NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యవేక్షణలో 'ఆపరేషన్‌ సిందూర్‌'..  9 పాక్ ఉగ్ర స్థావరాల ధ్వంసం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యవేక్షణలో 'ఆపరేషన్‌ సిందూర్‌'..  9 పాక్ ఉగ్ర స్థావరాల ధ్వంసం 
    PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యవేక్షణలో 'ఆపరేషన్‌ సిందూర్‌'

    PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యవేక్షణలో 'ఆపరేషన్‌ సిందూర్‌'..  9 పాక్ ఉగ్ర స్థావరాల ధ్వంసం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 07, 2025
    07:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై జరిగిన 'ఆపరేషన్‌ సిందూర్‌'ను స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షించారు.

    ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత సాయుధ దళాలు పాక్‌లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను విజయవంతంగా ధ్వంసం చేశాయి.

    ఈ మెరుపు దాడుల నేపథ్యంలో పాకిస్థాన్‌ సైన్యం సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడింది.

    అయితే, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారత వాయుసేన వద్ద ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఆధునిక వాయు రక్షణ వ్యవస్థ మరింత అప్రమత్తంగా మారింది.

    వివరాలు 

    భారత ఎంబసీ అధికారిక ప్రకటనను విడుదల

    ఈ దాడులపై వివరణ ఇవ్వడం కోసం భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు పూర్తి వివరాలు అందించారు.

    పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత దళాలు చర్యలు తీసుకున్నట్లు అమెరికా, రష్యా, బ్రిటన్‌ (యూకే), సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వాలకు సమాచారం అందించబడింది.

    ఈ దాడుల గురించి వాషింగ్టన్‌ డీసీలో ఉన్న భారత ఎంబసీ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

    ఇందులో పాకిస్థాన్‌లోని పౌర లక్ష్యాలు, ఆర్థిక కేంద్రాలు, సైనిక స్థావరాలపై దాడులు జరగలేదని స్పష్టంగా పేర్కొంది.

    వివరాలు 

    నరేంద్రమోదీ అధ్యక్షతన క్యాబినెట్‌ కమిటీ అత్యవసర సమావేశం

    ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ కార్యదర్శితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ ప్రత్యక్షంగా మాట్లాడారు.

    ఉగ్రవాద స్థావరాలపై భారత చర్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందిస్తూ, భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు త్వరలో పరిష్కారమవాలని ఆకాంక్షించారు.

    తాజా పరిణామాల నేపథ్యంలో బుధవారం ఉదయం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన క్యాబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ (సీసీఎస్‌) అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యవేక్షణలో 'ఆపరేషన్‌ సిందూర్‌'

    Prime Minister Narendra Modi constantly monitored #OperationSindoor throughout the night.

    File Pic pic.twitter.com/q7BoCP4pqg

    — All India Radio News (@airnewsalerts) May 7, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    నరేంద్ర మోదీ

    PM Modi: ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. శ్రీలంక మిత్ర విభూషణ అవార్డు ప్రదానం శ్రీలంక
    Pamban Bridge: పాంబన్ వంతెన దేశానికి అంకితం.. ప్రారంభించిన మోదీ భారతదేశం
    PM Modi: 'సంతకమైనా తమిళంలో చేయండి'.. నేతల తీరుపై మోదీ అసహనం తమిళనాడు
    #NewsBytesExplainer:'విక్టరీ డే' పేరుతో రష్యా వేడుకలు..మోదీకి ఆహ్వానం.. భారత్-చైనా సంబంధాలపై ప్రభావం ఎంత? భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025