NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Stampede in India: గత ఏడాది కాలంలో దేశంలో జరిగిన తొక్కిసలాట ఘటనలు ఇవే..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stampede in India: గత ఏడాది కాలంలో దేశంలో జరిగిన తొక్కిసలాట ఘటనలు ఇవే..
    గత ఏడాది కాలంలో దేశంలో జరిగిన తొక్కిసలాట ఘటనలు ఇవే..

    Stampede in India: గత ఏడాది కాలంలో దేశంలో జరిగిన తొక్కిసలాట ఘటనలు ఇవే..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 05, 2025
    11:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    18 ఏళ్లకు పైగా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది.

    ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన సందర్భంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకలు అర్ధాంతరంగా విషాదంలోకి మారాయి.

    ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తీవ్రమైన తొక్కిసలాటలో కనీసం 11 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం.

    ఆనందదాయకమైన పండుగ వాతావరణం ఒక్కసారిగా విషాదవాతావరణంగా మారిపోయింది.

    ఈ వేడుకను కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహించారు.

    ఆర్సీబీ జట్టు గెలుపును చూసేందుకు, విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు వేలాదిగా అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు.

    అయితే పెద్ద సంఖ్యలో వచ్చిన జనానికి తగిన నిర్వహణ లేకపోవడంతో, అక్కడ ఒక ఘోరమైన తొక్కిసలాట చోటుచేసుకుంది.

    వివరాలు 

    గత ఏడాది భారత్‌లో జరిగిన ప్రాణాంతక తొక్కిసలాటలు 

    గత ఏడాది కాలంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన తొక్కిసలాటలు సంభవించాయి.

    కనీసం ఆరు పెద్ద ఘటనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వాటిలో ముఖ్యమైనవి ఇవే: 1. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్

    ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో మహా కుంభమేళాకు ప్రయాణించే ప్రయాణికుల మధ్య తీవ్ర తొక్కిసలాట జరిగింది.

    ఇందులో 11 మంది మహిళలు,ఐదుగురు చిన్నారులతో కలిపి కనీసం 18 మంది మరణించారు.

    ప్లాట్‌ఫారమ్‌లు 14,15ల మధ్య ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌పై ప్రయాణికులు జారిపడటంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగి ఈ దుర్ఘటనకు దారితీసింది.

    కొన్ని వర్గాల ప్రకారం,గంటకు 1,500 జనరల్ టికెట్లు విక్రయించడంతో ప్రయాణికులు అధిక సంఖ్యలో చేరడం,రైళ్లు ఆలస్యంగా రావడం ఈ గందరగోళానికి దారి తీసింది.

    వివరాలు 

    2. మహా కుంభమేళా, జనవరి 

    అంతేకాకుండా, ప్లాట్‌ఫారమ్ మార్పులపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు కూడా ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.

    జనవరి 29న తెల్లవారుజామున ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళా ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో కనీసం 30 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారు.

    మౌని అమావాస్య నాడు అమృత్ స్నాన్ చేసేందుకు లక్షలాది భక్తులు వచ్చారు.

    ఈ సమయానికి ఏర్పాట్లు తక్కువగా ఉండటంతో గందరగోళం ఏర్పడి ఈ ప్రమాదం జరిగింది.

    వివరాలు 

    3. గోవా ఆలయం, మే 

    ఉత్తర గోవా జిల్లా షిర్గావ్‌లోని లైరాయ్ దేవి ఆలయంలో మే నెలలో నిర్వహించిన వార్షిక జాతర సందర్భంగా తొక్కిసలాట జరిగింది.

    ఇందులో కనీసం 6 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు.

    పనాజీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో ఉత్సవానికి భారీగా భక్తులు రావడంతో భద్రతా లోపాల వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

    వివరాలు 

    4. తిరుపతి ఆలయం, జనవరి 

    జనవరి 8న తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ సమయంలో తొక్కిసలాట జరిగింది.

    ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టోకెన్లను జనవరి 9న ఉదయం 5 గంటల నుంచి ఇవ్వాల్సి ఉండగా, వేలాది మంది భక్తులు ముందుగానే కౌంటర్ల వద్ద గుమిగూడారు.

    అనారోగ్యంతో ఉన్న ఒక మహిళకు సహాయం చేసేందుకు గేట్ ఓపెన్ చేయడంతో జనం ఒక్కసారిగా ముందుకు రావడంతో పరిస్థితి అదుపు తప్పిందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వివరించారు.

    వివరాలు 

    5. సంధ్య థియేటర్, హైదరాబాద్ - డిసెంబర్ 2024 

    డిసెంబర్ 4 2024న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ సందర్భంగా భారీగా అభిమానులు చేరడంతో తొక్కిసలాట జరిగింది.

    హీరో అల్లు అర్జున్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులు థియేటర్ ప్రధాన గేటు వద్దకు భారీగా తరలిరావడంతో గేటు కూలిపోయింది.

    పోలీసులు లాఠీఛార్జ్ చేసినప్పటికీ, గందరగోళం తగ్గకపోవడంతో 35 ఏళ్ల మహిళ అక్కడికక్కడే మరణించింది.

    ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

    వివరాలు 

    6.హత్రాస్ సత్సంగ్, 2024 జూలై 

    జూలై 2024లో ఉత్తర్‌ప్రదేశ్ హత్రాస్ జిల్లాలో జరిగిన సత్సంగ్‌లో ఘోరమైన తొక్కిసలాట జరిగింది.

    'భోలే బాబా'గా పేరుపొందిన నారాయణ్ సకార్ హరి సత్సంగ్‌లో 121 మంది ప్రాణాలు కోల్పోయారు.

    నిర్వాహకులు 80,000 మందికి అనుమతి కోరినా, 2.5 లక్షల మందికి పైగా తరలిరావడం వల్ల పరిస్థితి అదుపు తప్పింది.

    తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం ఈ ఘటనకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

    ఈ ఘటనలన్నీ మన దేశంలో సముచిత భద్రతా చర్యల పరిమితిని స్పష్టంగా చాటుతున్నాయి.

    పెద్దపెద్ద వేడుకల సందర్భాల్లో ప్రణాళికలో లోపాలు,జనసందోహాన్ని సకాలంలో నియంత్రించలేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

    ఈ విషాదకరమైన సంఘటనలు ఇకనైనా పాఠంగా మారాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    Stampede in India: గత ఏడాది కాలంలో దేశంలో జరిగిన తొక్కిసలాట ఘటనలు ఇవే.. భారతదేశం
    Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన కర్ణాటక హైకోర్టు  బెంగళూరు
    Indian Students-US Visas: అమెరికా వీసా కోసం సోషల్ మీడియా పోస్టులు,ఖాతాలను తొలగిస్తున్నభారతీయ విద్యార్థులు..!  వీసాలు
    Corona Virus: కరోనా డేంజర్‌ బెల్స్‌..4866కి పెరిగిన యాక్టివ్ కోవిడ్-19 కేసులు.. 5 నెలల చిన్నారి సహా ఏడుగురు మృతి కరోనా కొత్త కేసులు

    భారతదేశం

    Accounts ban: భారత్ ఆదేశాలు నిరాకరించిన ఎక్స్.. @GlobalAffairs ఖాతా నిలిపివేత  భారతదేశం
    Rafale Fighter Jet: భారత్‌లో అత్యంత శక్తివంతమైన రాఫెల్ యుద్ధ విమానం.. ప్రత్యేకతలివే!  టెక్నాలజీ
    Vikram Misri: తప్పుడు ప్రచారాలకు పాకిస్థాన్ ప్రసిద్ధి : భారత్ పాకిస్థాన్
    Pak Drone Attack: ఓ ఇంటిపై కూలిన పాక్ డ్రోన్.. ముగ్గరికి తీవ్ర గాయాలు  రాజస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025