Page Loader
Defence Budget: ఆపరేషన్ సిందూర్.. కేంద్ర రక్షణ బడ్జెట్ రూ.50వేల కోట్ల పెంపు..!
ఆపరేషన్ సిందూర్.. కేంద్ర రక్షణ బడ్జెట్ రూ.50వేల కోట్ల పెంపు..!

Defence Budget: ఆపరేషన్ సిందూర్.. కేంద్ర రక్షణ బడ్జెట్ రూ.50వేల కోట్ల పెంపు..!

వ్రాసిన వారు Sirish Praharaju
May 16, 2025
10:44 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్,పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ రంగానికి అదనంగా రూ.50,000 కోట్లు కేటాయించే అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన "ఆపరేషన్ సిందూర్" అనంతరం కేంద్రం ఈ దిశగా సన్నాహాలు చేస్తోందని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం రక్షణ శాఖకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6.81 లక్షల కోట్లు కేటాయించగా, ఇప్పుడు అదనంగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ పెంపు ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశముండటంతో, మొత్తంగా రక్షణ బడ్జెట్ రూ.7 లక్షల కోట్లు దాటి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

వివరాలు 

దేశ స్థూల జాతీయోత్పత్తిలో రక్షణ బడ్జెట్ వాటా 1.91 శాతం

భద్రతాపరమైన ముప్పులు ముఖ్యంగా చైనా,పాకిస్తాన్ నుండి ఎదురవుతున్న తరుణంలో, రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2024-25 బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేసింది. మొత్తం రూ.6,81,210 కోట్లు కేటాయించగా, ఇది గత సంవత్సరం (రూ.6.22 లక్షల కోట్లు)తో పోలిస్తే 9.53 శాతం అధికం. అలాగే సవరించిన అంచనాలతో పోలిస్తే ఇది 6.2 శాతం ఎక్కువగా ఉంది. ఈ కేటాయింపుల్లో ప్రధానంగా ఆధునిక ఆయుధ వ్యవస్థల కొనుగోలు, సాంకేతిక పరికరాల అభివృద్ధి వంటి అంశాలకు పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. దేశ స్థూల జాతీయోత్పత్తిలో రక్షణ బడ్జెట్ వాటా ప్రస్తుతం 1.91 శాతంగా ఉంది.

వివరాలు 

తొలి బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ.2.29 లక్షల కోట్లు

ఇప్పుడు ప్రతిపాదిత అదనపు రూ.50 వేల కోట్ల నిధులను పరిశోధన,ఆయుధాల అభివృద్ధి, అవసరమైన పరికరాల కొనుగోలు కోసం వినియోగించే అవకాశం ఉంది. గమనించదగిన విషయం ఏమిటంటే,ఎన్డీయే ప్రభుత్వం 2014-15 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ.2.29 లక్షల కోట్లు కేటాయించగా,అప్పట్లో మొత్తం కేంద్ర బడ్జెట్‌లో 13 శాతం ఈ రంగానికే కేటాయించడం జరిగింది. ఇటీవల ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో భయానక సంఘటన చోటు చేసుకుంది. సైనిక దుస్తుల్లోని ఉగ్రవాదులు అక్కడ పర్యటిస్తున్న ప్రజలపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ దాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయారు.

వివరాలు 

రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం 

దానికి ప్రతిస్పందనగా భారత్ "ఆపరేషన్ సిందూర్" పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)తో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఈ చర్యలను జీర్ణించుకోలేని పాకిస్తాన్, భారత్‌ను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి. అయితే భారత దాడులకు మానసికంగా ఎదుర్కొలేని స్థితిలో ఉన్న పాక్, చివరికి వెనక్కి తగ్గిన నేపథ్యంలో రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.