NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Narendra modi: దేశాన్ని విభజించాలని కాంగ్రెస్ కుట్ర..  రాహుల్ గాంధీకి పరిపక్వత లేదన్న మోదీ 
    తదుపరి వార్తా కథనం
    Narendra modi: దేశాన్ని విభజించాలని కాంగ్రెస్ కుట్ర..  రాహుల్ గాంధీకి పరిపక్వత లేదన్న మోదీ 

    Narendra modi: దేశాన్ని విభజించాలని కాంగ్రెస్ కుట్ర..  రాహుల్ గాంధీకి పరిపక్వత లేదన్న మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jul 02, 2024
    06:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    18వ లోక్‌సభ తొలి సెషన్‌ రెండో వారం రెండో రోజున రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు.

    రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలిపేందుకే తాను సభకు హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా తొలిసారిగా పార్లమెంట్‌కు చేరుకున్న సభ్యుల ప్రసంగంపై ప్రశంసలు కురిపిస్తూ విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

    ఈ సందర్భంగా విపక్షాలు నినాదాలు చేస్తూ రభస సృష్టించాయి.

    వివరాలు 

    "కొంతమంది బాధను నేను అర్థం చేసుకోగలను" 

    నిరంతరం అసత్యాలు ప్రచారం చేసినా లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైనందుకు కొంత మంది బాధను నేను అర్థం చేసుకోగలను అని ప్రధాని అన్నారు.

    ప్రధాని మోదీ ఇంకా మాట్లాడుతూ.. ''దేశ ప్రజలు మూడోసారి సేవ చేసే అవకాశం ఇచ్చారు. బీజేపీ పదేళ్ల చరిత్రను దేశ ప్రజలు చూశారని.. మన ప్రభుత్వం ఎలాంటి కృషి చేసిందో ప్రజలు చూశారని అన్నారు. పేదల సంక్షేమం కోసం దీన్ని అంకితభావంతో చేశారు.

    వివరాలు 

    మా ఆలోచన బుజ్జగింపు కాదు.. సంతృప్తి:  మోదీ 

    మేము బుజ్జగింపు ఆలోచనను అనుసరించడం లేదన్నా మోదీ, సంతృప్తి పరచడమే లక్ష్యం అన్నారు. ఈ దేశం కూడా చాలా కాలంగా బుజ్జగింపు రాజకీయాలను చూసింది, సంతృప్తి గురించి మాట్లాడినప్పుడు, ప్రయోజనాలు చివరి వ్యక్తికి చేరాలని ప్రధాని అన్నారు.

    "మేము సంతృప్త సూత్రం గురించి మాట్లాడినప్పుడు, దాని నిజమైన అర్థం సామాజిక న్యాయం, దేశ ప్రజలు మమ్మల్ని మూడవసారి ఎన్నుకోవడం ద్వారా దీనిని ఆమోదించారు" అని అన్నారు.

    వివరాలు 

    విపక్షాలు నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించడంతో స్పీకర్‌ను మందలించారు 

    ప్రధాని మోదీ ప్రసంగం ప్రారంభం కాగానే విపక్షాలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ దుమారం సృష్టించాయి.

    మణిపూర్‌ హింస, నీట్‌ పేపర్‌ లీగ్‌, అగ్నివీర్‌ యోజన వంటి అంశాలపై ప్రతిపక్షాలు నినాదాలు చేస్తూ ప్రధాని ప్రసంగాన్ని ఆపాలని ఒత్తిడి తెచ్చాయి. ఈ సందర్భంగా ప్రధాని కాసేపు ప్రసంగాన్ని ఆపాల్సి వచ్చింది.

    లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా విపక్షాలను మందలించి శాంతింపజేసేందుకు ప్రయత్నించినా ప్రతిపక్ష నేతలు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.

    వివరాలు 

    మొదటిసారి గెలిచిన ఎంపీలు సభ గౌరవాన్ని పెంచారు 

    'తొలిసారి ఎంపీలుగా వచ్చిన వారు, మరికొందరు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.అనుభవం ఉన్న ఎంపీలా వారి ప్రవర్తన ఉంది.. తమ ప్రవర్తనతో సభ గౌరవాన్ని పెంచారు' అని ప్రధాని మోదీ అన్నారు.

    వివరాలు 

    'భారత్ ప్రథమ్‌' మా ఏకైక లక్ష్యం 

    ''వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా రాష్ట్రపతి మార్గదర్శనం చేశారని ప్రధాని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై పలువురు సభ్యులు అభిప్రాయాలు చెప్పారని.. సభ గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదేనన్నారు.

    పదేళ్లలో అవినీతిరహిత పాలన అందించాం గనకే ప్రజలు మరోసారి మాకు అవకాశమిచ్చారని అన్నారు.

    గత పదేళ్లలో ప్రపంచ దేశాల్లో మన దేశ ప్రతిష్ఠ మరింత పెరిగిందన్నారు. ఇవాళ ప్రపంచమంతా మనవైపు చూస్తోందన్నా మోదీ 'భారత్‌ ప్రథమ్‌' అనే మా విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం అన్నారు.

    ఏ కార్యక్రమం చేపట్టినా 'భారత్‌ ప్రథమ్‌' కేంద్రంగానే తీసుకుంటున్నామన్నారు. మా పథకాలన్నీ అట్టడుగు వర్గాలకు చేరాలనేదే మా విధానం'' అని ప్రధాని తెలిపారు.

    వివరాలు 

    2014కి ముందు చాలా కాలం స్కామ్‌లు ఉన్నాయి- మోదీ 

    విపక్షాల కోలాహలం మధ్య ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 2014కి ముందు మన దేశ ప్రజలు ఆత్మవిశ్వాసాన్నికోల్పోయారని, దేశం నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిందన్నారు.

