NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి? 
    తదుపరి వార్తా కథనం
    Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి? 
    యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి?

    Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి? 

    వ్రాసిన వారు Stalin
    Apr 16, 2023
    10:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్‌, అతని సోదరుడు అష్రఫ్ హత్యకు గురయ్యారు.

    ఈ అన్నదమ్ముల హత్య నేపథ్యంలో యూపీలో హై టెన్షన్ వాతావరణ నెలకొంది. రాష్ట్రమంతటా 144సెక్షన్ విధించారు. కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అతిక్ అహ్మద్ ఎవరు? ఆయన అరెస్టు, మరణం ఎందుకు సంచలనయ్యాయి?

    అతిక్ అహ్మద్‌, అతని సోదరుడు అష్రఫ్ పోలీసుల కస్డడీలో ఉండగా హత్యకు గురికావడంతో ఈ వార్తకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.

    వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లగా శనివారం రాత్రి ముగ్గురు జర్నిలిస్టులుగా వచ్చిన అన్నదమ్ములను కాల్చేశారు. దీంతో ఇది సంచలనంగా మారింది.

    కుమారుడు అసద్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన రెండు రోజులకే అతిక్ కాల్చివేయబడటం గమనార్హం.

    యూపీ

    యూపీలోనే మొదటి గ్యాంగ్‌స్టర్ 

    ఉత్తరప్రదేశ్‌లో 'గ్యాంగ్‌స్టర్ చట్టం' కింద కేసు నమోదు చేయబడిన మొదటి వ్యక్తి అతిక్ అహ్మద్.

    1979లో అతిక్ అహ్మద్ మొదటిసారి హత్యా ఆరోపణలతో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు చెబుతారు.

    ప్రస్తుతం అతనిపై 100కు పైగా కేసులు ఉన్నట్లు శనివారం యూపీ పోలీసులు చెప్పారు. ప్రధానంగా 2005లో బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్‌, అతని సోదరుడు అష్రఫ్ ప్రధాన నిందితులుగా ఉన్నారు.

    అలాగే ఫిబ్రవరిలో జరిగిన రాజ్ పాల్ హత్య కేసులో కీలక సాక్షి ఉమేష్ పాల్ మర్డర్ కేసులోనూ ఈ ఇద్దరు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో అరెస్టు అయి పోలీసుల కస్టడీలో ఉన్న క్రమంలోనే ఇద్దరు చనిపోయారు.

    యూపీ

    అతిక్ అహ్మద్ రాజకీయ జీవితం 

    అప్పటి వరకు మాఫియా డాన్‌గా ఉన్న అతిక్ అహ్మద్‌ 1989లో రాజకీయాల్లోకి ప్రవేశించారు.

    1989లో స్వతంత్ర అభ్యర్థిగా అలహాబాద్ వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెచిచారు.

    1999-2003 సంవత్సరాల మధ్య అతను సోనే లాల్ పటేల్ స్థాపించిన అప్నా దళ్ అధ్యక్షుడిగా ఉన్నారు.

    తరువాత రెండు శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

    ఆ తర్వాత అహ్మద్ సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. 1996లో వరుసగా నాలుగోసారి ఎస్పీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.

    మూడేళ్ల తర్వాత అప్నా దళ్ నుండి 2002లో మళ్లీ తన స్థానాన్ని గెలుచుకున్నారు.

    2004-2009 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ఫుల్‌పూర్ నుంతి 14వ లోక్‌సభకు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా అతిక్ ఎన్నికయ్యారు.

    యూపీ

    అప్పటి నుంచే అతిక్ పతనం మొదలు

    2004 సాధారణ ఎన్నికల్లో ఎంపీగా అతిక్ విజయం సాధించాక, తను ఇంతకు ముందు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన అలహాబాద్ వెస్ట్ స్థానం ఖాళీ అయ్యింది.

    దీంతో ఆ స్థానంలో అతిక్ తన సోదరుడు అష్రఫ్‌ను బరిలో నిలిపారు.

    అయితే ఈ ఎన్నికల్లో రాజ్‌పాల్ బీఎస్పీ తరఫున విజయం సాధించారు.

    ఇది జీర్ణించుకోలేని అతిక్ జనవరి 25, 2005న రాజ్ పాల్‌ను హత్య చేసినట్లు అతని భార్య ఆరోపించింది.

    దీంతో పోలీసులు ఈ కేసులో మొత్తం ఏడుగురిపై అభియోగాలు మోపారు. ఈ హత్య తర్వాత నుంచి అతిక్ తన ప్రాభవం కోల్పోతూ వచ్చాడు.

