
KL Rahul: భారత్-ఎ తరఫున రెండో అనధికారిక టెస్ట్ ఆడేందుకు.. ఇంగ్లండ్ వెళ్లనున్న టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా అనుభవజ్ఞుడైన క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలోనే ఇంగ్లండ్ ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు.
వచ్చే సోమవారం రోజున రాహుల్ ఇంగ్లండ్ బయలుదేరనున్నట్లు సమాచారం.
జూన్లో ఇంగ్లండ్ జట్టుతో జరిగే టెస్టు సిరీస్ను దృష్టిలో ఉంచుకొని, ముందుగా సిద్ధతలు చేసుకునే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున పాల్గొన్న రాహుల్, ప్రస్తుతం ఇంగ్లండ్లో టూర్ చేస్తోన్న ఇండియా ఏ జట్టులో పాల్గొనాలని భావిస్తున్నాడు.
టెస్టు జట్టుకు ఎంపికైన రాహుల్, ప్రధాన సిరీస్కు ముందు తాను మంచి ప్రాక్టీస్ చేయాలన్న ఉద్దేశంతో ముందుగానే ఇంగ్లండ్ వెళ్లాలని అనుకుంటున్నాడు.
ఈ ప్రయాణానికి బీసీసీఐ అనుమతిని కూడా అతను పొందినట్లు సమాచారం.
వివరాలు
జూన్ 6న ఇండియా ఏ జట్టు,ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో రెండవ అనధికార టెస్టు
ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో ఇండియా ఏ జట్టు టెస్టు మ్యాచ్లు ఆడనుంది.మే 30న కెంటర్బరీ వేదికగా మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
అయితే ఆ మ్యాచ్కు రాహుల్ హాజరు కావడం సాధ్యపడదు.కానీ,రెండవ టెస్టు మ్యాచ్లో పాల్గొనడానికి అతనికి అనుమతి లభించింది.
అందుకే ఆయన త్వరితగతిన ఇంగ్లండ్కు బయలుదేరే ఏర్పాట్లు చేసుకున్నాడు.
రాహుల్ సోమవారం ఇంగ్లండ్కు వెళ్తాడని, జూన్లో జరిగే రెండవ అనధికార టెస్టులో ఇండియా ఏ తరఫున ఆడతాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
జూన్ 6న ఇండియా ఏ జట్టు,ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో రెండవ అనధికార టెస్టు ప్రారంభంకానుంది.
మరోవైపు,సీనియర్ పురుషుల జట్టు జూన్ 13న ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.అనంతరం,ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి లీడ్స్ వేదికగా మొదలుకానుంది.