NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / BCCI: భారత్‌ - పాకిస్థాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు.. ఐపీఎల్‌కు ఎలాంటి ఆటంకం లేదన్న బీసీసీఐ..! 
    తదుపరి వార్తా కథనం
    BCCI: భారత్‌ - పాకిస్థాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు.. ఐపీఎల్‌కు ఎలాంటి ఆటంకం లేదన్న బీసీసీఐ..! 
    భారత్‌ - పాకిస్థాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు.. ఐపీఎల్‌కు ఎలాంటి ఆటంకం లేదన్న బీసీసీఐ..!

    BCCI: భారత్‌ - పాకిస్థాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు.. ఐపీఎల్‌కు ఎలాంటి ఆటంకం లేదన్న బీసీసీఐ..! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 07, 2025
    01:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్,పాకిస్థాన్ దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు ఇప్పుడు మరింత పెరిగిపోయాయి.

    'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత్ ఈ తెల్లవారుజామున పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది.

    ఈ దాడుల్లో భారత్ సైన్యం క్షిపణులతో విరుచుకుపడింది.తాజా సమాచారం ప్రకారం,దాదాపు 80 మంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో మృతిచెందినట్లు తెలుస్తోంది.

    రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్నపెరిగిన ఉద్రిక్తతలు ఈ ఆపరేషన్‌తో మరింత తీవ్రమయ్యాయి.

    ఈఉద్రిక్త వాతావరణం మధ్య ఐపీఎల్2025 సీజన్‌పై అనేక అనుమానాలు తెరపైకి వచ్చాయి.

    ఈ నెల 25వరకు కొనసాగాల్సిన షెడ్యూల్ ఉన్న ఐపీఎల్ సీజన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో కొనసాగుతుందా లేదా అనే ప్రశ్నలు అభిమానులను కలవరపెడుతున్నాయి.

    సోషల్ మీడియాలో కూడా ఐపీఎల్ రద్దుకై ఊహాగానాలు ఊపందుకున్నాయి.

    వివరాలు 

    బీసీసీఐ ప్రతినిధులు స్పష్టత

    ఈ నేపథ్యంలో బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ప్రతినిధులు స్పష్టత ఇచ్చారు.

    భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఐపీఎల్ పై ఎలాంటి ప్రభావం చూపబోవని, టోర్నమెంట్ యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు.

    పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం ఇవాళ పాకిస్థాన్‌లోని ఉగ్రవాద గూళ్లపై మెరుపుదాడులకు పాల్పడిందని వెల్లడించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     ఐపీఎల్‌కు ఎలాంటి ఆటంకం లేదన్న బీసీసీఐ..!

    BCCI SOURCE VIA ANI/VIPUL KASHYAP:

    "IPL will be run as per schedule - the situation will be monitored & depending on circumstances a call will be taken". pic.twitter.com/dI0kWjy8Ci

    — Johns. (@CricCrazyJohns) May 7, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీసీసీఐ

    తాజా

    BCCI: భారత్‌ - పాకిస్థాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు.. ఐపీఎల్‌కు ఎలాంటి ఆటంకం లేదన్న బీసీసీఐ..!  బీసీసీఐ
    Tollywood: చిరంజీవితో తీద్దామనుకుని.. చివరకు వెంకటేష్‌తో చిత్రీకరణ - కృష్ణంరాజు కేసుతో డిజాస్టర్  టాలీవుడ్
    PM Modi: ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో.. పలు దేశాల పర్యటనలను రద్దు చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ  నరేంద్ర మోదీ
    Khawaja Asif: వెనక్కి తగ్గిన పాకిస్థాన్.. 'దాడులను ఆపండి.. మేము ఏమీ చేయము' పాక్  రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్   పాకిస్థాన్

    బీసీసీఐ

    Sana Ganguly: రోడ్డు ప్రమాదం.. గంగూలీ కుమార్తె కారును ఢీకొట్టిన బస్సు సౌరబ్ గంగూలీ
    ICC - Cricket: టెస్టుల్లో '2-టైర్' విధానంపై జై షా ఉత్సాహం.. కొత్త దశలో టెస్టు క్రికెట్ ఐసీసీ
    Champions Trophy 2025: రోహిత్ శర్మకు మరో అవకాశం.. ఛాంపియన్ ట్రోఫీకి కెప్టెన్‌గా కొనసాగించనున్న బీసీసీఐ రోహిత్ శర్మ
    BCCI: టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ రివ్యూ.. సీనియర్ల భవిష్యత్తు ఏమిటి? టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025