NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pakistan: పాకిస్థాన్‌కు గూఢచర్యం ఆరోపణలు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన యుపి ఎటిఎస్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pakistan: పాకిస్థాన్‌కు గూఢచర్యం ఆరోపణలు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన యుపి ఎటిఎస్ 
    పాకిస్థాన్‌కు గూఢచర్యం ఆరోపణలు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన యుపి ఎటిఎస్

    Pakistan: పాకిస్థాన్‌కు గూఢచర్యం ఆరోపణలు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన యుపి ఎటిఎస్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 23, 2025
    03:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్నారన్న అనుమానంతో ఉత్తర్‌ప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది.

    వీరిలో మొదటిగా ఢిల్లీలో తుక్కు వ్యాపారం చేస్తున్న మొహమ్మద్‌ హరూన్‌ను నోయిడాలో అరెస్ట్ చేశారు.

    అతనికి పాకిస్థాన్‌ దౌత్య కార్యాలయంలో పనిచేసే ముజమ్మిల్‌ హుస్సేన్‌తో సంబంధాలున్నట్లు గుర్తించారు.

    హరూన్‌ విదేశీ వీసాల కోసం డబ్బులు సేకరించడం, సున్నితమైన సమాచారం పంచుకోవడం, తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడం వంటి కార్యకలాపాల్లో పాల్పడ్డారన్న అనుమానాలు ఉన్నాయి.

    వివరాలు 

    హరూన్‌కి పాకిస్థాన్‌లో బంధువులు

    అధికారుల వివరాల ప్రకారం,ముజమ్మిల్‌ హుస్సేన్‌ పాక్‌ దౌత్య సిబ్బందిగా పనిచేస్తుండగా,హరూన్‌తో అతనికి దృఢమైన సంబంధాలు ఉన్నాయి.

    వారిద్దరూ తరచూ బలమైనసంబంధాల్లో ఉన్నారని గుర్తించారు. హరూన్‌కి పాకిస్థాన్‌లో బంధువులుండటం వల్ల ముజమ్మిల్‌ అతనికి పాక్‌ వీసాలు అందించే బాధ్యత తీసుకున్నాడని పేర్కొన్నారు.

    పాక్‌ వీసాలు ఇప్పిస్తానని చెబుతూ హరూన్‌ పలువురు వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి, వాటిని వివిధ బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు గుర్తించారు.

    అందులో కొంత భాగాన్ని అతను తన కమిషన్‌గా తీసుకొని, మిగిలిన మొత్తాన్ని ముజమ్మిల్‌ సూచించిన వారికి ఇచ్చేవాడని ఏటీఎస్‌ తెలిపింది.

    హరూన్‌కి ముజమ్మిల్‌ పాక్‌ అధికారిగా ఉన్నాడన్న విషయం తెలిసినా సహకరించాడని అధికారులు వెల్లడించారు.

    అందువల్ల, అతను రహస్యమైన సమాచారాన్ని పాక్‌కు చేరవేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

    వివరాలు 

    తుఫేల్‌ ని అరెస్ట్ చేసిన ఏటీఎస్‌ బృందం 

    ఇటీవలే భారత ప్రభుత్వం ముజమ్మిల్‌ హుస్సేన్‌ను అనుమానిత వ్యక్తిగా గుర్తించి దేశ బహిష్కరణ చేసింది.

    ఇక మరో కేసులో, ఆదంపూర్‌, వారణాసీ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఏటీఎస్‌ బృందం తుఫేల్‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది.

    అతను దేశ వ్యతిరేక కార్యకలాపాలకు అనుసంధానమైన వాట్సాప్‌ గ్రూప్‌లో సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించారు.

    ఆ గ్రూప్‌ను పాకిస్థాన్‌కు చెందిన సంస్థలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. అంతేకాదు, అతను పాక్‌కు సున్నితమైన సమాచారాన్ని కూడా చేరవేశాడని అధికారులు తెలిపారు.

    వివరాలు 

    యూపీలోని కొన్ని ప్రదేశాల ఫొటోల్ని పాకిస్థాన్‌లోని వ్యక్తులకు పంపిన తుఫేల్‌ 

    తుఫేల్‌ పాక్‌కు చెందిన వ్యక్తులు,సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని గుర్తించారు.

    ప్రత్యేకంగా పాకిస్థాన్‌లో నిషేధించబడిన తెహ్రీక్‌ ఎ లబ్బేక్‌ సంస్థ వ్యవస్థాపకుడు మౌలానా షాద్‌ రిజ్వీ వీడియోలను తరచూ షేర్‌ చేస్తున్నట్లు కూడా గుర్తించారు.

    గజ్వా-ఎ-హింద్‌కు సంబంధించిన కంటెంట్‌ను ప్రోత్సహించడం, భారత్‌లో షరియా చట్టాన్ని అమలు చేయాలన్న విషయాలపై ప్రచారం జరిపినట్లు ఏటీఎస్‌ వెల్లడించింది.

    తుఫేల్‌ వారణాసీలోని రాజ్‌ఘాట్‌,నమోఘాట్‌,జ్ఞానవాపీ మసీదు, వారణాసీ రైల్వేస్టేషన్‌, జామా మసీదు, ఎర్రకోట, నిజాముద్దీన్‌ వంటి ప్రదేశాల ఫొటోల్ని పాకిస్థాన్‌లోని వ్యక్తులకు పంపినట్టు గుర్తించారు.

    వివరాలు 

    పాక్‌లో దాదాపు 600 మందితో సంబంధాలు

    అతనికి పాక్‌లో దాదాపు 600 మందితో సంబంధాలున్నట్లు సమాచారం.

    అంతేకాదు, పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందిన నఫీస్ అనే మహిళతో కూడా తుఫేల్‌ సంభాషిస్తున్నాడని గుర్తించారు.

    ఆమె భర్త పాకిస్థాన్‌ ఆర్మీలో పనిచేస్తున్నాడు.

    ఈ రెండు వేర్వేరు కేసులపై సంబంధిత పోలీస్‌ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, అధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Pakistan: పాకిస్థాన్‌కు గూఢచర్యం ఆరోపణలు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన యుపి ఎటిఎస్  ఉత్తర్‌ప్రదేశ్
    War 2: హృతిక్, ఎన్టీఆర్‌ 'వార్‌ 2'.. దర్శకుడు అయాన్ ముఖర్జీ మొదటి పోస్ట్.. ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తి  జూనియర్ ఎన్టీఆర్
    Supreme Court: పోక్సో కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. దోషిగా తేలిన వ్యక్తికి అరుదైన తీర్పు.. సుప్రీంకోర్టు
    Bcci: ఇంగ్లాండ్ టూర్ కోసం భారత జట్టు.. కెప్టెన్ గా శుభ్‌మాన్ గిల్, వైస్ కెప్టెన్‌గా పంత్?  బీసీసీఐ

    ఉత్తర్‌ప్రదేశ్

    Milkipur Bypoll: మిల్కిపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం  భారతదేశం
    Nepal: నేపాల్‌లో 23 మంది భారతీయులు అరెస్టు.. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ రాకెట్‌ను నడుపుతున్నారని ఆరోపణలు నేపాల్
    Road Accident: కుంభమేళా నుంచి తిరుగొస్తుండగా ఘోర ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు దుర్మరణం రోడ్డు ప్రమాదం
    Maha Kumbh : మాఘ పౌర్ణమి పుణ్యస్నానం.. భక్తుల రద్దీతో 'నో వెహికల్‌ జోన్‌' భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025