NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యాన్నికి కారణాలివేనా?
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యాన్నికి కారణాలివేనా?
    1/5
    భారతదేశం 1 నిమి చదవండి

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యాన్నికి కారణాలివేనా?

    వ్రాసిన వారు Naveen Stalin
    May 13, 2023
    05:47 pm
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యాన్నికి కారణాలివేనా?
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యాన్నికి కారణాలివేనా?

    కర్ణాటకలో 1985 నుంచి అధికారంలో ఉన్న పార్టీ తిరిగి పవర్ లోకి వచ్చిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించాలని బీజేపీ భావించింది. ఇందుకోసం ఎంతో శ్రమించింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఫోకస్ అంతా కర్ణాటక మీద పెట్టినా ఫలితం దక్కలేదు. చివరగా ఎగ్జిట్ పోల్స్ ఊహించిన దాని కంటే ఘోర పరాభవాన్ని బీజేపీ మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇందుకు కారణాలను ఒకసారి విశ్లేషిద్దాం.

    2/5

    లింగాయత్ ఫ్యాక్టర్

    లింగాయత్ కమ్యూనిటీ కర్ణాటకలో ఒక ప్రముఖ హిందూ మతం. వీరు రాష్ట్ర జనాభాలో 17% పైగా ఉన్నారు. ఈ సంఘం కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తారు. లింగాయత్‌లు రాష్ట్రంలో బీజేపీకి అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉన్నారు. అయితే లింగాయత్ వర్గానికి చెందిన బీఎస్ యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాలని ఒత్తిడి చేయడం, మాజీ సీఎం జగదీష్ షెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాదిలకు టిక్కెట్లు నిరాకరించడంతో లింగాయత్‌ కమ్యూనిటీలో బీజేపీ పట్ల వ్యతిరకేత వ్యక్తమైనట్లు తెలుస్తోంది. 1980నుంచి యడియూరప్ప లింగాయత్ వర్గంతో మమేకమై ఉన్నారు. అందుకే బీజేపీ ఆయన్ను దూరం పెట్టడం ఆ కమ్యూనిటికి నచ్చలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    3/5

    బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరికలు

    ఎన్నికలకు ముందు లింగాయత్ నుంచి బీజేపీకి మరో సవాలు ఎదురైంది. మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడి, మాజీ సీఎం, ఆరుసార్లు హుబ్బళ్లి-ధార్వాడ్ సెంట్రల్ ఎమ్మెల్యేగా గెలిచిన జగదీశ్ శెట్టర్, వీరిద్దరూ బీజేపీకి చెందిన ప్రముఖ లింగాయత్ నేతలు. ఈ ఇద్దరు కీలక లింగాయత్ నేతలకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో వారు కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమంలో బీజేపీ తమను అవమానించిందని వారు బహిరంగంగానే ప్రకటన చేయడం కాషాయ పార్టీకి మైనస్‌గా మారింది. ఇది బీజేపీకి వచ్చే లింగాయత్ ఓటు బ్యాంకుపై తీవ్రమైన ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

    4/5

    నందిని-అమూల్ వివాదం

    కర్ణాటక ఎన్నికల ప్రచారంలో జాతీయ సమస్యలను లేవనెత్తడం మానుకున్న కాంగ్రెస్, ఎన్నికలకు ముందు నందిని-అమూల్ వివాదానికి ఆజ్యం పోసింది. దీన్ని ఒక రాజకీయ ఎత్తుగడగా మల్చుకుంది. స్థానిక పాల సహకార సంస్థ అయిన నందినికి రాష్ట్రంలోని పాడి రైతులకు అవినాభావ సంబంధం ఉంది. ఇదే సమయంలో తెలివిగా గుజరాత్‌కు చెందిన అమూల్ పాల అంశాన్ని తెరపైకి తెచ్చి స్థానికంగా మద్దతును పొందడంలో విజయవంతమైంది. స్థానిక సమస్యలేవీ లేవనెత్తలేకపోయిన బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చరిష్మాపైనే ఎక్కువగా ఆధారపడింది. అయితే కాంగ్రెస్ మాత్రం స్థానిక నాయకులను ముందు పెట్టి ప్రచారం చేయడంతో పాటు లోకల్ సమస్యలపై దృష్టి సారించి, సత్తా చాటుకుంది.

