NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్; ముగ్గురు మృతి; 67 రైళ్లు రద్దు
    తదుపరి వార్తా కథనం
    బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్; ముగ్గురు మృతి; 67 రైళ్లు రద్దు
    బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్; ముగ్గురు మృతి; 67 రైళ్లు రద్దు

    బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్; ముగ్గురు మృతి; 67 రైళ్లు రద్దు

    వ్రాసిన వారు Stalin
    Jun 13, 2023
    11:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బిపోర్‌జాయ్ సైక్లోన్ 'అత్యంత తీవ్రమైన తుపాను'గా తీవ్రరూపం దాల్చడంతో గుజరాత్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.

    గుజరాత్ లోని అరేబియా సముద్ర తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియను ప్రభుత్వం మంగళవారం కూడా కొసాగించనుంది.

    ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే తుపానుపై ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షితంగా తరలించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాని అధికారులను ఆదేశించారు.

    అలాగే ప్రధాని మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ తో ప్రత్యేకంగా మాట్లాడారు. తుపాను పరిస్థితిపై ఆరా తీశారు.

    తుపాను

    తీర ప్రాంతంలోని 10కిలోమీటర్ల లోపు గ్రామాల ప్రజల తరలింపు

    గుజరాత్‌లోని కచ్, సౌరాష్ట్ర జిల్లాల్లోని తీర ప్రాంతంలోని 10కిలోమీటర్ల లోపు గ్రామాల ప్రజలను అధికారులు మంగళవారం సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

    లోతట్టు ప్రాంతాల్లో ఉన్న దాదాపు 7,500మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. ఇప్పటికే కచ్, సౌరాష్ట్ర జిల్లాల్లో తుపాను హెచ్చరికలు జారీ చేశారు.

    ఈ రెండు జిల్లాలోని తీరాల వెంబడి పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. తుపాను తీరం దాటే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అదికారులు చెప్పారు.

    కచ్, జామ్‌నగర్, మోర్బి, గిర్ సోమనాథ్, పోర్ బందర్, దేవభూమి ద్వారక జిల్లాలు జూన్ 13-15మధ్యకాలంలో తుఫాను ప్రభావంతో భారీ వర్షపాతంతో పాటు 150కి.మీ వేగంతో గాలి వీచే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది.

    తుపాను

    రైళ్ల రాకపోకలపై ఎఫెక్ట్

    తుపాను తీవ్రత నేపథ్యంలో గుజరాత్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, లక్షద్వీప్‌ల తీరాల్లోని మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ సూచించింది.

    అంతర్జాతీయ సముద్ర చట్టానికి అనుగుణంగా, రాబోయే ప్రతికూల వాతావరణ పరిస్థితుల గురించి నౌకలను అప్రమత్తం చేయడానికి ఓడరేవులు కూడా హెచ్చరిక సిగ్నల్స్ ను జారీ చేయాల్సి ఉంటుంది.

    తుపాను శుక్రవారం నైరుతి రాజస్థాన్‌లోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున నార్త్ వెస్ట్రన్ రైల్వే 67 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

    బిపోర్‌జాయ్ తుపాను గురువారం మధ్యాహ్నం గుజరాత్ లోని కచ్, పాకిస్థాన్‌లోని కరాచీ మధ్య తీరం దాటే అవకాశం ఉంది.

    తుపాను

     జుహూ బీచ్‌లో నీట మునిగిన ముగ్గురు, తీరంలో కోస్ట్ గార్డ్ నౌకలు గస్తీ 

    జాతీయ, రాష్ట్ర విపత్తు దళాలు ఒక్కొక్కటి 12 చొప్పున బృందాలను మోహరించినట్లు, పునరావాస కేంద్రాల్లో ఆహారం, మందులు ఏర్పాట్లు చేసినట్లు గుజరాత్ రిలీఫ్ కమిషనర్ అలోక్ పాండే తెలిపారు.

    అంతేకాకుండా సహాయ చర్యల కోసం ఆర్మీ, నేవీ సిద్ధంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే, భారతీయ కోస్ట్ గార్డ్ నౌకలు తీరంలో గస్తీ తిరుగుతున్నాయి.

    ముంబైలోని జుహూ బీచ్‌లో సోమవారం నీటిలో మునిగి ఓ బాలుడు సహా మొత్తం ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరిని రక్షించారు.

    ముంబయిలో తుఫాను కారణంగా పలు బీచ్‌ల వద్ద రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ముంబై తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తుపాను
    గుజరాత్
    తాజా వార్తలు
    ముంబై

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    తుపాను

    సూర్యుని ఉపరితలంపై భూమి కంటే 20 రెట్ల భారీ 'కరోనల్ హోల్'; అయస్కాంత తుఫాను ముప్పు! నాసా
    రైతన్నలకు పిడిగులాంటి వార్త; ముంచుకొస్తున్న 'మోచా' తుపాను  తాజా వార్తలు
    ఏపీ, తెలంగాణకు తుపాను ఎఫెక్ట్; మరో నాలుగు రోజులపాటు వానలు తాజా వార్తలు
    మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'మోచా'; బెంగాల్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ మోహరింపు ఐఎండీ

    గుజరాత్

    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ నరేంద్ర మోదీ
    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ నరేంద్ర మోదీ
    నా ఆస్తులకు వారుసుడు రుచిర్, తక్షణమే అమల్లోకి వస్తుంది: లలిత్ మోదీ ఐపీఎల్
    గుజరాత్: రూ. కోట్లలో ఆస్తిని త్యజించి సన్యాసాన్ని స్వీకరించిన బాలిక భారతదేశం

    తాజా వార్తలు

    'వన్ ఆన్ వన్' వ్యూహం: 450లోక్‌సభ స్థానాల్లో ప్రతిపక్షాల నుంచి బీజేపీపై ఒక్కరే పోటీ  లోక్‌సభ
    కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు; ధృవీకరించిన ఐఎండీ  నైరుతి రుతుపవనాలు
    నక్సల్స్ సానుభూతిపరులే లక్ష్యంగా జార్ఖండ్, బిహార్‌లోని ఏడు చోట్ల ఎన్ఐఏ దాడులు  ఎన్ఐఏ
    గుడ్‌న్యూస్; త్వరలో తగ్గనున్న పెట్రోల్-డీజిల్ ధరలు  చమురు

    ముంబై

    విస్తారా విమానంలో ఇటాలియన్ ప్రయాణికురాలి బీభత్సం, మద్యం మత్తులో అర్ధనగ్న ప్రదర్శన విమానం
    'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్ ఎన్ఐఏ
    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్ నితిన్ గడ్కరీ
    జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టేవేత సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025