NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / 2023 ODI World Cup final: కంగారూలను కంగు తినిపించిన టీమిండియా.. అసలు మ్యాచ్ లో చేతులెత్తేసింది
    తదుపరి వార్తా కథనం
    2023 ODI World Cup final: కంగారూలను కంగు తినిపించిన టీమిండియా.. అసలు మ్యాచ్ లో చేతులెత్తేసింది
    కంగారూలను కంగు తినిపించిన టీమిండియా.. అసలు మ్యాచ్ లో చేతులెత్తేసింది

    2023 ODI World Cup final: కంగారూలను కంగు తినిపించిన టీమిండియా.. అసలు మ్యాచ్ లో చేతులెత్తేసింది

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 19, 2024
    01:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ 2023 క్రికెట్‌ అభిమానులకు గొప్ప ఉత్సాహాన్ని అందించిన విషయం అందరికీ తెలిసిందే.

    టీమిండియా అద్భుతమైన ప్రదర్శనతో వరుసగా పది మ్యాచ్‌లను గెలిచుతూ ఫైనల్‌ వరకు చేరుకుంది.

    సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన రోహిత్‌ శర్మ సేన, ఫైనల్‌లో మాత్రం ఓటమిని చవిచూసింది.

    ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత జట్టు ఒత్తిడికి లోనై టైటిల్‌ను చేజార్చుకుంది.

    ఈ పరాజయం కోట్లాది భారత క్రికెట్‌ అభిమానుల గుండెల్ని బరువెక్కించింది. ఆ మ్యాచ్‌ జరిగి నేటికి కచ్చితంగా ఒక సంవత్సరం పూర్తయింది.

    వివరాలు 

    43 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా 

    ఆ మ్యాచ్‌లో టాస్‌ ఓడిపోవడం భారత జట్టుకు ప్రతికూలంగా మారింది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

    ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 50 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది. రోహిత్‌ శర్మ (47), విరాట్‌ కోహ్లీ (54), కేఎల్‌ రాహుల్‌ (66) మెరుగైన ఆటతీరును ప్రదర్శించినా, మిగతా బ్యాట్స్‌మెన్లు నిరాశపరిచారు.

    లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా ట్రావిస్‌ హెడ్‌ (137) శతకంతో మెరుపులు మెరిపించగా, మార్నస్‌ లబుషేన్‌ (58) అర్ధశతకం చేసి చేయడంతో వారు గెలుపొందారు.

    కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఆస్ట్రేలియా 43 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది.

    వివరాలు 

    రాహుల్‌ ద్రావిడ్‌ కల ప్రపంచకప్‌  

    భారత జట్టు బలమైన స్థితిలో ఉండి కూడా ఫైనల్లో తడబడటం తీవ్ర విచారకరంగా మారింది.

    ముఖ్యంగా శుభ్‌మన్‌ గిల్‌ (4), శ్రేయస్‌ అయ్యర్‌ (4), సూర్యకుమార్‌ యాదవ్‌ (18), రవీంద్ర జడేజా (9) నిరాశపరిచారు.

    ఫైనల్‌లో ఓటమితో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ కలైన ప్రపంచకప్‌ గెలుపు అసాధ్యమైంది.

    అయితే, 2024లో టీ20 ప్రపంచకప్‌ విజయంతో భారత జట్టుకు కొంత ఉపశమనం లభించింది, కానీ 2023 వన్డే ప్రపంచకప్‌ ఓటమి అభిమానుల హృదయాల్లో ఆవేదనగా మిగిలిపోతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వన్డే వరల్డ్ కప్ 2023

    తాజా

    CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు  రేవంత్ రెడ్డి
    Jyoti Malhotra: పాక్ ISIతో సంబంధాలపై ఆరోపణలు.. యూట్యూబర్ జ్యోతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్ జ్యోతి మల్హోత్రా
    Ghattamaneni JayaKrishna: ఘట్టమనేని కుటుంబం నూతన హీరోగా జయకృష్ణ అరంగ్రేటం..? మహేష్ బాబు
    Mango seed: చర్మం నుంచి జీర్ణక్రియ వరకు.. మామిడి టెంకలతో అద్భుత ప్రయోజనాలివే! జీవనశైలి

    వన్డే వరల్డ్ కప్ 2023

    IND vs SA Preview: నువ్వా? నేనా?.. టీమిండియా జోరుకు దక్షిణాఫ్రికా బ్రేక్ వేస్తుందా? బర్త్ డే భాయ్ కోహ్లీపై ఫోకస్  టీమిండియా
    IND vs SA Toss: టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్  టీమిండియా
    virat Kohli@49: విరాట్ 49వ సెంచరీ.. సచిన్ సరసన కింగ్ కోహ్లీ విరాట్ కోహ్లీ
    IND vs SA: కోహ్లీ సెంచరీ, రోహిత్, జడేజా మెరుపులు.. టీమిండియా 326 పరుగులు  టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025