Page Loader
IPL 2025: ఐపీఎల్‌ మెగా వేలంలో కొత్తగా ముగ్గురు తెలుగు క్రికెటర్లు.. వాళ్ళ రికార్డ్స్ ఇవే..
ఐపీఎల్‌ మెగా వేలంలో కొత్తగా ముగ్గురు తెలుగు క్రికెటర్లు.. వాళ్ళ రికార్డ్స్ ఇవే..

IPL 2025: ఐపీఎల్‌ మెగా వేలంలో కొత్తగా ముగ్గురు తెలుగు క్రికెటర్లు.. వాళ్ళ రికార్డ్స్ ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 28, 2024
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. ఈ సీజన్‌లో ఆటగాళ్ల నైపుణ్యాల ఆధారంగా ఫ్రాంఛైజీలు వారిపై భారీ ధరలు పెట్టాయి. కొంతమంది యువ ప్లేయర్లు అనూహ్యంగా అధిక ధరలకు అమ్ముడై క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచారు. వీరిలో పలు తెలుగు కుర్రాళ్లు కూడా భాగంగా ఉన్నారు. IPL 2025: సత్యనారాయణ రాజు కాకినాడకు చెందిన ఫాస్ట్ బౌలర్ సత్యనారాయణ రాజు ఈ మెగా వేలంలో రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో పాల్గొన్నాడు.అతడి కనీస ధరతోనే ముంబయి ఇండియన్స్ అతన్ని కొనుగోలు చేసింది.ఈ ఏడాది సత్యనారాయణ రంజీ,ముస్తాక్ అలీ ట్రోఫీలలో మంచి ప్రదర్శన కనబరిచాడు.విజయ హజారే వన్డే ట్రోఫీలోనూ మెరిశాడు.ముంబయి జట్టులో తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ కూడా ఉన్నాడు, అతన్ని రూ.8 కోట్లకు రిటైన్ చేసింది.

వివరాలు 

IPL 2025: త్రిపురణ విజయ్ 

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ త్రిపురణ విజయ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. అతడు 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 16 వికెట్లు సాధించి 150 పరుగులు చేశాడు. రంజీ, కూచ్‌బెహర్ ట్రోఫీలలో సత్తా చాటి ప్రస్తుతం ముస్తాక్ అలీ టోర్నీలో మంచి ప్రదర్శన చూపిస్తున్నాడు. IPL 2025: పైలా అవినాష్ విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నుంచి ఉన్న క్రికెటర్ పైలా అవినాష్ ఈ సీజన్‌లో ఐపీఎల్‌ అవకాశాన్ని అందుకున్నాడు.అతన్ని రూ.30 లక్షల ధరతో పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. అవినాష్ క్లబ్ క్రికెట్, ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో మంచి ప్రదర్శన చేశాడు. ఒక మ్యాచ్‌లో 58 బంతుల్లో 105 పరుగులు చేసి హిట్టర్‌గా పేరు సంపాదించాడు.

వివరాలు 

IPL 2025: షేక్ రషీద్ 

గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ 2022 అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. సెమీస్, ఫైనల్‌లో మెరుపు ప్రదర్శనతో జట్టు విజయానికి కీలకంగా మారాడు. చెన్నై సూపర్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసినప్పటికీ తుది జట్టులో ఆడలేదు. ఈ సారి ₹30 లక్షలకు అతన్ని కొనుగోలు చేసింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఐదు తెలుగు కుర్రాళ్లకు అవకాశాలు లభించాయి.టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్ ₹12.25 కోట్లతో కొనుగోలు చేసింది. అలాగే,నితీశ్ కుమార్ రెడ్డి సన్‌ రైజర్స్ హైదరాబాద్‌లో ₹6 కోట్లకు రిటైన్ అయ్యాడు.అయితే,ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన కేఎస్ భరత్,బైలపూడి యశ్వంత్,సిరిసిల్ల కుర్రాడు ఆరవెల్లి అవనీశ్‌కు నిరాశ ఎదురైంది,ఎందుకంటే ఏ ఫ్రాంఛైజీ కూడా వారిని కొనుగోలు చేయలేదు.