NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / BCCI: 'ఆపరేషన్ సిందూర్' విజయానికి గుర్తుగా బీసీసీఐ కీలక నిర్ణయం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    BCCI: 'ఆపరేషన్ సిందూర్' విజయానికి గుర్తుగా బీసీసీఐ కీలక నిర్ణయం
    'ఆపరేషన్ సిందూర్' విజయానికి గుర్తుగా బీసీసీఐ కీలక నిర్ణయం

    BCCI: 'ఆపరేషన్ సిందూర్' విజయానికి గుర్తుగా బీసీసీఐ కీలక నిర్ణయం

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 27, 2025
    04:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత సాయుధ బలగాలకు ఘన నివాళిగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ముగింపు వేడుకలను అంకితం చేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది.

    ఇటీవల జరిగిన 'ఆపరేషన్ సిందూర్'లో మన సైనికులు ప్రదర్శించిన అపూర్వ వీరత్వానికి గౌరవ సూచకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.

    ఈ ముగింపు ఉత్సవం జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.

    సుమారు 45 నిమిషాల పాటు సాగనున్న ఈ వేడుక పూర్తిగా సైనికుల సేవలను స్మరించుకోవడానికే నిర్వహించనున్నారు.

    వివరాలు 

    దేశ భద్రత, సమగ్రతకు ప్రాముఖ్యత

    ఈ సందర్భంగా బీసీసీఐ ప్రతినిధి సైకియా మీడియాతో మాట్లాడుతూ, ''ఆపరేషన్ సిందూర్‌లో మన సాయుధ బలగాలు చూపిన ధైర్యం, త్యాగానికి మనం శిరసవంచి నమస్కరిస్తున్నాం. వారి బలిదానాలు దేశాన్ని రక్షిస్తూ, మాకు స్ఫూర్తిని అందిస్తున్నాయి. వారికి గౌరవం తెలపడానికి, ఈ సీజన్ ముగింపు వేడుకను ప్రత్యేకంగా వారికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాం. క్రికెట్ మన దేశంలో ఒక మక్కువ కావచ్చు, కానీ దేశ భద్రత, సమగ్రతకు ముందే ప్రాముఖ్యత. మన సైనికుల పట్ల గర్వంగా ఉంది. వారి సేవలకు మనం రుణపడి ఉన్నాం'' అని పేర్కొన్నారు.

    వివరాలు 

    దేశభక్తి గీతాల ప్రదర్శనతో పాటు, మిలిటరీ బ్యాండ్ ప్రదర్శన

    ఈ గ్రాండ్ ఫినాలే వేడుకకు సైనిక విభాగాల్లో ఉన్న సీనియర్ అధికారులను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు సైకియా తెలిపారు.

    అంతేకాక, మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలోని కొన్ని స్టాండ్లను ప్రత్యేకంగా సైనిక సిబ్బందికి కేటాయించనున్నట్లు వెల్లడించారు.

    ఈ వేడుకలో దేశభక్తి గీతాల ప్రదర్శనతో పాటు, మిలిటరీ బ్యాండ్ ప్రదర్శన కూడా ఉండే అవకాశముందని పేర్కొన్నారు.

    ఇది మన దేశ వీరుల కోసం ఒక గౌరవవంతమైన నివాళిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

    అంతేకాక, ఫినాలే మ్యాచ్‌కు ముందు ప్రముఖ గాయకుల సంగీత విభావరి కార్యక్రమాన్ని కూడా నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమవుతోంది.

    వివరాలు 

    భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు

    జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన తరువాత, మే 7న భారత ప్రభుత్వం 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

    ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ బలగాలు లక్ష్యంగా దాడులు నిర్వహించాయి.

    ఈ దాడుల ప్రభావంతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి.

    ఈ పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌ను బీసీసీఐ తాత్కాలికంగా ఒక వారం పాటు నిలిపివేసింది.

    ఆ తరువాత, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో మే 17న టోర్నీకి మళ్లీ శ్రీకారం చుట్టారు.

    వివరాలు 

    సాయుధ బలగాల సంక్షేమానికి రూ.20 కోట్లు విరాళం

    టోర్నమెంట్ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా బీసీసీఐ భారత సాయుధ బలగాల సేవలను గుర్తించి గౌరవించింది.

    పలు వేదికలలో మ్యాచ్‌లు ప్రారంభించే ముందు జాతీయ గీతాన్ని ఆటగాళ్లు ఆలపించారు.

    స్టేడియాల్లో ఉన్న జెయింట్ స్క్రీన్లపై 'సాయుధ బలగాలకు ధన్యవాదాలు' అనే సందేశాలను ప్రసారం చేశారు.

    గతంలో, 2019లో పుల్వామా ఉగ్రదాడి జరిగిన తరువాత కూడా బీసీసీఐ ఇదే తరహాలో స్పందించింది.

    అప్పట్లో ఐపీఎల్ ప్రారంభోత్సవానికి మిలిటరీ బ్యాండ్‌ను ఆహ్వానించడంతో పాటు, సాయుధ బలగాల సంక్షేమానికి రూ.20 కోట్లు విరాళంగా ప్రకటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీసీసీఐ

    తాజా

    Sukhdev Singh Dindsa: కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌దేవ్‌ సింగ్‌ దిండ్సా కన్నుమూత కేంద్రమంత్రి
    Lucknow Super Giants: ఐపీఎల్ చరిత్రలో లక్నో జట్టు చెత్త రికార్డు లక్నో సూపర్‌జెయింట్స్
    Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన చంద్రబాబు  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    Jyoti Malhotra: హర్యానా జైల్లో జ్యోతి మల్హోత్రాను కలిసిన తండ్రి హరీష్ జ్యోతి మల్హోత్రా

    బీసీసీఐ

    Virat Kohli: దిల్లీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ.. శుభవార్తను అందించిన బీసీసీఐ విరాట్ కోహ్లీ
    Team India New Jersey: భారత జట్టు జెర్సీలో పలు మార్పులు.. కొత్త జెర్సీ విడుదల చేసిన బీసీసీఐ  టీమిండియా
    Jasprit Bumrah: హార్దిక్ పాండ్యా తరహాలోనే బుమ్రా.. చివరి నిమిషం వరకు వెయిట్ చేస్తోన్న బీసీసీఐ జస్పిత్ బుమ్రా
    Jasprit Bumrah: బీసీసీఐ తుది నిర్ణయం నేడే.. ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడతాడా? జస్పిత్ బుమ్రా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025