    5/5

    సున్నితమైన అంశాలతో చిక్కుల్లో పడ్డ బీజేపీ

    గత కొంతకాలంగా బీజేపీ కర్ణాటకలో చాలా సున్నితమైన అంశాలను లెవనెత్తుతోంది. అంతేకాకుండా వాటిని ఎన్నికల ప్రచారంలో కూడా ప్రస్తావించింది. తరగతి గదుల్లో హిజాబ్ నిషేధం, హలాల్ మాంసాహారం, లౌడ్ స్పీకర్లలో ఆజాన్ వంటి అంశాలు గత ఏడాది నుంచి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీనికి తోడు బీజేపీ ప్రభుత్వం మత మార్పిడి, గోహత్య వ్యతిరేక బిల్లులను ఆమోదించింది. యూనిఫాం సివిల్ కోడ్, ఎన్‌ఆర్‌సీ అమలు చేస్తామని బీజేపీ తమ మేనిఫెస్టోలో చెప్పింది. హిందూ ఓట్లను ఏకీకృతం చేయాలనే ఆశతో ముస్లింలకు 4% కోటాను కూడా రద్దు చేస్తామని చెప్పింది. ఇలాంటి చాలా సున్నితమైన అంశాలు బీజేపీకి కొన్ని వర్గాల ఓటు బ్యాంకు దూరమైనట్లు స్పష్టమవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    బీజేపీ
    కర్ణాటక
    అసెంబ్లీ ఎన్నికలు
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    బీజేపీ

    అధికార పార్టీకి మరోసారి షాకిచ్చిన కర్ణాటక ఓటర్లు; 38ఏళ్లుగా ఇదే సంప్రదాయం  కర్ణాటక
    మిగతా రాష్ట్రాల్లోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతం: రాహుల్ గాంధీ  రాహుల్ ద్రావిడ్
    తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలైపై స్టాలిన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు  తమిళనాడు
    సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం; ఈసీకి ఫిర్యాదు  కర్ణాటక

    కర్ణాటక

    కర్ణాటకలో బీజేపీ ఓటమిని అంగీకరించిన సీఎం బసవరాజ్ బొమ్మై  బసవరాజ్ బొమ్మై
    కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై డీకే శివకుమార్ భావోద్వేగం కాంగ్రెస్
    కాంగ్రెస్: సిద్ధరామయ్య vs డీకే శివకుమార్‌; కర్ణాటక సీఎం ఎవరు?  కాంగ్రెస్
    కర్ణాటక ఎన్నికల్లో ఆధిక్యంపై ​​కాంగ్రెస్ 'అన్‌స్టాపబుల్' ట్వీట్  కాంగ్రెస్

    అసెంబ్లీ ఎన్నికలు

    కర్ణాటక ఎన్నికల ఫలితాలు: ఎమ్మెల్యేందరూ బెంగళూరు చేరుకోవాలని కాంగెస్ పిలుపు కర్ణాటక
    నేడే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు; 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు  కర్ణాటక
    'టీడీపీ నాయకులను సీఎం చేయడానికి నేను లేను'; పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్  పవన్ కళ్యాణ్
    కర్ణాటకలో మళ్లీ హంగ్; సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్; ఎగ్జిట్ పోల్స్ అంచనా కర్ణాటక

    తాజా వార్తలు

    ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతం: 18నెలల్లో ఇదే అత్యల్పం  భారతదేశం
    గుజరాత్‌లో రూ.4400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
     వైఎస్ వివేకా రాసిన లేఖపై వేలి ముద్రలు ఎవరివో తేల్చే పనిలో సీబీఐ  ఆంధ్రప్రదేశ్
    సీబీఎస్ఈ 10వ ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి భారత జట్టు

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    డిఫరెంట్ ఫ్లేవర్లతో గోల్డెన్ ఐస్ క్రీమ్; ఎక్కడో తెలుసా?  సూరత్
    అధిక పెన్షన్: బకాయిలను మళ్లించడానికి 3నెలల కాలపరిమితిని విధించిన ఈపీఎఫ్ఓ  పెన్షన్
    పౌష్టికాహార పంటల ఉత్పత్తిపై ఇక్రిసాట్‌ స్పెషల్ ఫోకస్ హైదరాబాద్
    దేశంలో కొత్తగా 1,580 మందికి కరోనా; 17 మంది మృతి కరోనా కొత్త కేసులు
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023