Page Loader
Andhra Pradesh: ఏపీలో నేషనల్ హైవే ఆరు లైన్లుగా.. కేంద్రం ముందుకు ప్రతిపాదనలు
ఏపీలో నేషనల్ హైవే ఆరు లైన్లుగా.. కేంద్రం ముందుకు ప్రతిపాదనలు

Andhra Pradesh: ఏపీలో నేషనల్ హైవే ఆరు లైన్లుగా.. కేంద్రం ముందుకు ప్రతిపాదనలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2025
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో మరో జాతీయ రహదారిని విస్తరించేందుకు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి వెళ్లాయి. నేషనల్ హైవే-16లో భాగంగా నరసన్నపేట నుంచి ఇచ్ఛాపురం వరకు రహదారిని ఆరు వరుసలుగా విస్తరించాలని కోరుతూ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ ప్రతిపాదన చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో కేంద్ర రోడ్లు, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి, పలు కీలక అంశాలపై చర్చించారు. అందులో భాగంగా పలు ప్రాధాన్య ప్రతిపాదనలు ఆయన దాఖలు చేశారు. ముఖ్యంగా, పాతపట్నం సమీపంలోని నీలమణిదుర్గ అమ్మవారి ఆలయానికి దగ్గరలో ఒక వయోడెక్ట్ (వంతెన) నిర్మించాల్సిన అవసరాన్ని వివరించారు.

వివరాలు 

నీలమణిదుర్గ ఆలయం ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక కేంద్రం..

ఈ వయోడెక్ట్ ప్రతిపాదన, నరసన్నపేట నుంచి మోహన వరకు ఉన్న నేషనల్ హైవే 326ఏలో భాగంగా వచ్చిందని ఆయన తెలిపారు. నీలమణిదుర్గ ఆలయం ఓ విశిష్ట ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండటంతో, అక్కడ ఎర్త్‌వాల్ నిర్మిస్తే ఆలయానికి వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోతుందని చెప్పారు. ఇది భక్తులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి రూ. 8 కోట్ల వ్యయంతో 110 మీటర్ల పొడవున్న వయోడెక్ట్ నిర్మించాలని గడ్కరీని కోరారు. దీనివల్ల భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండానే ఆలయానికి వెళ్లగలరని ఆయన వివరించారు. ఈ ప్రతిపాదనలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు.

మీరు
33%
శాతం పూర్తి చేశారు

వివరాలు 

యువత కోసం శిక్షణ టెస్టుల నిర్వహణ 

ఇక మరోవైపు, రాబోయే డీఎస్సీ పరీక్షలు, కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలను లక్ష్యంగా తీసుకుని మాక్ టెస్టులను విజయవంతంగా నిర్వహించినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. 'ఎర్రన్న విద్యా సంకల్పం 2025' కార్యక్రమం కింద ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాలో మొత్తం మూడు డీఎస్సీ మాక్ టెస్టులు, ఒక కానిస్టేబుల్ మెయిన్స్ మాక్ పరీక్షను నిర్వహించామని వెల్లడించారు. ఈ మాక్ పరీక్షలు వాస్తవ పరీక్ష వాతావరణాన్ని కల్పించడం ద్వారా అభ్యర్థుల ప్రిపరేషన్‌ను అంచనా వేసుకునేందుకు సహాయపడతాయని పేర్కొన్నారు. అభ్యర్థులు తాము చేస్తున్న తప్పులను గుర్తించి సరిచేసుకునే అవకాశం ఈ పరీక్షల ద్వారా లభిస్తుందని చెప్పారు.

మీరు
66%
శాతం పూర్తి చేశారు

వివరాలు 

యువతకు శక్తివంతమైన భవిష్యత్తు వైపు అడుగులు

ఇప్పటివరకు 900 మందికిపైగా విద్యార్థులు ఈ మాక్ టెస్టుల ద్వారా లబ్ధి పొందారని వివరించారు. శ్రీకాకుళం జిల్లా యువత ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి ప్రజలకు సేవ చేయగల సామర్థ్యం కలిగిన వారని, ఎర్రన్న విద్యా సంకల్పం 2025 ద్వారా వారికి ప్రతి అడుగులో మార్గదర్శకత్వం, సహకారం అందించేందుకు తమ ప్రయత్నమని అన్నారు. అందరితో కలిసి, యువతకు శక్తివంతమైన భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నాం' అంటూ రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.

మీరు పూర్తి చేశారు