NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యాన్నికి కారణాలివేనా?
    తదుపరి వార్తా కథనం
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యాన్నికి కారణాలివేనా?
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యాన్నికి కారణాలివేనా?

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యాన్నికి కారణాలివేనా?

    వ్రాసిన వారు Stalin
    May 13, 2023
    05:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటకలో 1985 నుంచి అధికారంలో ఉన్న పార్టీ తిరిగి పవర్ లోకి వచ్చిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించాలని బీజేపీ భావించింది.

    ఇందుకోసం ఎంతో శ్రమించింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఫోకస్ అంతా కర్ణాటక మీద పెట్టినా ఫలితం దక్కలేదు.

    చివరగా ఎగ్జిట్ పోల్స్ ఊహించిన దాని కంటే ఘోర పరాభవాన్ని బీజేపీ మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇందుకు కారణాలను ఒకసారి విశ్లేషిద్దాం.

    బీజేపీ

    లింగాయత్ ఫ్యాక్టర్

    లింగాయత్ కమ్యూనిటీ కర్ణాటకలో ఒక ప్రముఖ హిందూ మతం. వీరు రాష్ట్ర జనాభాలో 17% పైగా ఉన్నారు. ఈ సంఘం కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు.

    ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తారు. లింగాయత్‌లు రాష్ట్రంలో బీజేపీకి అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉన్నారు.

    అయితే లింగాయత్ వర్గానికి చెందిన బీఎస్ యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాలని ఒత్తిడి చేయడం, మాజీ సీఎం జగదీష్ షెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాదిలకు టిక్కెట్లు నిరాకరించడంతో లింగాయత్‌ కమ్యూనిటీలో బీజేపీ పట్ల వ్యతిరకేత వ్యక్తమైనట్లు తెలుస్తోంది.

    1980నుంచి యడియూరప్ప లింగాయత్ వర్గంతో మమేకమై ఉన్నారు. అందుకే బీజేపీ ఆయన్ను దూరం పెట్టడం ఆ కమ్యూనిటికి నచ్చలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    బీజేపీ

    బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరికలు

    ఎన్నికలకు ముందు లింగాయత్ నుంచి బీజేపీకి మరో సవాలు ఎదురైంది.

    మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడి, మాజీ సీఎం, ఆరుసార్లు హుబ్బళ్లి-ధార్వాడ్ సెంట్రల్ ఎమ్మెల్యేగా గెలిచిన జగదీశ్ శెట్టర్, వీరిద్దరూ బీజేపీకి చెందిన ప్రముఖ లింగాయత్ నేతలు. ఈ ఇద్దరు కీలక లింగాయత్ నేతలకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో వారు కాంగ్రెస్‌లో చేరారు.

    ఈ క్రమంలో బీజేపీ తమను అవమానించిందని వారు బహిరంగంగానే ప్రకటన చేయడం కాషాయ పార్టీకి మైనస్‌గా మారింది. ఇది బీజేపీకి వచ్చే లింగాయత్ ఓటు బ్యాంకుపై తీవ్రమైన ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

    బీజేపీ

    నందిని-అమూల్ వివాదం

    కర్ణాటక ఎన్నికల ప్రచారంలో జాతీయ సమస్యలను లేవనెత్తడం మానుకున్న కాంగ్రెస్, ఎన్నికలకు ముందు నందిని-అమూల్ వివాదానికి ఆజ్యం పోసింది. దీన్ని ఒక రాజకీయ ఎత్తుగడగా మల్చుకుంది.

    స్థానిక పాల సహకార సంస్థ అయిన నందినికి రాష్ట్రంలోని పాడి రైతులకు అవినాభావ సంబంధం ఉంది. ఇదే సమయంలో తెలివిగా గుజరాత్‌కు చెందిన అమూల్ పాల అంశాన్ని తెరపైకి తెచ్చి స్థానికంగా మద్దతును పొందడంలో విజయవంతమైంది.

    స్థానిక సమస్యలేవీ లేవనెత్తలేకపోయిన బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చరిష్మాపైనే ఎక్కువగా ఆధారపడింది.

