NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Champions Trophy 2025: లాహోర్‌ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు..షెడ్యూల్‌ ఇదే..!
    తదుపరి వార్తా కథనం
    Champions Trophy 2025: లాహోర్‌ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు..షెడ్యూల్‌ ఇదే..!
    లాహోర్‌ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు..షెడ్యూల్‌ ఇదే..!

    Champions Trophy 2025: లాహోర్‌ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు..షెడ్యూల్‌ ఇదే..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 30, 2025
    04:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐసీసీ మెగా టోర్నీ అయిన ఛాంపియన్స్‌ ట్రోఫీని పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానున్నది.

    అయితే, స్టేడియాల ఆధునికీకరణ పనులు ఇంకా పూర్తవలసి ఉన్నాయని సమాచారం వచ్చింది.

    ఈ నేపధ్యంలో, పీసీబీ ట్రోఫీ ప్రారంభ వేడుకలకు సంబంధించిన షెడ్యూల్‌ను అప్రూవ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

    ఫిబ్రవరి 16న లాహోర్‌లో ప్రారంభ వేడుకలు జరగనుండగా, అంతర్జాతీయ క్రికెట్ బోర్డుల ప్రతినిధులు, ప్రముఖ సెలబ్రిటీలు, క్రికెట్ దిగ్గజాలు, ప్రభుత్వ అధికారి అతిథులను ఆహ్వానించనున్నారు.

    ప్రారంభ వేడుకల్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొనడంపై ఇంకా స్పష్టత లేదు.

    ఐసీసీ, పీసీబీ అధికారిక వర్గాలు ఇంకా దీనిపై ఎలాంటి ధృవీకరణను ఇచ్చి లేవు.

    వివరాలు 

    భారత్‌తో సంబంధించి అన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లో..

    ఫిబ్రవరి 16న ఎనిమిది జట్ల కెప్టెన్ల ప్రెస్ కాన్ఫరెన్సులు, ఫొటో షూట్‌లు నిర్వహించనున్నారు.

    తొలి మ్యాచ్ పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య కరాచీలో జరుగనుంది.

    భారత్‌తో సంబంధించి అన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగనున్నాయి.

    భారత టీమ్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తే, ఆ మ్యాచ్ కూడా దుబాయ్‌లోనే నిర్వహించడానికి ఐసీసీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

    ఐసీసీ నిర్ణయించిన డెడ్‌లైన్‌లో స్టేడియాల ఆధునికీకరణ పనులు పూర్తయ్యేలా పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

    ఫిబ్రవరి 7న ప్రధాని షెహబాజ్‌ షరీఫ్ గడాఫీ మైదానాన్ని ప్రారంభించనున్నారు.

    ఫిబ్రవరి 11న, కరాచీలోని నేషనల్ స్టేడియం ప్రారంభోత్సవానికి పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్ధారీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఛాంపియన్స్ ట్రోఫీ

    తాజా

    PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్
    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్

    ఛాంపియన్స్ ట్రోఫీ

    Team India : ఛాంపియన్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్‌గా గిల్ టీమిండియా
    Champions Trophy: ఫిజికల్ డిజెబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం క్రీడలు
    Rohit Sharma: ఫామ్ తాత్కాలికం.. క్లాస్ శాశ్వతం.. రోహిత్‌కు వీరాభిమాని లేఖ  రోహిత్ శర్మ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025