Page Loader
2023 ODI World Cup final: కంగారూలను కంగు తినిపించిన టీమిండియా.. అసలు మ్యాచ్ లో చేతులెత్తేసింది
కంగారూలను కంగు తినిపించిన టీమిండియా.. అసలు మ్యాచ్ లో చేతులెత్తేసింది

2023 ODI World Cup final: కంగారూలను కంగు తినిపించిన టీమిండియా.. అసలు మ్యాచ్ లో చేతులెత్తేసింది

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2024
01:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ 2023 క్రికెట్‌ అభిమానులకు గొప్ప ఉత్సాహాన్ని అందించిన విషయం అందరికీ తెలిసిందే. టీమిండియా అద్భుతమైన ప్రదర్శనతో వరుసగా పది మ్యాచ్‌లను గెలిచుతూ ఫైనల్‌ వరకు చేరుకుంది. సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన రోహిత్‌ శర్మ సేన, ఫైనల్‌లో మాత్రం ఓటమిని చవిచూసింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత జట్టు ఒత్తిడికి లోనై టైటిల్‌ను చేజార్చుకుంది. ఈ పరాజయం కోట్లాది భారత క్రికెట్‌ అభిమానుల గుండెల్ని బరువెక్కించింది. ఆ మ్యాచ్‌ జరిగి నేటికి కచ్చితంగా ఒక సంవత్సరం పూర్తయింది.

వివరాలు 

43 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా 

ఆ మ్యాచ్‌లో టాస్‌ ఓడిపోవడం భారత జట్టుకు ప్రతికూలంగా మారింది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 50 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది. రోహిత్‌ శర్మ (47), విరాట్‌ కోహ్లీ (54), కేఎల్‌ రాహుల్‌ (66) మెరుగైన ఆటతీరును ప్రదర్శించినా, మిగతా బ్యాట్స్‌మెన్లు నిరాశపరిచారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా ట్రావిస్‌ హెడ్‌ (137) శతకంతో మెరుపులు మెరిపించగా, మార్నస్‌ లబుషేన్‌ (58) అర్ధశతకం చేసి చేయడంతో వారు గెలుపొందారు. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఆస్ట్రేలియా 43 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది.

వివరాలు 

రాహుల్‌ ద్రావిడ్‌ కల ప్రపంచకప్‌  

భారత జట్టు బలమైన స్థితిలో ఉండి కూడా ఫైనల్లో తడబడటం తీవ్ర విచారకరంగా మారింది. ముఖ్యంగా శుభ్‌మన్‌ గిల్‌ (4), శ్రేయస్‌ అయ్యర్‌ (4), సూర్యకుమార్‌ యాదవ్‌ (18), రవీంద్ర జడేజా (9) నిరాశపరిచారు. ఫైనల్‌లో ఓటమితో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ కలైన ప్రపంచకప్‌ గెలుపు అసాధ్యమైంది. అయితే, 2024లో టీ20 ప్రపంచకప్‌ విజయంతో భారత జట్టుకు కొంత ఉపశమనం లభించింది, కానీ 2023 వన్డే ప్రపంచకప్‌ ఓటమి అభిమానుల హృదయాల్లో ఆవేదనగా మిగిలిపోతోంది.