NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ 
    అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ

    అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Stalin
    Jun 20, 2023
    10:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం అమెరికాకు బయలుదేరారు. జూన్ 21-23వరకు మోదీ అమెరికాలో పర్యటించనున్నారు.

    ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారిక విందుకు ఆహ్వానించిన విషయం తెలిపిందే. దీంతో మొదటిసారిగా మోదీ అమెరికా అధ్యక్షుడి అధికారిక విందుకు హాజరుకానున్నారు.

    ఈ సందర్భంగా ప్రధాని మోదీ- అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య రక్షణ, వాణిజ్యంతో పాటు కీలక ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరగనుంది.

    జూన్ 21న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నాయకత్వం వహించనున్నారు. యోగా డే వేడుకలతో ప్రధాని మోదీ అమెరికా పర్యటన మొదలవుతుంది.

    మోదీ

    అమెరికాలో కాంగ్రెస్‌లో చారిత్రక ప్రసంగం

    జూన్ 22న వాషింగ్టన్ డీసీలోని అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్‌కు వెళ్లనున్నారు. అక్కడ మోదీకి బైడెన్ దంపతులు స్వాగతం పలకనున్నారు.

    అనంతరం అమెరికా కాంగ్రెస్‌లో మోదీ ప్రసంగించనున్నారు. గతంలో కూడా మోదీ అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించారు. అమెరికా కాంగ్రెస్‌లో రెండోసారి ప్రసంగించిన అతికొద్ది మంది విదేశీ నాయకుల జాబితాలో మోదీ చేరనున్నారు.

    అదేరోజు సాయంత్రం బైడెన్ దంపతులు ప్రధాని మోదీ గౌరవార్థం స్టేట్ డిన్నర్‌ను ఏర్పాటు చేయనున్నారు.

    అమెరికా అధికారిక పర్యటనకు వెళ్లిన మూడో భారతీయ నేత మోదీ. జూన్ 1963లో అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, నవంబర్ 2009లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అమెరికా అధికారిక పర్యటకు హాజరయ్యారు.

    మోదీ

    ఆ ఘనత సాధించిన ప్రపంచంలోనే మూడో నేతగా మోదీ రికార్డు

    ఏ భారత ప్రధాని కూడా అమెరికా కాంగ్రెస్‌లో రెండుసార్లు ప్రసంగించలేదని ఆ ఘనత మోదీకి దక్కబోతోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు.

    అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా కూడా విన్‌స్టన్ చర్చిల్, నెల్సన్ మండేలా మాత్రమే అమరికా కాంగ్రెస్‌లో రెండుసార్లు ప్రసంగించారు. ఇప్పుడు మూడో విదేశీ ప్రతినిధి మోదీ కాబోతున్నారు.

    ఇదిలా ఉంటే, అమెరికా అధ్యక్షుడు బైడైన్ అధికారిక విందును అందుకుంటున్న మూడో దేశాధిన మోదీ కావడం గమనార్హం.

    ఇప్పటి వరకు ఫ్రాన్స్‌కు చెందిన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, దక్షిణ కొరియాకు చెందిన యున్ సుక్ యోల్ మాత్రమే అమెరికా అధ్యక్షుడి అధికారిక విందును అందుకున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    దిల్లీ నుంచి అమెరికాకు వెళ్తున్న మోదీ 

    #WATCH | Prime Minister Narendra Modi leaves from Delhi for his first official State visit to the United States.

    He will attend Yoga Day celebrations at the UN HQ in New York and hold talks with US President Joe Biden & address to the Joint Session of the US Congress in… pic.twitter.com/y6avSoPpkd

    — ANI (@ANI) June 20, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    అమెరికా
    ప్రధాన మంత్రి
    జో బైడెన్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    నరేంద్ర మోదీ

    ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడుల అంశాన్ని లేవనెత్తిన ప్రధాని మోదీ; కఠినమైన చర్యలకు అల్బనీస్ హామీ  ప్రధాన మంత్రి
    కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్య్రానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి  అమిత్ షా
    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడంపై విపక్షాలపై విరుచుకపడ్డ ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    మోదీజీ, యుద్ధాన్ని ముగించే శాంతి ప్రతిపాదనకు మద్దతు తెలపండి; జెలెన్‌స్కీ అభ్యర్థన ప్రధాన మంత్రి

    అమెరికా

    26/11 దాడుల నిందితుడు తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా కోర్టు గ్రీన్ సిగ్నల్  ముంబై
    హైదరాబాద్‌లో అమెరికా దిగ్గజ కంపెనీ 'మెడ్‌ట్రానిక్' రూ.3వేల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్
    జీ7 సదస్సు కోసం నేడు జపాన్‌కు మోదీ; ప్రధాని ఎజెండాలోని అంశాలు ఇవే  నరేంద్ర మోదీ
    మెక్సికోలో తుపాకీ కాల్పులు; 10 మంది రేసర్లు మృతి  మెక్సికో

    ప్రధాన మంత్రి

    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ
    సిడ్నీలో ప్రధాని మోదీ అరుదైన స్వాగతం; 'వెల్‌కమ్ మోదీ' అంటూ ఆకాశంలో సందేశం నరేంద్ర మోదీ
    భారత్-ఆస్ట్రేలియా బంధాన్ని క్రికెట్, మాస్టర్‌చెఫ్ ఏకం చేశాయి: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    నరేంద్ర మోదీని 'ది బాస్' అని పిలిచిన ఆస్ట్రేలియా ప్రధాని నరేంద్ర మోదీ

    జో బైడెన్

    'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1' నరేంద్ర మోదీ
    'గూఢచారి' బెలూన్ శిథిలాలను చైనాకు అప్పగించేది లేదు: అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    అధ్యక్ష ఎన్నికల వేళ వైట్‌హౌస్ కీలక ప్రకటన- బైడెన్‌కు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    ఉక్రెయిన్‌కు రైలులో వచ్చిన బైడెన్: సినిమాను తలపించిన అమెరికా అధ్యక్షుడి రహస్య పర్యటన ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025