NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mock Drill: రేపు పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో మాక్‌డ్రిల్..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Mock Drill: రేపు పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో మాక్‌డ్రిల్..
    రేపు పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో మాక్‌డ్రిల్..

    Mock Drill: రేపు పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో మాక్‌డ్రిల్..

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 28, 2025
    03:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్‌తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలలో మాక్ డ్రిల్‌లు నిర్వహించేందుకు గురువారం సాయంత్రం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం.

    ఈ మాక్ డ్రిల్లులు ప్రధానంగా గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాలలో జరగనున్నాయి.

    పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ నాలుగు రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం ఈ మాక్ డ్రిల్లులను చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

    దీంతో భారత ప్రభుత్వం లేదా సైన్యం దీని పట్ల ఎలాంటి కీలక చర్యలు తీసుకుంటుందా? అన్న చర్చ మొదలైంది.

    భారత్-పాకిస్తాన్ మధ్య సరిహద్దు దాదాపు 3,300 కిలోమీటర్లకుపైగా వ్యాపించి ఉంది.

    ఇందులో జమ్మూ కశ్మీర్ ప్రాంతాన్ని కలుపుకునే సరిహద్దు"నియంత్రణ రేఖ"గా(LOC) పిలవబడుతుంది.

    ఇక పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకున్న సరిహద్దులను "అంతర్జాతీయ సరిహద్దు" (IB)గా పరిగణిస్తారు.

    వివరాలు 

    ఉగ్రవాద శిబిరాలపై గగన దాడులు

    అంతకుముందు, మే 7న దేశవ్యాప్తంగా 244 జిల్లాలలో మాక్ డ్రిల్‌లు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

    అయితే, మే 6, 7 మధ్య రాత్రి సమయంలో భారత్ పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై గగన దాడులు నిర్వహించింది.

    ఇది "ఆపరేషన్ సిందూర్" అనే కోడ్ పేరుతో చేపట్టబడింది. ఈ దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

    కేంద్రం అందించిన సమాచారం ప్రకారం,ఈ దాడుల్లో ధ్వంసమైన స్థావరాలతో పాటు, పాకిస్థాన్‌లో ఇంకా 12 ఉగ్రవాద స్థావరాలు మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది.

    దీంతో భారత ప్రభుత్వం మరో దాడికి సిద్ధమవుతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

    వివరాలు 

    ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్‌కు గట్టి దెబ్బ

    భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్, పాకిస్థాన్‌ను గట్టిగా దెబ్బతీసింది.

    ఫలితంగా అక్కడ భయాందోళనలు మొదలయ్యాయి. భారత వైమానిక దళాలు మరోసారి అదే తరహాలో దాడులకు పూనుకుంటాయేమో అనే ఆందోళన పాకిస్థాన్‌ను వెంటాడుతోంది.

    ఇప్పటివరకు భారత్, తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను మాత్రమే గగన దాడులతో నాశనం చేసింది.

    కానీ ఇంకా 12 స్థావరాలు మిగిలి ఉండటంతో, వాటిని లక్ష్యంగా చేసుకుని భారత్ మరో దాడికి దిగుతుందా? అన్న భయం పాకిస్థాన్‌లో చెలరేగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్మీ

    తాజా

    Mock Drill: రేపు పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో మాక్‌డ్రిల్.. ఆర్మీ
    Peepal leaf water : గుండె నుంచి జీర్ణం వరకు… రావి ఆకుల కషాయం తాగితే ఎన్ని లాభాలో తెలుసా? జీవనశైలి
    Central Cabinet Decisions: కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్.. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన అశ్విని వైష్ణవ్ కేంద్ర కేబినెట్
    Manipur: కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుకు 44మంది ఎమ్మెల్యేలు సిద్ధం.. రాజ్ భవన్‌లో గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన మ‌ణిపూర్ బీజేపీ నేత మణిపూర్

    ఆర్మీ

    మణిపూర్‌ కల్లోలిత ప్రాంతాల్లో పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ మోహరింపు.. అస్సాం రైఫిల్స్‌ తొలగింపుపై సైన్యం కీలక ప్రకటన  మణిపూర్
    నైజీరియా: బందిపోట్ల ఆకస్మిక దాడిలో 26 మంది సైనికులు మృతి  నైజీరియా
    జాతివివక్ష వల్లే అమెరికా సైనికుడు మా వద్దకు వచ్చాడు: ఉత్తర కొరియా  ఉత్తర కొరియా/ డీపీఆర్‌కే
    లద్దాఖ్: వాహనం లోయలో పడి 9మంది ఆర్మీ సిబ్బంది మృతి  లద్దాఖ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025