NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhrapradesh: ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. జలాశయాలకు పోటెత్తుతున్న వరద ప్రవాహం
    తదుపరి వార్తా కథనం
    Andhrapradesh: ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. జలాశయాలకు పోటెత్తుతున్న వరద ప్రవాహం
    ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు..

    Andhrapradesh: ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. జలాశయాలకు పోటెత్తుతున్న వరద ప్రవాహం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 10, 2024
    09:02 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తీవ్ర వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

    సోమవారం కొంత తగ్గుముఖం పట్టినా, 7, 8 తేదీల్లో కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిప్రవహించాయి.

    వరద నీటి ఉద్ధృతికి అనేక రహదారులు తెగిపోయాయి, కల్వర్టులు కొట్టుకుపోయాయి, రాకపోకలు నిలిచిపోయాయి.

    జలాశయాలు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో, కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.

    వివరాలు 

    వరదల వల్ల కొట్టుకుపోయిన  వంతెనలు 

    విశాఖపట్టణం,అనకాపల్లి జిల్లాల్లో కొండచరియలు విరిగిపడి కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి.

    అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరంలో అత్యధికంగా 14 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

    ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో కుండపోత వర్షాలకు పిల్లిగడ్డ అంతర్రాష్ట్ర వంతెన కొట్టుకుపోయింది. ఈ ఘటనతో రాకపోకలు నిలిచిపోయాయి.

    చింతపల్లి, మడిగుంట వంటి ప్రాంతాల్లో నిర్మాణం జరుగుతున్న వంతెనలు వరదల వల్ల కొట్టుకుపోయాయి.

    రహదారులు పాడైపోయి, వాహన రాకపోకలు నిలిచిపోయాయి. విజయనగరంలో పారాది వంతెన మళ్లింపు మార్గం కొట్టుకుపోవడంతో సుమారు కోటి రూపాయల నష్టం జరిగింది.

    వివరాలు 

    ప్రమాదకరస్థాయికి తాండవ జలాశయం 

    అనకాపల్లి జిల్లా తాండవ జలాశయం ప్రమాదకరస్థాయికి చేరుకుంది, మరికొన్ని గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.

    ఒడిశాలో కురుస్తున్న వర్షాలు వంశధార, నాగావళి, బాహుదా నదుల్లో భారీగా వరదలు తీసుకువస్తున్నాయి.

    వర్షాలు, వరదల వల్ల అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అనేక హెక్టార్లలో పంటలు నీట మునిగాయి.

    శ్రీకాకుళంలో 38 ఇళ్లు దెబ్బతిన్నాయి, చెరువులకు గండ్లు పడ్డాయి, మూగజీవాలు మృతి చెందాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం
    Israel-Hamas: మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 66 మంది మృతి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది ఐఎంఎఫ్
    Brazil : 154 అంతస్తులతో సెన్నా టవర్‌.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది బ్రెజిల్

    ఆంధ్రప్రదేశ్

    AP Pensioners: ఏపీలో పింఛనుదారులకు చంద్రబాబు సర్కారు గుడ్‌న్యూస్ పెన్షన్
    YSRCP: వైసీపీకి షాక్.. ఇద్దరు ఎంపీలు రాజీనామా..త్వరలో టీడీపీ పార్టీలోకి..  భారతదేశం
    Krishna Water: కృష్ణా నదీ జలాల విషయంలో కీలక పరిణామం.. నీటి కేటాయింపులు సహా 40 అంశాలపై మళ్లీ విచారణ తెలంగాణ
    Metro Rail: విజయవాడ,విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టులపై సమీక్ష..ఈ రూట్‌లలోనే, ప్రభుత్వం కీలక ప్రకటన  మెట్రో రైలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025