    అయితే కాంగ్రెస్ మాత్రం స్థానిక నాయకులను ముందు పెట్టి ప్రచారం చేయడంతో పాటు లోకల్ సమస్యలపై దృష్టి సారించి, సత్తా చాటుకుంది.

    బీజేపీ

    సున్నితమైన అంశాలతో చిక్కుల్లో పడ్డ బీజేపీ

    గత కొంతకాలంగా బీజేపీ కర్ణాటకలో చాలా సున్నితమైన అంశాలను లెవనెత్తుతోంది. అంతేకాకుండా వాటిని ఎన్నికల ప్రచారంలో కూడా ప్రస్తావించింది.

    తరగతి గదుల్లో హిజాబ్ నిషేధం, హలాల్ మాంసాహారం, లౌడ్ స్పీకర్లలో ఆజాన్ వంటి అంశాలు గత ఏడాది నుంచి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

    దీనికి తోడు బీజేపీ ప్రభుత్వం మత మార్పిడి, గోహత్య వ్యతిరేక బిల్లులను ఆమోదించింది.

    యూనిఫాం సివిల్ కోడ్, ఎన్‌ఆర్‌సీ అమలు చేస్తామని బీజేపీ తమ మేనిఫెస్టోలో చెప్పింది.

    హిందూ ఓట్లను ఏకీకృతం చేయాలనే ఆశతో ముస్లింలకు 4% కోటాను కూడా రద్దు చేస్తామని చెప్పింది.

    ఇలాంటి చాలా సున్నితమైన అంశాలు బీజేపీకి కొన్ని వర్గాల ఓటు బ్యాంకు దూరమైనట్లు స్పష్టమవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    కర్ణాటక
    అసెంబ్లీ ఎన్నికలు
    తాజా వార్తలు

    తాజా

    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్
    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్

    బీజేపీ

    నెహ్రూ కుటుంబాన్ని అవమానించారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ కాంగ్రెస్
    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు ఎందుకంత కీలకం! కర్ణాటక
    రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖచిత్రంగా ఉంటే మోదీకే లాభం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ
    ప్రపంచంలోనే బీజేపీ అత్యంత ముఖ్యమైన పార్టీ: వాల్ స్ట్రీట్ జర్నల్ ది వాల్ స్ట్రీట్ జర్నల్

    కర్ణాటక

    రిజర్వేషన్ల కోసం ఆందోళన; యడ్యూరప్ప ఇల్లు, కార్యాలయంపై రాళ్ల దాడి బీజేపీ
    అద్దెకు ఉండే బ్యాచిలర్ల కోసం బెంగళూరు సొసైటీ కొత్తగా ప్రవేశ పెట్టిన నియమాలు బెంగళూరు
    నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల అసెంబ్లీ ఎన్నికలు
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ; మే 10న పోలింగ్, 13న కౌంటింగ్ ఎన్నికల సంఘం

    అసెంబ్లీ ఎన్నికలు

    Karnataka Assembly Elections: 124మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ కాంగ్రెస్
    'సబ్ కా ప్రయాస్'తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతోంది: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    బీజేపీకి ముందు దేశంలో 'డర్టీ పాలిటిక్స్‌', మేం వచ్చాక రాజకీయ దృక్కోణాన్ని మార్చేశాం: ప్రధాని మోదీ కర్ణాటక
    Karnataka: 100శాతం నేనే కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని; డీకేతో ఇబ్బంది లేదు: సిద్ధరామయ్య కామెంట్స్ కర్ణాటక

    తాజా వార్తలు

    ఇంటర్‌లో ఆన్‌లైన్ ప్రవేశాలు; ఎప్పటి నుంచో తెలుసా? తెలంగాణ
    అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం; ఎలక్షన్ గుర్తు కోసం పార్టీలకు ఈసీ ఆహ్వానం  ఎన్నికల సంఘం
    కర్ణాటకలో మళ్లీ హంగ్; సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్; ఎగ్జిట్ పోల్స్ అంచనా కర్ణాటక
    National Technology Day 2023: జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?  టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025