NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: పహల్గామ్ ఉగ్రదాడి పాక్‌ గగనతలంలోకి వెళ్లకుండా మోదీ తిరుగు ప్రయాణం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    PM Modi: పహల్గామ్ ఉగ్రదాడి పాక్‌ గగనతలంలోకి వెళ్లకుండా మోదీ తిరుగు ప్రయాణం 
    పహల్గామ్ ఉగ్రదాడి పాక్‌ గగనతలంలోకి వెళ్లకుండా మోదీ తిరుగు ప్రయాణం

    PM Modi: పహల్గామ్ ఉగ్రదాడి పాక్‌ గగనతలంలోకి వెళ్లకుండా మోదీ తిరుగు ప్రయాణం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 23, 2025
    12:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పరిధిలోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన భయంకర ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపధ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే ముగించుకుని తక్షణమే భారత్‌కి చేరుకున్నారు.

    అయితే, తిరుగు పయనంలో ఆయన ప్రయాణించిన విమానం పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంది. ఇది ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్‌లో కనిపించిన దృశ్యాల ద్వారా వెల్లడైంది.

    మంగళవారం ఉదయం ప్రధానమంత్రి మోదీ ప్రయాణించిన ఎయిర్‌ఫోర్స్ బోయింగ్ 777-300 విమానం రియాద్‌ వెళ్లేటప్పుడు మాత్రం పాకిస్థాన్ గగనతలాన్ని దాటి ప్రయాణించింది.

    కానీ అనంతరం జరిగిన దాడి కారణంగా అప్రమత్తత చర్యగా తిరుగు ప్రయాణానికి పాక్ గగనతలాన్ని మళ్లీ ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

    వివరాలు 

    భద్రతా చర్యలపై ఆరా 

    అరేబియా సముద్రం మీదుగా విమానం గుజరాత్ గగనతలంలోకి ప్రవేశించి,అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకుంది.

    పాకిస్థాన్ వైపు నుండి ముప్పు ఉండవచ్చన ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికల కారణంగా ఈ మార్పు జరిగిందని సమాచారం.

    ఈ ఉదయం ఢిల్లీకి చేరుకున్న వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం నిర్వహించారు.

    ఈ సమావేశంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు.

    ఉగ్రదాడిపై సమీక్ష నిర్వహించడంతోపాటు, భద్రతా చర్యలపై ఆరాతీశారు.

    అదే రోజు ప్రధానమంత్రి నేతృత్వంలో భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశం జరగనుంది.

    వివరాలు 

    విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలు 

    పహల్గాం సమీపంలోని బైసరన్ లోయ, జమ్మూ కశ్మీర్‌లోని మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన ప్రాంతం.

    అక్కడే మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సైనిక దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేశారు.

    వారు పర్యాటకుల చుట్టూ చేరి, చాలా దగ్గరగా ఉండగానే కాల్పులు ప్రారంభించారు.

    ఈ మృత్యుఘాటక ఘటనలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

    ఘటన అనంతరం, ముష్కరులు సమీప అడవుల్లోకి పారిపోయారు. వారిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం
    Israel-Hamas: మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 66 మంది మృతి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది ఐఎంఎఫ్
    Brazil : 154 అంతస్తులతో సెన్నా టవర్‌.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది బ్రెజిల్

    నరేంద్ర మోదీ

    PM Modi: నేటి నుంచి రెండ్రోజులు మారిషస్‌‌లో మోదీ..  భారతదేశం
    PM Modi: మారిషస్‌ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ప్రత్యేక కానుక.. కుంభమేళా పవిత్ర జలం గిఫ్ట్  భారతదేశం
    PM Modi: ప్రధాని మోదీకి మారిషస్‌ అత్యున్నత పురస్కారం.. ప్రకటించిన మారిషస్‌ ప్రధాని నవీన్‌ రామ్‌గులాం  భారతదేశం
    Amaravati: ఏప్రిల్ 15న ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటన.. రాజధాని పునః ప్రారంభ పనులకు శ్రీకారం  అమరావతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025