NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / IMD Alert: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ రాష్ట్రాలకు హెచ్చరీకలు జారీ
    తదుపరి వార్తా కథనం
    IMD Alert: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ రాష్ట్రాలకు హెచ్చరీకలు జారీ
    దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ రాష్ట్రాలకు హెచ్చరీకలు జారీ

    IMD Alert: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ రాష్ట్రాలకు హెచ్చరీకలు జారీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 26, 2024
    12:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు ఉధృతంగా కురుస్తున్నాయి. గుజరాత్‌, రాజస్థాన్‌, మణిపూర్‌ రాష్ట్రాల్లో కుంభవృష్టి వర్షాలతో దంచికొడుతున్నాయి.

    వర్షాల కారణంగా ఊర్లకు ఊర్లే చెరువులను తలపిస్తున్నాయి.

    గుజరాత్‌లో భారీ వర్షాలు

    గుజరాత్ రాష్ట్రం తీవ్ర వర్షపాతం కారణంగా కష్టాలు ఎదుర్కొంటోంది. పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతరం వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

    లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలే వల్సాడ్‌లో ఒక్క రాత్రి 12 సెంటీమీటర్ల వర్షం పడింది.

    Details

    సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రజలు

    సూరత్‌లో తాపి నది ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తోంది. డ్రైనేజీలు తెరుచుకున్నాయనే భయంతో వాహనదారులు ముందుకు కదలడం లేదు.

    పంటలు నీట మునిగాయి. గుజరాత్‌లోని పలు జలపాతాలు వరద నీటితో నిండిపోయాయి.

    మణిపూర్‌లో పరిస్థితి

    మణిపూర్ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించడంతో చాలామంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

    ఇక్కడ 130 కుటుంబాలు సహాయక శిబిరంలో ఉంటున్నాయి.

    వర్షం ఇలాగే కొనసాగితే మరిన్ని ఇళ్లు నీట మునిగే అవకాశముందని స్థానికులు వాపోతున్నారు..

    వాగువంకలు ఉధృతంగా ప్రవహించడంతో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

    Details

    ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం

    రాజస్థాన్‌లో వర్షాలు

    రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో కూడా వర్షాలు తీవ్రంగా కురుస్తున్నాయి. ఫోయ్‌సాగర్‌ సరస్సు పొంగి పొర్లుతోంది.

    ఐఎండీ సూచనలు

    భారత వాతావరణ శాఖ రాబోయే 24 గంటల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

    గుజరాత్‌కు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిశా, ఢిల్లీతో సహా ఈశాన్య రాష్ట్రాలకు రెడ్, ఆరంజ్, ఎల్లో అలెర్ట్‌లు జారీ చేసింది.

    ఒడిశాలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది.

    దక్షిణ ఉత్తరప్రదేశ్‌ నుంచి బంగాళాఖాతం వరకు ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా ఒడిశాలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారత వాతావరణ శాఖ
    గుజరాత్

    తాజా

    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్

    భారత వాతావరణ శాఖ

    Telangana Weather: వర్షాల్లేవు.. నవంబర్ మండనున్న వరకు ఎండలు  తెలంగాణ

    గుజరాత్

    Unseasonal Rain: ఉత్తర భారతాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు.. గుజరాత్‌లో 20మంది మృతి భారీ వర్షాలు
    Surat Fire Accident: సూరత్ కెమికల్ ప్లాంట్‌లో మంటలు.. గాయపడిన 24 మంది కార్మికులు  సూరత్
    America Triple Murder: అమెరికాలో భారతీయ విద్యార్థిపై ట్రిపుల్ మర్డర్ కేసు  అమెరికా
    మసీదుల్లోనే శబ్ధం వస్తుందా? గుడిలో సౌండ్ రాదా? లౌడ్ స్పీకర్ల నిషేధంపై హైకోర్టు కామెంట్స్  హైకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025