NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / COVID-19: భారత్‌లో వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు.. ఢిల్లీలో వారంలోనే వంద మందికి కొవిడ్ పాజిటివ్ 
    తదుపరి వార్తా కథనం
    COVID-19: భారత్‌లో వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు.. ఢిల్లీలో వారంలోనే వంద మందికి కొవిడ్ పాజిటివ్ 
    భారత్‌లో వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు.. ఢిల్లీలో వారంలోనే వంద మందికి కొవిడ్ పాజిటివ్

    COVID-19: భారత్‌లో వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు.. ఢిల్లీలో వారంలోనే వంద మందికి కొవిడ్ పాజిటివ్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 26, 2025
    01:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీలో మరోసారి కొవిడ్-19 మహమ్మారి కలకలం రేపుతోంది.

    ఇటీవల గత వారం రోజుల వ్యవధిలో నగరంలో కొత్తగా 100కి మించి కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

    2020లో ప్రపంచాన్ని వణికించిన ఈ ప్రాణాంతక వైరస్ మళ్లీ విజృంభించడమే కాదు, ఇప్పటికే యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం అధికారులు అప్రమత్తం కావాల్సిన పరిస్థితిని తలపిస్తోంది.

    దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 1,009కు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కోవిడ్-19 బులెటిన్‌లో పేర్కొంది.

    ఢిల్లీలో ప్రస్తుతం 104 యాక్టివ్ కేసులు ఉండగా, అందులో 99 కేసులు ఈ వారం రోజుల్లోనే నమోదయ్యాయి.

    రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే,కేరళలో అత్యధికంగా 430 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    వివరాలు 

    కర్ణాటకలో ఒక్కరు కొవిడ్ వల్ల మృతి 

    మహారాష్ట్రలో 209 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ 104 కేసులతో మూడవ స్థానంలో నిలిచింది.

    అలాగే గుజరాత్‌లో 83, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్‌లో 15, పశ్చిమ బెంగాల్‌లో 12 యాక్టివ్ కేసులు ఉన్నట్టు సమాచారం.

    ఇదిలా ఉంటే, మహారాష్ట్రలో నాలుగు, కేరళలో రెండు, కర్ణాటకలో ఒక్కరు కొవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయినట్టు అధికారికంగా వెల్లడించారు.

    ఇదిలా ఉండగా, కొన్నిప్రాంతాల్లో మాత్రం కొవిడ్ ప్రభావం కనిపించలేదు.

    అండమాన్ అండ్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ వంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఒక్క యాక్టివ్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కరోనా కొత్త కేసులు

    తాజా

    COVID-19: భారత్‌లో వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు.. ఢిల్లీలో వారంలోనే వంద మందికి కొవిడ్ పాజిటివ్  కరోనా కొత్త కేసులు
    Kandula Durgesh:ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు.. ఫిల్మ్ చాంబర్ ముందుగానే స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఆంధ్రప్రదేశ్
    Motivation: అందరిలోనూ ప్రత్యేకంగా ఉండాలంటే.. తప్పనిసరిగా ఈ 4 అలవాట్లు మీలో ఉండాలి.. అవి మీలో ఇవి ఉన్నాయా? జీవనశైలి
    iPhone 17 Pro Max: ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ లీక్‌.. డిజైన్,ధర,కెమెరా ఫీచర్లు ఇవేనా..లాంచ్ ఎప్పుడంటే..? ఆపిల్

    కరోనా కొత్త కేసులు

    తెలంగాణ అలర్ట్: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు  తెలంగాణ
    దేశంలో కొత్తగా 11,109మందికి కరోనా; 7నెలల గరిష్టానికి కేసులు కోవిడ్
    దేశంలో 10,753 కొత్త కరోనా కేసులు; 27మంది మృతి కోవిడ్
    దేశంలో 60వేల మార్క్‌ను దాటిన కరోనా యాక్టివ్ కేసులు  కోవిడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025