తదుపరి వార్తా కథనం

Air India Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై క్రికెటర్లు సంతాపం
వ్రాసిన వారు
Sirish Praharaju
Jun 13, 2025
03:12 pm
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం గురువారం ప్రమాదవశాత్తు కూలిపోయింది.
మధ్యాహ్నం 1 గంట 38 నిమిషాలకు విమానం బయలుదేరిన కొద్ది సేపటిలోనే, విమానాశ్రయం సమీపంలో ఉన్న మేఘానీనగర్లోని జీజే వైద్య కళాశాల హాస్టల్ భవనంపై అది నేలకొరిగింది.
ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 265 మంది తమ ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషాద ఘటనపై భారత క్రికెట్ జట్టు సభ్యులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు, అఫ్గనిస్థాన్కు చెందిన క్రికెటర్ రషీద్ ఖాన్ కూడా స్పందించారు.
సోషల్ మీడియా వేదికగా వారు ప్రాణాలు కోల్పోయినవారికి శ్రద్ధాంజలులు అర్పించగా, వారి కుటుంబ సభ్యుల పట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.