NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / S Jaishankar: పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటన.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌పై జైశంకర్‌ సంచలన ఆరోపణలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    S Jaishankar: పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటన.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌పై జైశంకర్‌ సంచలన ఆరోపణలు
    పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటన.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌పై జైశంకర్‌ సంచలన ఆరోపణలు

    S Jaishankar: పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటన.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌పై జైశంకర్‌ సంచలన ఆరోపణలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 22, 2025
    04:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటనపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్ తీవ్రంగా స్పందించారు.

    ఈ దాడిని ఆయన "అనాగరిక చర్య"గా అభివర్ణించారు. కశ్మీర్‌లో పర్యాటకాన్ని నాశనం చేయడం, మతపరమైన విభేదాలను రెచ్చగొట్టడం వంటి ఉద్దేశంతోనే ఈ దాడి జరిగింది అని వ్యాఖ్యానించారు.

    ప్రస్తుతం డెన్మార్క్‌, నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న జైశంకర్‌ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలపై మాట్లాడుతూ పాకిస్థాన్‌, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను తీవ్రంగా విమర్శించారు.

    మునీర్‌కు "తీవ్రమైన మతపరమైన దృక్పథం" ఉందని అన్నారు.

    వివరాలు 

    లష్కరే ఉగ్రవాదుల దాడి వెనుక మతపరమైన ముప్పు 

    జైశంకర్ తెలిపిన వివరాలప్రకారం..పహల్గామ్‌లో జరిగిన దాడిలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు మతాన్ని నిర్ధారించిన తర్వాత కుటుంబ సభ్యుల ఎదుటే 26మందిని హత్య చేసినట్టు తెలిపారు.

    ఇది మతపరమైన ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు చేసిన చర్యగా పేర్కొన్నారు.పర్యాటకం ద్వారా జీవించే కశ్మీర్ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్టు తెలిపారు.

    ఆసిమ్ మునీర్‌కు పాక్ ప్రభుత్వం ఫీల్డ్ మార్షల్ పదోన్నతి

    ఇక మరోవైపు,పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ ఆసిమ్ మునీర్‌ను పాక్ ప్రభుత్వం ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతిని ఇచ్చిన విషయం తెలిసిందే.

    ఈనిర్ణయం ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్నట్టు సమాచారం.

    భారత్‌తో ఎదురైన పోరులో మునీర్ నాయకత్వం చూపించడమే ఈపదోన్నతికి కారణమని పాక్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

    వివరాలు 

    ఫీల్డ్ మార్షల్ హోదా పొందిన మునీర్

    ఫీల్డ్ మార్షల్ హోదా పాకిస్థాన్ మిలిటరీలో అత్యున్నత ర్యాంక్‌గా గుర్తించబడుతుంది.

    ఇప్పటివరకు ఈ హోదా పొందిన వ్యక్తుల్లో మునీర్ రెండవవారు కావడం గమనార్హం.

    ఇంతకుముందు 1959లో జనరల్ ఆయుబ్ ఖాన్‌కు ఈ ర్యాంకు దక్కింది. మునీర్ 2022 నవంబర్‌లో పాక్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు.

    ఇటీవల పాక్ సుప్రీంకోర్టు ఆయనకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ మిలిటరీ కోర్టుల్లో పౌరులను విచారించేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

    ఇప్పుడు ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి పొందడంతో మునీర్ ప్రాబల్యం మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుబ్రమణ్యం జైశంకర్

    తాజా

    S Jaishankar: పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటన.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌పై జైశంకర్‌ సంచలన ఆరోపణలు సుబ్రమణ్యం జైశంకర్
    Stock Market: కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు! స్టాక్ మార్కెట్
    Vishwambhara : కేన్స్ లో 'విశ్వంభర' బుక్ రిలీజ్.. అందులో ఏముందంటే..? మెగా ఎపిక్ సినిమాకు గ్లోబల్ అటెన్షన్ విశ్వంభర
    Munnar Travel Guide: పర్యాటకుల మనసు దోచుకునే మున్నార్ ప్రదేశాలు.. చూడాల్సిందే! పర్యాటకం

    సుబ్రమణ్యం జైశంకర్

    నిజ్జర్ హత్య గురించి నన్ను అడగడం సరికాదు: జైశంకర్ ఆసక్తికర  వ్యాఖ్యలు  తాజా వార్తలు
    ఖలిస్థాన్ ఉగ్రవాదం మళ్లీ పురుడు పోసుకోవడానికి కెనడా ఉదాసీనతే కారణం: జైశంకర్  తాజా వార్తలు
    భారత్‌ అమెరికా సంబంధాలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు.. ఇరు దేశాల మైత్రికి హద్దుల్లేవని ప్రకటన అమెరికా
    జైశంకర్ ఆధ్వర్యంలో అమెరికా-భారత్ బంధం మరింత బలపడింది: విదేశాంగ మంత్రిపై యూఎస్ ప్రశంసలు  అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025