NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా? 
    కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా? 
    1/4
    భారతదేశం 0 నిమి చదవండి

    కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా? 

    వ్రాసిన వారు Naveen Stalin
    May 29, 2023
    04:35 pm
    కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా? 
    కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా?

    అధునాతన హంగులతో, అణువణువూ ప్రజాస్వామ సుగంధాలను వీచే కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భారతీయత ఉట్టేపడేలా దీన్ని నిర్మించారు. భారత ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే ఈ కొత్త పార్లమెంట్ భవానానికి ఆర్కిటెక్ట్(శిల్పి) ఎవరో తెలుసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. భారత కొత్త పార్లమెంట్ భవాన్ని డిజైన్ చేసింది బిమల్ హస్ముఖ్ పటేల్‌. ఈయన అహ్మదాబాద్‌లో ఉన్న హెచ్‌సీపీ డిజైన్స్ అధినేత.

    2/4

    ప్రస్తుతం సీఈపీటీ‌ యూనివర్సిటీకి అధిపతిగా కొనసాగుతున్న పటేల్

    బిమల్ హస్ముఖ్ పటేల్‌ ఆగస్టు 31, 1961న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఆర్కిటెక్చర్ పట్ల పటేల్‌కు ఉన్న మక్కువను చూసిన అతని తండ్రి హస్ముఖ్ చందూలాల్ పటేల్ 1960లో హెచ్‌సీపీ సంస్థను స్థాపించారు. బిమల్ తన ఆర్కిటెక్చర్ విద్యను సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ (సీఈపీటీ)లో చదివారు. అక్కడ అతను 1984లో డిగ్రీని పొందారు. 1988లో ఆర్కిటెక్చర్, సిటీ ప్లానింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 1995లో అతను బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి సిటీ, రీజినల్ ప్లానింగ్‌లో పీహెచ్‌డీని పూర్తి చేశారు. ప్రస్తుతం అతను చదవుకున్న సీఈపీటీ‌ యూనివర్సిటీకి అధిపతిగా పని చేస్తున్నారు.

    3/4

    2019లో పటేల్‌కు పద్మశ్రీ

    బిమల్ పటేల్ ఆర్కిటెక్ట్ మాత్రమే కాదు అర్బనిస్ట్, విద్యావేత్త కూడా. దేశానికి గర్వకారణైన కీలక ప్రాజెక్టుల్లో పటేల్ భాగమయ్యారు. వీటిలో ప్రధానంగా సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ధామ్, అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్, పూరీలోని జగన్నాథ ఆలయ మాస్టర్ ప్లానింగ్ ఉన్నాయి. హైదరాబాద్‌లోని అగాఖాన్ అకాడమీ, ముంబైలోని అమూల్ డెయిరీ, చెన్నైలోని కంటైనర్ టెర్మినల్, ఐఐటీ జోధ్‌పూర్ నిర్మాణ రూపకల్పనతో సహా దేశవ్యాప్తంగా వివిధ పట్టణ నిర్మాణాలకు పటేల్, అతని కంపెనీ సహకారాన్ని అందించారు. పటేల్ చేసిన సేవలకు గాను 2019లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.

    4/4

    త్రిభుజాకార ఆకారంలో పార్లమెంట్ నిర్మాణం అందుకే

    2019లో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా బిమల్ హస్ముఖ్ పటేల్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైన్స్ సంస్థకు ఈ బిడ్ దక్కింది. ఈ క్రమంలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంలో పటేల్ దార్శనికత కనిపిస్తుంది. కొత్త పార్లమెంటు భవనం త్రిభుజాకార ఆకారంలో నిర్మంచడం వెనుక పటేల్ భారీ ఆలోచనే చేశారు. సనాతన ధర్మ, సాంస్కృతి, ఆధ్యాత్మిక అంశాల మేళవింపుగా త్రిభుజాకారాన్ని ఎంచుకున్నారు. ఈ త్రిభుజాకార ఆకారం మూడు ప్రధాన స్థలాలను ప్రతిబింబిస్తుంది. అవి లోక్ సభ, రాజ్యసభ, సెంట్రల్ లాంజ్. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం ద్వారా బిమల్ పటేల్‌ తన నిర్మాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    దిల్లీ
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    అహ్మదాబాద్
    గుజరాత్
    కాలిఫోర్నియా
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    దిల్లీ

