NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Piyush Goyal: వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి: పీయూష్ గోయెల్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Piyush Goyal: వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి: పీయూష్ గోయెల్‌
    వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి: పీయూష్ గోయెల్‌

    Piyush Goyal: వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి: పీయూష్ గోయెల్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 02, 2025
    12:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం దిగుమతి సుంకాలు విధించబోతున్నట్లు చేసిన ప్రకటనకు సంబంధించి భారత్‌-అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్‌ వెల్లడించారు.

    ఈ అంశంపై ఫిబ్రవరిలో భారత్‌ పర్యటనకు వచ్చిన ట్రంప్‌ ప్రధాని నరేంద్ర మోదీతో జరిపిన చర్చల్లో భాగంగా ప్రస్తావన వచ్చినట్టు ఆయన తెలిపారు.

    వాణిజ్య రంగంలో ఇరు దేశాలు కలిసి ముందుకు సాగాలని సంకల్పించుకున్నాయని పేర్కొన్నారు.

    ఈ సమస్యను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయని స్పష్టం చేశారు.

    అమెరికాతో తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతున్న చర్చల క్రమంలో ఆ దేశ అధికారుల బృందం ఈ వారంలో భారత్‌కు రానుందని గోయల్ చెప్పారు.

    వివరాలు 

    ఫ్రాన్స్‌తో వాణిజ్య,పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం

    జూన్ చివరిలోపు ఈ మధ్యంతర ఒప్పందం రూపుదిద్దుకునే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.

    గత నెలలో భారత వాణిజ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ వాషింగ్టన్‌ వెళ్లి, ప్రతిపాదిత ఒప్పందంపై అమెరికా అధికారులతో చర్చలు జరిపిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

    ప్రస్తుతం ఫ్రాన్స్‌లో అధికారిక పర్యటనలో ఉన్న పీయూష్ గోయల్, ఆ దేశంతో వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అక్కడి రాజకీయ నాయకులు, వ్యాపార ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

    ఇకపోతే, భారత్ నుంచి దిగుమతి అవుతున్న ఉక్కు, అల్యూమినియంపై ఇప్పటికే ఉన్న 25 శాతం దిగుమతి సుంకాలను జూన్ 4వ తేదీ నుంచి 50 శాతానికి పెంచనున్నట్లు ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.

    వివరాలు 

    WTO ద్వారా నోటీసులు.. తిరస్కరించిన అమెరికా 

    ఈ నిర్ణయం భారత ఆటో మొబైల్ విడిభాగాల తయారీదారులు, ఉక్కు రంగ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా నుండి దిగుమతయ్యే కొన్ని వస్తువులపై ప్రతీకార చర్యగా సుంకాలు విధించనున్నట్లు భారత్ ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)కు తెలియజేసింది.

    భారత ఉక్కు, అల్యూమినియంపై అమెరికా విధించిన సుంకాలకు స్పందనగా, అమెరికా వస్తువులకు ఇస్తున్న రాయితీలను రద్దు చేయడం,అలాగే దిగుమతి సుంకాలను పెంచే ప్రక్రియను భారత్ ప్రారంభించినట్టు పేర్కొంది.

    ఈ చర్యల గురించి WTO ద్వారా అమెరికాకు నోటీసులు పంపించగా, వాటిని అమెరికా తిరస్కరించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పీయూష్ గోయెల్‌

    తాజా

    Piyush Goyal: వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి: పీయూష్ గోయెల్‌ పీయూష్ గోయెల్‌
    IPL 2025: ఫైనల్ మ్యాచ్ రద్దయితే ట్రోఫీ ఎవరిది..? ఐపీఎల్ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే? బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    coriander recipes: కొత్తిమీర వేసి చేసే మూడు అద్భుతమైన వంటకాలు ఇవే.. ట్రై చేయండి వంటగది
    VinFast: విన్‌ఫాస్ట్ సంచలనం.. భారత మార్కెట్‌కి రెండు కొత్త ఎలక్ట్రిక్ SUVలు! ఆటో మొబైల్

    పీయూష్ గోయెల్‌

    సహకారమే లక్ష్యంగా బ్రిక్స్ స్టార్టప్ ఫోరమ్‌‌ను ప్రారంభించనున్న భారత్  బ్రిక్స్ సమ్మిట్
    పీయూష్ గోయల్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు.. క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష కూటమి డిమాండ్ రాజ్యసభ
    Tesla : భారత్‎లోకి టెస్లా.. పీయూష్‌ గోయల్‌తో మస్క్‌ భేటీ ఎప్పుడో తెలుసా టెస్లా
    Piyush Goyal: ఎగ్జిట్ పోల్ తర్వాత భారతీయ పెట్టుబడిదారులు లాభాలు పొందారు,రాహుల్‌కి ఏమీ తెలియదు;బీజేపీ ఎదురుదాడి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025