NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Revanth Reddy: తెలంగాణలో వరదలు.. సాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
    తదుపరి వార్తా కథనం
    Revanth Reddy: తెలంగాణలో వరదలు.. సాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
    తెలంగాణలో వరదలు.. సాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

    Revanth Reddy: తెలంగాణలో వరదలు.. సాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 02, 2024
    01:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో మూడ్రోజులగా కురుస్తున్న కుండపోత వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తున్నాయి.

    రహదారులు, రైల్వే పట్టాలు ధ్వంసమవడంతో పాటు, పలు గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి.

    కొన్ని గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఖమ్మం జిల్లాలో వరదల వల్ల భారీ నష్టం వాటిల్లింది.

    ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహించడంతో వేలాది ఎకరాలు పంటలు నీట మునిగిపోయాయి.

    మంత్రులు బాధిత ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలకు సాయం అందించేందుకు కృషి చేస్తున్నారు.

    Details

    సెలవులు పెట్టకూడదని ఆదేశాలు జారీ

    సీఎం రేవంత్ రెడ్డి వర్షాల ప్రభావాన్ని సమీక్షించారు. 24 గంటల పాటు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. అధికారులు ఎలాంటి సెలవులు పెట్టకూడదని ఆదేశాలు జారీ చేశారు.

    ముఖ్యంగా, డీజీపీ, పురపాలక, విద్యుత్, పంచాయతీరాజ్‌, నీటిపారుదల శాఖల అధికారులంతా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    ఖమ్మం జిల్లాకు సీఎం స్వయంగా వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాద్‌ జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను రిలీజ్ చేసింది.

    వరద బాధితులను ఆదుకునేందుకు రూ. 5 కోట్లు తక్షణ సాయంగా విడుదల చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

    Details

    24 రైళ్ల రాకపోకలకు అంతరాయం

    ప్రకృతి విపత్తుల్లో మరణించినవారికి సాయం మొత్తాన్ని రూ. 4 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచారు.

    ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ఖమ్మంలో బస చేసి, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

    తెలంగాణలోని వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి, పరిస్థితులను సమీక్షించారు.

    మహబూబాబాద్‌ జిల్లాలో నదులు, వాగులు పొంగి, రైల్వే ట్రాక్‌లు కొట్టుకుపోవడంతో 24 రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

    వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం, మరికొందరు గల్లంతయ్యారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రేవంత్ రెడ్డి
    తెలంగాణ

    తాజా

    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా

    రేవంత్ రెడ్డి

    KCR Birthday: కేసీఆర్‌కు బర్త్ డే విషెష్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వీడియో వైరల్  తాజా వార్తలు
    TSPSC: గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీఎస్‌పీఎస్పీ  టీఎస్పీఎస్సీ
    Indiramma housing scheme: మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్  తెలంగాణ
    Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి గుడి.. మార్చి 19న భూమి పూజ! భారతదేశం

    తెలంగాణ

    Revanth Reddy: తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీ.. సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి రేవంత్ రెడ్డి
    Telangana Voters List: నేటి నుంచి కొత్త ఓటు నమోదు,సవరణ ప్రారంభం.. ఇంటింటికీ వెళ్లనున్న బీఎల్‌వోలు ఎన్నికల సంఘం
    Telangana: రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్  భారతదేశం
    Komatiteddy: విజయవాడ హైవే పనులకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025