NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jyoti Malhotra: పాకిస్తాన్‌కి 'జ్యోతి మల్హోత్రా' ప్రయాణాన్ని స్పాన్సర్ చేసింది యూఏఈ కంపెనీ..!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Jyoti Malhotra: పాకిస్తాన్‌కి 'జ్యోతి మల్హోత్రా' ప్రయాణాన్ని స్పాన్సర్ చేసింది యూఏఈ కంపెనీ..!
    పాకిస్తాన్‌కి 'జ్యోతి మల్హోత్రా' ప్రయాణాన్ని స్పాన్సర్ చేసింది యూఏఈ కంపెనీ..!

    Jyoti Malhotra: పాకిస్తాన్‌కి 'జ్యోతి మల్హోత్రా' ప్రయాణాన్ని స్పాన్సర్ చేసింది యూఏఈ కంపెనీ..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 22, 2025
    04:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్‌కు గూఢచర్యం కేసులో అరెస్టైన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

    ఆమె జీవనశైలి ఎంత లగ్జరీగా ఉందో, విదేశీ పర్యటనలకు కావల్సిన ఖర్చులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అనే కోణంలో అధికారులు ప్రస్తుతం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

    తాజాగా ఈ విచారణలో ఓ ఆసక్తికరమైన విషయం బయటపడింది.

    భద్రతవర్గాల సమాచారం ప్రకారం,జ్యోతి మల్హోత్రా చేసిన కొన్ని వీడియోలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఓ ట్రావెల్ సంస్థ 'వెగో' స్పాన్సర్‌గా ఉన్నట్లు సమాచారం.

    ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనం వెల్లడించింది.

    వివరాలు 

    వెగో సంస్థ ప్రత్యక్షంగా పాకిస్థాన్‌కు నిధులు మళ్లించిందన్న ఆధారాలు

    అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) నుంచి గుర్తింపు పొందిన వెగో సంస్థకు సింగపూర్‌, దుబాయ్‌లలో కార్యాలయాలు ఉన్నాయి.

    అంతేకాదు, ఈ కంపెనీకి పాకిస్థాన్‌లో చట్టబద్ధంగా కార్యకలాపాలు నిర్వహించే లైసెన్స్ కూడా ఉందని తెలుస్తోంది.

    ఇంకా వెగో సంస్థ ప్రత్యక్షంగా పాకిస్థాన్‌కు నిధులు మళ్లించిందన్న ఆధారాలు ఏవీ ఇప్పటివరకు లభించలేదు.

    అయినప్పటికీ, జ్యోతికి విదేశీ పర్యటనల సమయంలో ట్రావెల్ ఖర్చుల కోసం స్పాన్సర్‌గా పనిచేసిందనే కారణంతో అధికారులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

    జ్యోతి మల్హోత్రా ట్రావెల్ బ్లాగర్‌గా, యూట్యూబర్‌గా 'ట్రావెల్ విత్ జో' అనే పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ నడుపుతున్న విషయం తెలిసిందే.

    వివరాలు 

    నాలుగు లక్షల మంది సబ్‌స్క్రైబర్లు

    ఆమె ఇండోనేషియా, బ్యాంకాక్ వంటి దేశాల్లో పర్యటించి అక్కడి విశేషాలను వీడియోల రూపంలో ప్రజలకు అందించడంతో పాటు, యూట్యూబ్‌లో ఆమెకు దాదాపు నాలుగు లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

    అయితే ఈ స్థాయిలో సబ్‌స్క్రైబర్లు ఉన్నా ఆమె జీవితం ఎంతో విలాసవంతంగా ఉండడం చూసి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.

    దీంతో ఆమెకు స్పాన్సర్‌షిప్‌ అందించిన సంస్థలు ఎవరన్న దానిపై పోలీసు విభాగాలు విచారణను మరింత ముమ్మరం చేశాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జ్యోతి మల్హోత్రా

    తాజా

    Jyoti Malhotra: పాకిస్తాన్‌కి 'జ్యోతి మల్హోత్రా' ప్రయాణాన్ని స్పాన్సర్ చేసింది యూఏఈ కంపెనీ..! జ్యోతి మల్హోత్రా
    S Jaishankar: పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటన.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌పై జైశంకర్‌ సంచలన ఆరోపణలు సుబ్రమణ్యం జైశంకర్
    Stock Market: కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు! స్టాక్ మార్కెట్
    Vishwambhara : కేన్స్ లో 'విశ్వంభర' బుక్ రిలీజ్.. అందులో ఏముందంటే..? మెగా ఎపిక్ సినిమాకు గ్లోబల్ అటెన్షన్ విశ్వంభర

    జ్యోతి మల్హోత్రా

    Pakistan:పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు   భారతదేశం
    Jyoti Malhotra: పాక్ ISIతో సంబంధాలపై ఆరోపణలు.. యూట్యూబర్ జ్యోతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్ భారతదేశం
    Pakistani spies: భారతదేశంలో పాకిస్తాన్ గూఢచారులు.. జ్యోతి మల్హోత్రా నుండి దేవేందర్ సింగ్ వరకు.. మూడ్రోజుల్లో 12 మంది అరెస్ట్..  భారతదేశం
    Jyoti Malhotra Case: యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా దేశద్రోహం కేసు.. రంగంలోకి యాంటి టెర్రర్ విభాగం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025