    ఈ కేసులో విపరీతమైన రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో అతిక్ అహ్మద్ 2008లో పోలీసులకు లొంగిపోయి 2012లో విడుదలయ్యాడు.

    యూపీ

    సమాజ్‌వాదీ పార్టీ బహిష్కరించిన తర్వాత అగమ్యగోచరం

    రాజ్ పాల్‌ హత్య నేపథ్యంలో 2008లో అతిక్‌ను సమాజ్‌వాదీ పార్టీ బహిష్కరించింది.

    యూపీలో అతనికి ఏ పార్టీ సభ్యత్వం ఇవ్వలేదు. ఎన్నో రాజకీయ విమర్శల మధ్య 2014లో శ్రావస్తి నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అతిక్‌కు ఎస్పీ టికెట్ ఇచ్చింది.

    అయితే ఆ ఎన్నికల్లో బీజేపీకి చెందిన దద్దన్ మిశ్రా చేతిలో దాదాపు లక్ష ఓట్ల తేడాతో అతిక్ ఓడిపోయాడు. ఆ తర్వాత అతిక్ నేరల వల్ల అతనిని అఖిలేష్ దూరం పెట్టారు.

    2019లో ఓ దాడి కేసులో అరెస్టు అయిన అతిక్, ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి మోదీపై పోటీ చేసి కేవలం 855 ఓట్లు మాత్రమే పొందగలిగారు.

    యూపీ

    రాజ్ పాల్ హత్యలో ఆరుగురు నిందితులు మృతి

    ఈ ఏడాది ఫిబ్రవరి 24న, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో రాజ్ పాల్ హత్యలో ప్రధాన సాక్షి అయిన ఉమేష్ పాల్, అతని పోలీసు గార్డు కాల్చి చంపబడ్డారు.

    దీంతో ఈ కేసులో అతిక్ అహ్మద్, అతని భార్య సహిస్తా పర్వీన్, ఇద్దరు కుమారులు, అతని తమ్ముడు ఖలీద్ అజీమ్ అలియాస్ అష్రఫ్, ఇతరులపై ఫిబ్రవరి 25 న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

    ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్, అష్రఫ్‌తో కలిపి మొత్తం ఆరుగురి చనిపోయారు. అందులో కొందరిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    యూపీలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు

    #WATCH| Prayagraj, UP: DM and Police Commissioner's convoy patrolling the area where Atiq Ahmed and his brother Ashraf were shot dead yesterday pic.twitter.com/l4mtCBuWxM

    — ANI (@ANI) April 16, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అతిక్ అహ్మద్, అష్రఫ్‌ను కాల్చి చంపింది ఇక్కడే!

    Prayagraj, UP: Early morning visuals from the spot where Atiq Ahmed and his brother were shot dead yesterday pic.twitter.com/nbHAdumZZK

    — ANI (@ANI) April 16, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    ముఖ్యమంత్రి
    యోగి ఆదిత్యనాథ్
    తాజా వార్తలు

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    ఉత్తర్‌ప్రదేశ్

    కృష్ణ జన్మభూమి వివాదం.. షాహీ ఈద్గా మసీదు వివాదాస్పదంలో సర్వేకు కోర్టు ఆదేశం భారతదేశం
    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్
    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు దిల్లీ
    ఎంవీ గంగా విలాస్: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ నరేంద్ర మోదీ

    ముఖ్యమంత్రి

    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్! వై.ఎస్.జగన్
    కమ్యూనిస్టులు హత్యలు చేశారు, వారిని తిరిగి అధికారంలోకి రానివ్వం: త్రిపుర సీఎం మానిక్ సాహా
    ఆంధ్రప్రదేశ్: పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్

    యోగి ఆదిత్యనాథ్

    యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్ అఖిలేష్ యాదవ్
    ఉమేష్ పాల్ హత్య: పోలీసుల అదుపులో అతిక్ అహ్మద్ సన్నిహితుడు బల్లి పండిట్ ఉత్తర్‌ప్రదేశ్

    తాజా వార్తలు

    దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    అదనపు మానవతా సాయం కోరుతూ మోదీకి లేఖ రాసిన జెలెన్‌స్కీ  ఉక్రెయిన్
    తెలంగాణలో పెరిగిన ఎండలు; రాబోయే ఐదు రోజులు పెరగనున్న ఉష్ణోగ్రతలు  తెలంగాణ
    సెల్ఫీ ఛాలెంజ్‌పై కౌంటర్; సుపరిపాలనపై చంద్రబాబుకు సవాల్ విసిరిన ఏపీ సీఎం జగన్  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025