘం
    సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం; ఈసీకి ఫిర్యాదు  కర్ణాటక
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ చెట్లపై నోట్ల కట్టలు  కర్ణాటక

    ముఖ్యమంత్రి

    మణిపూర్‌లో ఉద్రిక్తత: సీఎం కార్యక్రమ వేదికకు నిప్పు; 144 సెక్షన్ విధింపు  మణిపూర్
    పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూత  పంజాబ్
    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ ఎవరు? ఆయన విడుదల కోసమే జైలు నిబంధనల మార్చారా?  బిహార్
    కేరళ తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    తాజా వార్తలు

    ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతం: 18నెలల్లో ఇదే అత్యల్పం  భారతదేశం
    గుజరాత్‌లో రూ.4400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
     వైఎస్ వివేకా రాసిన లేఖపై వేలి ముద్రలు ఎవరివో తేల్చే పనిలో సీబీఐ  ఆంధ్రప్రదేశ్
    సీబీఎస్ఈ 10వ ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి భారత జట్టు
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023