NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rekha Guptha: ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా
    తదుపరి వార్తా కథనం
    Rekha Guptha: ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా
    ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా

    Rekha Guptha: ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 20, 2025
    12:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో రేఖా గుప్తా (Rekha Gupta) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

    లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెకు ప్రమాణం చేయించారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో భాజపా అధికారాన్ని తిరిగి సంపాదించుకుంది, దీంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

    ఈ శుభ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భాజపా అగ్రనేతలు హాజరయ్యారు.

    అలాగే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రమాణ స్వీకారం చేస్తున్న రేఖా గుప్తా

    दिल्लीत भगवा फडकला 💪🏻🚩@gupta_rekha 𝗷𝗶 𝘁𝗮𝗸𝗲𝘀 𝗢𝗮𝘁𝗵 𝗮𝘀 𝗖𝗵𝗶𝗲𝗳 𝗠𝗶𝗻𝗶𝘀𝘁𝗲𝗿 𝗼𝗳 𝗗𝗲𝗹𝗵𝗶 🔥🔥

    It is a matter of joy that the BJP is forming the government after 27 years.#RekhaGupta #DelhiCM #NarendraModi #DelhiNewCM pic.twitter.com/PMUHHMc1MV

    — Sachin ( Modi Ka Parivar ) (@SM_8009) February 20, 2025

    వివరాలు 

     నాలుగో మహిళా సీఎంగా రేఖా గుప్తా 

    ఢిల్లీ తొమ్మిదో ముఖ్యమంత్రిగా,నాలుగో మహిళా సీఎంగా రేఖా గుప్తా ఒక విశేషమైన రికార్డు నెలకొల్పారు.

    గతంలో సుష్మా స్వరాజ్‌,షీలా దీక్షిత్‌,అతిశీ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.

    సీఎం రేఖా గుప్తాతో పాటు మరో ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

    పర్వేశ్‌ వర్మ,ఆశిష్‌ సూద్‌,మంజీందర్‌ సింగ్‌ సిర్సా,పంకజ్‌ సింగ్‌,కపిల్‌ మిశ్రా,రవీంద్ర ఇంద్రజ్‌ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.

    ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం రేఖా గుప్తా తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు.

    మార్గం మధ్యలో మార్గట్‌ వాలే బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.భద్రతా చర్యల పరంగా,రామ్‌లీలా మైదానం వద్ద 25 వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌ భద్రతను సమర్థవంతంగా నిర్వహించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్
    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా
    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా

    దిల్లీ

    BJP: మూడేళ్లలో యమునా నదిని పూర్తిగా శుభ్రం చేస్తాం : అమిత్ షా అమిత్ షా
    Murder: గొంతు కోసి చంపాడు.. లివ్ ఇన్ రిలేషన్‌లో మరో హత్య హత్య
    Delhi: ఢిల్లీలో కూలిన నాలుగు అంతస్థుల భవనం.. ముగ్గురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ భారతదేశం
    Etikoppaka Toys : రిపబ్లిక్ డే పరేడ్‌లో ఏపీ శకటానికి ప్రతిష్టాత్మక మూడో స్థానం! గణతంత్ర దినోత్సవం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025