NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maoist: మావోయిస్టుల సంచలన ప్రకటన.. శాంతి చర్చలకు సిద్ధం.. కాల్పుల విరమణ పాటిస్తాం
    తదుపరి వార్తా కథనం
    Maoist: మావోయిస్టుల సంచలన ప్రకటన.. శాంతి చర్చలకు సిద్ధం.. కాల్పుల విరమణ పాటిస్తాం
    మావోయిస్టుల సంచలన ప్రకటన.. శాంతి చర్చలకు సిద్ధం.. కాల్పుల విరమణ పాటిస్తాం

    Maoist: మావోయిస్టుల సంచలన ప్రకటన.. శాంతి చర్చలకు సిద్ధం.. కాల్పుల విరమణ పాటిస్తాం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 02, 2025
    01:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర హోం మంత్రిత్వ శాఖ "మావోయిస్ట్‌ రహిత భారత్‌" లక్ష్యంతో ఆపరేషన్‌ కగార్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తోంది.

    ఈ క్రమంలో,గత 100 రోజుల్లో భద్రతా బలగాలు వివిధ ఎన్‌కౌంటర్‌లలో 120 మందికి పైగా మావోయిస్టులను మట్టుబెట్టాయి.

    అదే సమయంలో,పెద్ద సంఖ్యలో మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోతున్నారు.ఈ నేపథ్యంలో, మావోయిస్టులు కేంద్రం,పలు రాష్ట్ర ప్రభుత్వాల ముందు శాంతి చర్చల ప్రతిపాదన ఉంచారు.

    కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకొస్తే, తాము కాల్పుల విరమణకు సిద్ధమని మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ సంచలన ప్రకటన చేసింది.

    వివరాలు 

    వెంటనే కాల్పుల విరమణ పాటిస్తాం

    "ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడంటే అప్పుడే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలి. ఆపరేషన్‌ కగార్‌ను తక్షణమే నిలిపివేయాలి. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న హత్యాకాండను నిలిపేయాలి" అని పేర్కొన్నారు.

    "శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తే, మేము వెంటనే కాల్పుల విరమణ పాటిస్తాం" అని మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరుతో విడుదలైన లేఖలో తెలిపారు.

    దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    కేంద్ర ప్రభుత్వం

    HMPV: భారత్‌లో హెచ్ఎంపీవీ కేసుల పెరుగుదలతో కేంద్రం అలర్ట్.. రాష్ట్రాలకు కీలక సూచనలు భారతదేశం
    Bharatpol: సీబీఐ సహకారంతో 'భారత్‌పోల్‌' పోర్టల్.. అంతర్జాతీయ కేసుల విచారణలో కీలక అడుగు అమిత్ షా
    Jaishankar: డొనాల్డ్ ట్రంప్‌ ప్రమాణస్వీకారానికి జైశంకర్ డొనాల్డ్ ట్రంప్
    India-US: భారత్‌,అమెరికా భద్రతా ప్రయోజనాలను దెబ్బతీసే దురుద్దేశంతో కొన్ని శక్తులు పని చేస్తున్నాయి.. కేంద్రానికి నివేదిక అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025