    కాంగ్రెస్ హయాంలో ఏ న్యూస్ పేపర్ చూసిన కుంభకోణాలే కనిపించేవని ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లక్షల కోట్ల రూపాయల స్కాములు జరిగాయని అన్నారు.

    వివరాలు 

    నేటి భారతదేశం ఉగ్రవాదులను వారి ఇళ్లలోకి ప్రవేశించి చంపుతుంది - మోడీ 

    2014కు ముందు పెద్ద పెద్ద బ్యాంకులకు తాళాలు పడేవని, ఆ తర్వాత విధానాలు మార్చామని, నిర్ణయాల్లో వేగం చూశామని, నేడు భారతీయ బ్యాంకులు ప్రపంచంలోని మంచి బ్యాంకుల్లో ఒకటిగా మారాయని ప్రధాని మోదీ అన్నారు.

    2014కు ముందు దేశంలో ఎక్కడికైనా ఉగ్రవాదులు ప్రవేశించి దాడులు చేసేవారని, నేడు 2014 తర్వాత ఉగ్రవాదుల ఇళ్లలోకి చొరబడి భారత్‌ వారిని హతమార్చిందని, వైమానిక దాడులు, సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తున్నాయని అన్నారు.

    వివరాలు 

    జమ్ముకశ్మీర్ ప్రజల హక్కులు హరించబడ్డాయి 

    2014కు ముందు జమ్ముకశ్మీర్ ప్రజల హక్కులను కాలరాశారు.. సైన్యాలపై రాళ్లు రువ్వారు.. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలగించాకా.. అప్పుడు బలమైన ప్రజాస్వామ్యం ఏర్పడింది" అని అన్నారు.

    వివరాలు 

    కాంగ్రెస్ వరుసగా మూడోసారి 100 మార్కును దాటలేకపోయింది - మోడీ 

    స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 100 సీట్ల మార్కును కూడా దాటలేకపోవడం ఇది మూడోసారి అన్నారు.

    కాంగ్రెస్ చరిత్రలో ఇది మూడో అతిపెద్ద పరాజయం అని.. ఈ విషయాన్ని కాంగ్రెస్ అంగీకరించి ఉంటే బాగుండేదని ప్రధాని మోదీ అన్నారు.

    వారి ఓటమిని బిజెపిని ఓడిపోయినట్లు ప్రయత్నిస్తోందన్నారు.

    వివరాలు 

    కాంగ్రెస్ పరాన్నజీవిగా మారింది- మోదీ 

    16 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం పడిపోయిందని.. గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో 64 సీట్లకు గాను 2 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగిందని.. అంటే కాంగ్రెస్ పూర్తిగా పరాన్నజీవి అయిందని.. ప్రధాని మోదీ అన్నారు.

    "కాంగ్రెస్ ప్రతీ ఎన్నికల్లో మిత్రపక్షాల ఓట్లను తినే పరాన్నజీవి అని అన్నారు.. కాంగ్రెస్ దాని మిత్రపక్షాల ఓట్లను మాయం చేసి ఉండకపోతే లోక్‌సభలో ఇన్ని సీట్లు గెలవడం కష్టమయ్యేది"అని మోదీ అన్నారు.

    వివరాలు 

    కాంగ్రెస్‌పై మండిపడిన ప్రధాని మోదీ 

    లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100కి 99 రాలేదని, 543 సీట్లకు 99 వచ్చాయన్న విషయాన్ని కాంగ్రెస్ గుర్తు పెట్టుకోవాలన్నారు.

    మూడు సార్లు కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు రాలేదని, దేశ రాజకీయాల్లో వారికిదే మొదటిసారని అన్నారు. కాంగ్రెస్‌కి ఇది మూడో అత్యంత దరిద్ర ప్రదర్శన అని అన్నారు.

    వివరాలు 

    ఉత్తరాది, దక్షిణాది ప్రజలను రెచ్చగొడుతున్నారు- మోదీ 

    కాంగ్రెస్ దేశాన్ని విభజించాలని చూస్తోందని, అలాంటి వ్యక్తులకు కూడా టికెట్లు ఇచ్చిందని మోదీ అన్నారు.

    ఒక కులాన్ని మరో కులాన్ని రెచ్చగొట్టేందుకు కథనాలను సృష్టిస్తోందని ఆరోపించారు.

    జూన్ 4న వారు కోరుకున్న ఫలితాలు రాకుంటే దేశాన్ని తగలబెట్టాలని అనుకున్నారని పలు వేదికల నుంచి ప్రకటించిందన్నారు.

    అరాచకాన్ని వ్యాప్తి చేయాలని చూశారని అన్నారు.

    భాషా ప్రాతిపదికన ఉత్తరాది, దక్షిణాదిని విభజిస్తోందని, తూర్పు, పశ్చిమ ప్రాంతాలను కూడా ఇదే విధంగా ప్రేరేపిస్తోందని ప్రధాని ఆరోపించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్

    నరేంద్ర మోదీ

    Narendra Modi: వారణాసి నుంచి  ప్రధాని నరేంద్ర మోదీ  భారీ విజయం    భారతదేశం
    Narendra Modi: 'భారతదేశ చరిత్రలో ఇది అపూర్వమైన క్షణం...' అని ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాని మోదీ  భారతదేశం
    PM Set For Historic 3rd Term:ధీమా వ్యక్తం చేసిన మోదీ..మూడో సారి ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కిందన్న ప్రధాని భారతదేశం
    Narendramodi: ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏ విదేశీ అతిథులు హాజరవుతారంటే..? భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025