    దిల్లీలో 16ఏళ్ల బాలిక దారుణ హత్య; 20సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు; వీడియో వైరల్  భారతదేశం
    కొత్త పార్లమెంట్ వద్ద నిరసన తెలిపేందుకు ర్యాలీగా వెళ్లిన రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు  రెజ్లింగ్
    కొత్త పార్లమెంట్‌ వద్ద మహిళా రెజ్లర్ల ప్రదర్శన; దిల్లీలో భద్రత కట్టుదిట్టం రెజ్లింగ్
    కొత్త పార్లమెంట్ భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    గువాహటి-న్యూ జల్‌పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే దిల్లీ
    కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ షెడ్యూల్‌ ఇదే దిల్లీ
    నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా? దిల్లీ

    ప్రధాన మంత్రి

    నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని కేజ్రీవాల్ నిర్ణయం: ప్రధానికి లేఖ  అరవింద్ కేజ్రీవాల్
    రిషి సునక్ అధికారిక నివాసం గేట్లను కారుతో ఢీకొట్టిన వ్యక్తి అరెస్టు  రిషి సునక్
    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి గుర్తుగా రూ.75 నాణెం విడుదల నరేంద్ర మోదీ
    కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు సుప్రీంకోర్టు

    అహ్మదాబాద్

    దంచికొట్టిన గుజరాత్ టైటాన్స్; ముంబై ఇండియన్స్ లక్ష్యం 208 పరుగులు ఐపీఎల్
    ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం హైదరాబాద్
    ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు గురించి రైల్వే మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ట్విట్టర్
    3 ఏళ్ల తర్వాత టెస్టుల్లో తొలి సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లి, ప్రశంసించిన అనుష్క శర్మ విరాట్ కోహ్లీ

    గుజరాత్

    గుజరాత్‌లో రూ.4400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    డిఫరెంట్ ఫ్లేవర్లతో గోల్డెన్ ఐస్ క్రీమ్; ఎక్కడో తెలుసా?  సూరత్
    రాహుల్ గాంధీకి చుక్కెదురు; జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు సూరత్ కోర్టు నిరాకరణ  రాహుల్ గాంధీ
    ఐస్‌క్రీమ్ మార్కెట్‌లోకి రిలయన్స్; అమూల్, మదర్ డెయిరీకి గట్టి పోటీ తప్పదా?  రిలయెన్స్

    కాలిఫోర్నియా

    మెక్సికోలో తుపాకీ కాల్పులు; 10 మంది రేసర్లు మృతి  మెక్సికో
    26/11 దాడుల నిందితుడు తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా కోర్టు గ్రీన్ సిగ్నల్  అమెరికా
    ప్రయోగం తర్వాత కక్ష్యను చేరుకోవడంలో విఫలమైన ప్రపంచంలోని మొదటి 3డి-ప్రింటెడ్ రాకెట్ టెక్నాలజీ
    భార్య, ఆటిస్టిక్ కొడుకు గురించి చెప్పిన జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ట్విట్టర్

    తాజా వార్తలు

    టర్కీ అధ్యక్షుడిగా తయ్యిప్ ఎర్డోగాన్ ఎన్నిక  టర్కీ
    అసోం: కారు- వ్యాను ఢీ, ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం  అస్సాం/అసోం
    బెంగళూరు-హైదరాబాద్ డిజిటల్ హైవే పనులు ఆలస్యం; వచ్చే ఏడాది ప్రారంభం  బెంగళూరు
    తెలంగాణలో వచ్చే 10ఏళ్లలో భారీగా పెరగనున్న విద్యుత్ డిమాండ్  తెలంగాణ

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా నందమూరి తారక రామారావు
    కేరళ: హోటల్ యజమాని హత్య; ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహం లభ్యం  కేరళ
    కర్ణాటకలో కేబినెట్‌ విస్తరణ; రేపు 24మంది మంత్రులు ప్రమాణ స్వీకారం కర్ణాటక
    లండన్‌లో టిప్పు సుల్తాన్ కత్తి వేలం; రూ.143 కోట్లు పలికిన ఖడ్గం  బ్రిటన్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023