NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sheesh mahal: షీష్‌మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం: రేఖా గుప్తా
    తదుపరి వార్తా కథనం
    Sheesh mahal: షీష్‌మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం: రేఖా గుప్తా
    షీష్‌మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం: రేఖా గుప్తా

    Sheesh mahal: షీష్‌మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం: రేఖా గుప్తా

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 20, 2025
    10:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో దిల్లీలో 'శీష్‌ మహల్‌' పేరు విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

    తాజాగా, దిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆ బంగ్లాను మ్యూజియంగా మార్చనున్నట్లు ప్రకటించారు.

    ''ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తాం. అలాగే, నాకు ఈ పదవిని ఇచ్చినందుకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు'' అని ఆమె జాతీయ మీడియాతో వెల్లడించారు.

    వివరాలు 

    నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించాం, కానీ కేజ్రీవాల్..

    ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో, ఆయన సివిల్ లైన్స్‌లో 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని బంగ్లాను అధికారిక నివాసంగా ఉపయోగించేవారు.

    అయితే, బీజేపీ ఈ బంగ్లాను 'శీష్ మహల్' (అద్దాల మేడ)గా అభివర్ణించింది.

    ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, కేజ్రీవాల్ దాన్ని ఏకంగా 7-స్టార్ రిసార్ట్‌గా మార్చుకున్నారని తీవ్ర విమర్శలు చేసింది.

    ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, ''నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించాం, కానీ కేజ్రీవాల్ మాత్రం అద్దాల మేడను నిర్మించుకున్నాడు'' అంటూ ఎద్దేవా చేశారు.

    వివరాలు 

    అవినీతి ఆరోపణలు ఆమ్‌ఆద్మీ పార్టీకి భారీగా నష్టం

    ఆప్ మోసాలను అద్దాల మేడగా చూపిస్తూ, బీజేపీ దీన్ని ఎన్నికల ప్రచారంలో ఓ ప్రధాన అంశంగా తీసుకుంది.

    ఈ అవినీతి ఆరోపణలు ఆమ్‌ఆద్మీ పార్టీకి భారీగా నష్టం కలిగించాయి, చివరకు బీజేపీకి విజయాన్ని అందించాయి.

    ప్రజల్లో అనవసర విమర్శలు రాకుండా ఉండేందుకు, బీజేపీ ఈ బంగ్లాను ఉపయోగించకూడదని ముందుగానే నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

    దిల్లీకి కొత్తగా వచ్చనున్న ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈ బంగ్లాలో నివసించే అవకాశం లేదన్న ఊహాగానాల నడుమ, ఆమె తాజా ప్రకటనతో ఈ అంశానికి క్లారిటీ వచ్చింది.

    వివరాలు 

    వేడుక కోసం 25,000 మంది భద్రతా సిబ్బంది

    ఇదిలా ఉండగా, రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవం రామ్‌లీలా మైదానంలో గురువారం వేలాది మంది ప్రజల సమక్షంలో జరగనుంది.

    ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, అమిత్‌ షా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ తోపాటు ఎన్డీయే నేతలు, పలువురు ఎంపీలు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.

    ఈ వేడుక కోసం దాదాపు 25,000 మంది భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నారు.

    ప్రస్తుతం బీజేపీ పాలనలో ఉన్న 14 రాష్ట్రాల్లో ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేరు.

    ఈ నేపథ్యంలో, పార్టీ అధిష్ఠానం రేఖా గుప్తాను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయడంపై ప్రత్యేక ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    NIA: పాక్‌ గూఢచర్య నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు ఎన్ఐఏ
    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్
    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్
    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్

    దిల్లీ

    BJP: మూడేళ్లలో యమునా నదిని పూర్తిగా శుభ్రం చేస్తాం : అమిత్ షా అమిత్ షా
    Murder: గొంతు కోసి చంపాడు.. లివ్ ఇన్ రిలేషన్‌లో మరో హత్య హత్య
    Delhi: ఢిల్లీలో కూలిన నాలుగు అంతస్థుల భవనం.. ముగ్గురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ భారతదేశం
    Etikoppaka Toys : రిపబ్లిక్ డే పరేడ్‌లో ఏపీ శకటానికి ప్రతిష్టాత్మక మూడో స్థానం! గణతంత్ర దినోత్సవం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025