
ENG vs IND: బుమ్రాకు కాస్త సపోర్ట్ చెయ్యండి : భారత బౌలర్లకు షమీ సూచన
ఈ వార్తాకథనం ఏంటి
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపించింది. తొలి ఇన్నింగ్స్లో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు పడగొట్టినప్పటికీ, రెండో ఇన్నింగ్స్లో ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. మరోవైపు, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఎక్కువ పరుగులు ఇచ్చిన కారణంగా భారత్కు నష్టం కలిగింది. ఫలితంగా 370కి పైగా లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత్ విఫలమైంది. ఈ నేపథ్యంలో భారత బౌలింగ్ యూనిట్పై సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బుమ్రాకు మిగతా బౌలర్లు అవసరమైన మద్దతు ఇవ్వాలని సూచించాడు.
వివరాలు
బౌలింగ్ యూనిట్ పైన ఇంకా ఎక్కువగా దృష్టి పెట్టాలి
"భారత బౌలర్లు ఇంకా బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. జస్ప్రీత్ బుమ్రాతో మిగతా బౌలర్లు సంప్రదించాలి. అతడిని గమనించి,ఎలాంటి ప్రణాళికలతో బౌలింగ్ చేయాలో తెలుసుకోవాలి. బుమ్రాకు సహకరించడం ద్వారా టీమ్గా మనం విజయం వైపుగా ముందుకు సాగగలము. నేను మొదటి టెస్టు గురించి మాట్లాడుతున్నాను. బౌలింగ్ యూనిట్ పైన ఇంకా ఎక్కువగా దృష్టి పెట్టాలి,"అని షమీ వ్యాఖ్యానించాడు.
వివరాలు
బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసే మార్గాలను అన్వేషించాలి
"రెండో ఇన్నింగ్స్లో శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ ఒక్కొక్కటి రెండు వికెట్లు తీయగలిగారు. అయితే అప్పటికే మ్యాచ్ భారత జట్టు చేతుల నుంచి జారిపోయింది. ముఖ్యంగా,కొత్త బంతితో వికెట్లు తీయడమే కీలకం.బుమ్రాకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది.ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో భారత బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లకు చాలా సులభంగా పరుగులు ఇచ్చారు.ఈ విషయాన్ని మనం పరిగణనలోకి తీసుకొని,బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసే మార్గాలను అన్వేషించాలి" అని షమీ వివరించాడు.
వివరాలు
జూలై 2 నుంచి ఇంగ్లాండ్ - భారత్ జట్ల మధ్య రెండో టెస్టు
ఇదిలా ఉండగా, జూలై 2 నుంచి ఎడ్జ్బాస్టన్ మైదానంలో ఇంగ్లాండ్ - భారత్ జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్లో బుమ్రా ఆడే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతనిపై శారీరక భారం పడకుండా ఉండేందుకు టీమ్ఇండియా మేనేజ్మెంట్ చర్యలు తీసుకుంటోంది. అందుకే మూడు టెస్టుల్లో మాత్రమే బుమ్రాను వినియోగించాలనే ఆలోచనలో ఉంది. ఈ కారణంగా రెండో టెస్టు నుంచి అతడికి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తుండటం సమాచారం. అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.