NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: జూన్ 6న జమ్మూకాశ్మీర్‌లో మోదీ పర్యటన.. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలి పర్యటన
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    PM Modi: జూన్ 6న జమ్మూకాశ్మీర్‌లో మోదీ పర్యటన.. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలి పర్యటన
    జూన్ 6న జమ్మూకాశ్మీర్‌లో మోదీ పర్యటన.. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలి పర్యటన

    PM Modi: జూన్ 6న జమ్మూకాశ్మీర్‌లో మోదీ పర్యటన.. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలి పర్యటన

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 03, 2025
    01:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 6న జమ్ముకశ్మీర్‌ను సందర్శించనున్నారు.

    ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత మోదీ మొదటిసారిగా ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో పర్యటించబోతున్నారు.

    ఆయన ఈ సందర్భంగా శ్రీనగర్‌కు వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.

    మొదటగా ఈ రైలు ప్రారంభోత్సవం ఏప్రిల్ 19న జరగాల్సి ఉండగా, అప్పటి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

    ఈలోగా ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఘోర ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

    ఈ దాడికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం "ఆపరేషన్ సిందూర్" పేరుతో ప్రతీకార చర్యలు ప్రారంభించింది.

    వివరాలు 

    భద్రతా వ్యవస్థ పూర్తిగా కట్టుదిట్టం

    జూన్ 6న మోదీ పర్యటనలో భాగంగా చినాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెనను ప్రారంభించనున్నారు.

    దీనితో పాటు అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

    శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్ వరకు నడిచే ప్రత్యేక వందే భారత్ "కాశ్మీర్ ఎడిషన్" రైలును కూడా జెండా ఊపి ప్రారంభించనున్నారాయన.

    ఈ కార్యక్రమ వేదికపై మోదీ ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించిన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

    ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని భద్రతా వ్యవస్థను పూర్తిగా కట్టుదిట్టం చేశారు.

    వివరాలు 

    ఆపరేషన్ సిందూర్‌లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతం 

    ఇక ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు.

    పాకిస్థాన్ మద్దతుతో జరిగిన దాడుల్లో దెబ్బతిన్న నివాసాలను పరిశీలించారు. దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

    ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ప్రభుత్వం పాకిస్థాన్‌పై పలు కఠిన చర్యలు తీసుకుంది.

    వాటిలో ముఖ్యంగా సింధు నదీ జలాల ప్రవాహాన్ని నిలిపివేయడం, పాకిస్థాన్‌కు ఇచ్చిన వీసాలను రద్దు చేయడం, అటారీ సరిహద్దును మూసివేయడం ఉన్నాయి.

    మే 7న చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమవ్వగా, పాకిస్థాన్ వైమానిక స్థావరాలకు తీవ్రంగా నష్టం జరిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    PM Modi: జూన్ 6న జమ్మూకాశ్మీర్‌లో మోదీ పర్యటన.. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలి పర్యటన నరేంద్ర మోదీ
    Sana Yousuf: పాకిస్థాన్‌లో దారుణం.. సోషల్ మీడియా స్టార్‌ను ఇంట్లోనే కాల్చి చంపారు సోషల్ మీడియా
    XChat: వాట్సాప్'కు పోటీగా X చాట్‌ను ప్రారంభించిన మస్క్ ఎలాన్ మస్క్
    Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌ డేట్ ఫిక్స్! పవన్ కళ్యాణ్

    నరేంద్ర మోదీ

    Swami Sivananda: స్వామి శివానంద మృతి.. ప్రధాని మోదీ సంతాపం యోగి ఆదిత్యనాథ్
    Amar preet singh: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ప్రధాని మోదీతో ఎయిర్‌ చీఫ్‌ భేటీ భారతదేశం
    IPL 2025: అతను చిచ్చర పిడుగులా రాణిస్తున్నాడు.. వైభవ్ సూర్యవంశీపై మోదీ ప్రశంసలు క్రికెట్
     PM Modi: ప్రధాని నరేంద్రమోదీతో రక్షణశాఖ కార్యదర్శి భేటీ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025