Page Loader
Jyoti Malhotra: పాకిస్తాన్‌కి 'జ్యోతి మల్హోత్రా' ప్రయాణాన్ని స్పాన్సర్ చేసింది యూఏఈ కంపెనీ..!
పాకిస్తాన్‌కి 'జ్యోతి మల్హోత్రా' ప్రయాణాన్ని స్పాన్సర్ చేసింది యూఏఈ కంపెనీ..!

Jyoti Malhotra: పాకిస్తాన్‌కి 'జ్యోతి మల్హోత్రా' ప్రయాణాన్ని స్పాన్సర్ చేసింది యూఏఈ కంపెనీ..!

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2025
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌కు గూఢచర్యం కేసులో అరెస్టైన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె జీవనశైలి ఎంత లగ్జరీగా ఉందో, విదేశీ పర్యటనలకు కావల్సిన ఖర్చులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అనే కోణంలో అధికారులు ప్రస్తుతం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఈ విచారణలో ఓ ఆసక్తికరమైన విషయం బయటపడింది. భద్రతవర్గాల సమాచారం ప్రకారం,జ్యోతి మల్హోత్రా చేసిన కొన్ని వీడియోలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఓ ట్రావెల్ సంస్థ 'వెగో' స్పాన్సర్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనం వెల్లడించింది.

వివరాలు 

వెగో సంస్థ ప్రత్యక్షంగా పాకిస్థాన్‌కు నిధులు మళ్లించిందన్న ఆధారాలు

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) నుంచి గుర్తింపు పొందిన వెగో సంస్థకు సింగపూర్‌, దుబాయ్‌లలో కార్యాలయాలు ఉన్నాయి. అంతేకాదు, ఈ కంపెనీకి పాకిస్థాన్‌లో చట్టబద్ధంగా కార్యకలాపాలు నిర్వహించే లైసెన్స్ కూడా ఉందని తెలుస్తోంది. ఇంకా వెగో సంస్థ ప్రత్యక్షంగా పాకిస్థాన్‌కు నిధులు మళ్లించిందన్న ఆధారాలు ఏవీ ఇప్పటివరకు లభించలేదు. అయినప్పటికీ, జ్యోతికి విదేశీ పర్యటనల సమయంలో ట్రావెల్ ఖర్చుల కోసం స్పాన్సర్‌గా పనిచేసిందనే కారణంతో అధికారులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జ్యోతి మల్హోత్రా ట్రావెల్ బ్లాగర్‌గా, యూట్యూబర్‌గా 'ట్రావెల్ విత్ జో' అనే పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ నడుపుతున్న విషయం తెలిసిందే.

వివరాలు 

నాలుగు లక్షల మంది సబ్‌స్క్రైబర్లు

ఆమె ఇండోనేషియా, బ్యాంకాక్ వంటి దేశాల్లో పర్యటించి అక్కడి విశేషాలను వీడియోల రూపంలో ప్రజలకు అందించడంతో పాటు, యూట్యూబ్‌లో ఆమెకు దాదాపు నాలుగు లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అయితే ఈ స్థాయిలో సబ్‌స్క్రైబర్లు ఉన్నా ఆమె జీవితం ఎంతో విలాసవంతంగా ఉండడం చూసి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో ఆమెకు స్పాన్సర్‌షిప్‌ అందించిన సంస్థలు ఎవరన్న దానిపై పోలీసు విభాగాలు విచారణను మరింత ముమ్మరం చేశాయి.