NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Parliment: పార్లమెంట్‌ను కుదిపేస్తున్న అదానీ అంశం.. నవంబర్ 27కి పార్లమెంటు వాయిదా
    తదుపరి వార్తా కథనం
    Parliment: పార్లమెంట్‌ను కుదిపేస్తున్న అదానీ అంశం.. నవంబర్ 27కి పార్లమెంటు వాయిదా
    Parliment: పార్లమెంట్‌ను కుదిపేస్తున్న అదానీ అంశం.. నవంబర్ 27కి పార్లమెంటు వాయిదా

    Parliment: పార్లమెంట్‌ను కుదిపేస్తున్న అదానీ అంశం.. నవంబర్ 27కి పార్లమెంటు వాయిదా

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 25, 2024
    12:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శీతాకాల పార్లమెంట్ సమావేశాలు మొదలైన గంటలోనే ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి.

    తొలుత, ఇటీవల మరణించిన సభ్యులకు సభలో ఎంపీలు సంతాపం ప్రకటించారు. అనంతరం లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేయబడింది.

    అదే సమయంలో, రాజ్యసభలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసులు, అవినీతి ఆరోపణల గురించి ప్రస్తావించారు.

    అదానీ అవినీతి దేశానికి తీవ్ర ప్రభావం చూపిస్తోందని, ఈ అంశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అతనికి మద్దతు ఇచ్చినట్టు ఆరోపించారు.

    కానీ, అదానీ అంశంపై చర్చ చేపట్టేందుకు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ నిరాకరించడంతో విపక్ష సభ్యులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.ఈ కారణంగా రాజ్యసభ కూడా బుధవారానికి వాయిదా పడింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నవంబర్ 27కి పార్లమెంటు వాయిదా

    #Parliament Winter Session 2024: Both Houses adjourned till 27 Nov, Rajya Sabha over Oppn demanding discussion on Adani bribery charges. #WinterAhead#ParliamentSession#Parliament #WinterSession #Parliamentwintersession pic.twitter.com/CATVAczJ44

    — Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) November 25, 2024

    వివరాలు 

    లోక్‌సభ బుధవారానికి వాయిదా 

    తదుపరి, వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్‌సభలోనూ ఇండియా కూటమి సభ్యులు అదానీ అవినీతి అంశంపై చర్చించాలని పట్టుబట్టారు.

    దాంతో, స్పీకర్ ఓం బిర్లా కూడా సభను బుధవారానికి వాయిదా వేశారు. ఈ పరిణామాలతో ఉభయ సభల్లో అదానీ అవినీతి అంశం ప్రధాన చర్చాంశంగా మారింది.

    విపక్ష సభ్యులు ఈ విషయంపై చర్చ అనివార్యమని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

    ఈ పరిస్థితుల్లో, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన గంటలోనే గందరగోళం ఏర్పడి వాయిదా పడింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పార్లమెంట్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    పార్లమెంట్

    పార్లమెంట్ అజెండాలో పుదుచ్చేరి,జమ్ముకశ్మీర్ మహిళా కోటా బిల్లులు భారతదేశం
    All-party meeting: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కేంద్రం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం  తాజా వార్తలు
    PM Modi: ఎన్నికల్లో ఓటమిపై కోపం వద్దు: ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ సెటైర్ నరేంద్ర మోదీ
    డిసెంబర్ 13లోగా భారత పార్లమెంట్‌పై దాడి చేస్తా: గురుపత్వంత్ సింగ్ బెదిరింపు గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025