Page Loader
Shubhanshu Shukla: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా 
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా

Shubhanshu Shukla: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2025
07:34 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది.

జూన్ 22న ఈ అంతరిక్ష ప్రయాణం జరగనున్నట్టు ఇస్రో ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే తాజా సమాచారం ప్రకారం,ఈ యాక్సియం-4 మిషన్‌ను వాయిదా వేస్తున్నట్టు నాసా ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

ప్రయోగానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే వెల్లడించనున్నట్టు నాసా స్పష్టం చేసింది.

యాక్సియం-4 మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా ఇతర ముగ్గురు అంతరిక్షయాత్రికులతో కలిసి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.

ఈ ప్రయాణాన్ని అమెరికాకు చెందిన ప్రైవేట్ స్పేస్ సంస్థ అయిన యాక్సియం స్పేస్ నిర్వహిస్తోంది.

ఈ మిషన్‌లో భారత్‌కు చెందిన ఇస్రోతో పాటు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా,ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్‌ఏ కూడా భాగస్వాములుగా ఉన్నాయి.

వివరాలు 

మిషన్ పైలట్‌గా బాధ్యతలు చేపడుతున్న శుభాంశు శుక్లా

ఈ మిషన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన స్పేస్ క్యాప్సూల్‌ను స్పేస్‌-X సంస్థ రూపొందించిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు.

ఈ మిషన్‌లో శుభాంశు శుక్లా మిషన్ పైలట్‌గా బాధ్యతలు చేపడుతున్నారు.

ఈ ప్రయోగాన్ని మొదట మే 29న జరగాల్సిఉంది. అయితే వాతావరణ ప్రతికూలతలు,సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ఈ ప్రయోగం అనేకసార్లు వాయిదా పడింది.

ప్రయాణం ప్రారంభమైన తర్వాత సుమారు 28గంటల తర్వాత అంతరిక్ష నౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)తో అనుసంధానమవుతుంది.

శుభాంశు బృందం అక్కడ మొత్తం 14రోజుల పాటు గడిపి,గురుత్వాకర్షణ లేని పరిస్థితుల్లో పలు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు.

అంతే కాకుండా,ఈ సమయంలో వారు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పాఠశాల విద్యార్థులు, ఇతరులతో కూడ ముచ్చటించనున్నారు.